టిమ్ కుక్ సారధ్యంలో తొలి యాపిల్ వాచ్ లాంఛ్ అయి పదేండ్లు కావడంతో అందుకు గుర్తుగా వాచ్ ఎక్స్ పేరుతో న్యూ స్మార్ట్వాచ్ తయారీపై యాపిల్ కసరత్తు సాగిస్తోంది. యాపిల్ వాచ్ ఎక్స్ 2024 లేదా 2025లో కస్టమర్ల ముందుకు వస్తుందని యాపిల్ అనలిస్ట్, బ్లూమ్బర్గ్కు చెందిన మార్క్ గుర్మన్ పేర్కొన్నారు. 2014లో యాపిల్ స్మార్ట్వాచ్ క్యాటగిరీని ప్రకటించగా మరుసటి ఏడాది యాపిల్ వాచ్ మార్కెట్లో సందడి చేసింది. భారీ బ్యాటరీకి అనుకూలంగా యాపిల్ వాచ్ ఎక్స్ న్యూ డిజైన్తో రానుందని భావిస్తున్నారు. భిన్నమైన వ్యూయింగ్ అనుభూతిని అందించేందుకు యాపిల్ న్యూ స్మార్ట్వాచ్ మైక్రోఎల్ఈడీ డిస్ప్లేతో ఆకట్టుకుంటుందని గుర్మన్ అంచనా వేశారు. యాపిల్ లేటెస్ట్ స్మార్ట్వాచ్ బీపీ మానిటరింగ్ ఫీచర్ను కూడా కలిగిఉంటుందని చెబుతున్నారు. స్ట్రాప్ డిజైన్ కూడా యాపిల్ మార్చే దిశగా కసరత్తు సాగిస్తున్నదని గుర్మన్ తన లేటెస్ట్ పవర్ ఆన్ న్యూస్లెటర్లో రాసుకొచ్చారు. న్యూ స్ట్రాప్ యాపిల్ వాచ్ ఎక్స్ లేదా ఈ ఏడాది రానున్న వాచ్ 9 సిరీస్తో ఎంట్రీ ఇవ్వనుంది. ఇక యాపిల్ వాచ్ 9లో పెద్దగా మార్పులు ఉండవని గుర్మన్ చెబుతున్నారు. ఇక ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రొ స్మార్ట్ఫోన్లతో కలిసి న్యూ వాచ్ సిరీస్ 9 సెప్టెంబర్ 12న యాపిల్ లాంఛ్ చేస్తుందని భావిస్తున్నారు.
0 Comments