వాట్సాప్ మరో అప్డేట్తో యూజర్స్ ముందుకు రానుంది. అకౌంట్ వెరిఫికేషన్ కోసం ఈ-మెయిల్ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకోనుంది. వినియోగదారుల ప్రైవసీని కాపాడటమే లక్ష్యంగా వాట్సాప్ ఈ మార్పును తీసుకువస్తున్నట్లు ఓ ప్రముఖ వెబ్సైట్ తెలిపింది. హ్యాకర్ల బారి నుంచి వినియోగదారుల గోప్యతను కాపాడటమే లక్ష్యంగా వాట్సాప్ ఈ కీలక మార్పు తీసుకువస్తున్నట్లు Wabetainfo వెబ్సైట్ వెల్లడించింది. ఇప్పటికే యూజర్స్ సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ వాట్సాప్లో అందుబాటులో ఉంది. ఇదే కాకుండా ఇటీవలీ కాలంలో సెక్యురిటీ పరంగా సైలెన్స్ అన్నోన్ కాలర్స్, చాట్ లాక్ వంటి అనేక మార్పులు తీసుకువచ్చింది. కాగా, ఇన్ని మార్పులు చేస్తూ వస్తున్న వాట్సాప్ను మాత్రం హ్యాకర్లు ఏదో విధంగా హ్యాక్ చేస్తునే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్స్తో తమ డెవలెప్మెంట్ టీమ్ను ఎప్పటికప్పుడు సన్నద్ధం చేస్తుంది మెటా సంస్థ. సెక్యురిటీ డెవలెప్మెంట్లో భాగంగా త్వరలో రానున్న నయా ఫీచర్ ఏంటంటే.. ఒక యూజర్ వాట్సాప్ను యాక్సెస్ లేదా అకౌంట్ను వెరిఫై చేయాలంటే ఈ-మెయిల్ ఐడీని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దీనిపైనే పనిచేస్తుంది వాట్సాప్. అయితే యూజర్ను ధ్రువీకరించడానికి తేనున్న ఈ ఈ-మెయిల్ వెరిఫికేషన్ ఆప్షన్ను యాప్లో ఆప్షనల్గా చేర్చనున్నారని Wabetainfo తెలిపింది. ఈ-మెయిల్ వెరిఫికేషన్ ఆప్షన్ను ఎనేబుల్ చేసుకుంటే మీ ఖాతా వెరిఫై కోసం తప్పనిసరిగా మెయిల్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్లో పెట్టుకుంటే మెయిల్ లేకుండానే లాగిన్ అవ్వచ్చు. కాగా, ప్రస్తుతానికి ఈ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉంది. యాప్కి సంబంధించి ఫ్యూచర్ అప్డేట్స్లో దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
0 Comments