Ad Code

రెండు గంటలలో 30 వేల ఫోన్ల అమ్మకం !


రియల్ మీ GT5-5G స్మార్ట్ మొబైల్ లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ -2 ప్రాసెస్ తో పనిచేస్తుంది. ఈ మొబైల్ 24 జిబి ర్యామ్ తో లభిస్తుంది. ప్రస్తుతం వరల్డ్ వైజ్ గా 24 GB తో పనిచేస్తున్న స్మార్ట్ మొబైల్స్ కేవలం రెండు మాత్రమే ఉన్నాయట.. అందులో ఈ రియల్మీ GT -5G కూడా ఒకటి.. ఇటివలే స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన తొలి సేల్ ని సైతం ప్రకటించగా రికార్డు స్థాయిలో అమ్ముడుపోయినట్టుగా తెలుస్తోంది. కేవలం రెండు గంటలలోనే ఏకంగా 30 వేలకు పైగా మొబైల్స్ అమ్ముడుపోవడం గమనార్హం.12GB+256 స్టోరీస్ మెమొరీ గల మొబైల్ ధర రూ.35,000 వేలు కాగా..24GB+1TB కెపాసిటీ కలిగిన మొబైల్ ధర రూ.43,000 రూపాయలు పలు రకాల మోడల్స్ బట్టి ధరలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే..6.74 అంగుళాలతో కూడిన ఓ ఎల్ ఈ డి డిస్ప్లే కలదు.. ఈ స్మార్ట్ మొబైల్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది.50 mp ప్రైమరీ కెమెరాలు అందిస్తుంది.16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందిస్తుంది.. బ్యాటరీ విషయానికి వస్తే..4600AMH బ్యాటరీ తో పాటు 240 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఇంతటి పాస్టర్ కలిగిన ఛార్జింగ్ ఇదే మొదటిసారి కలిగిన మొబైల్ అని చెప్పవచ్చు.. సెప్టెంబర్ రెండవ తేదీన లాంచ్ కావడం జరిగింది ఈ మొబైల్. స్నాప్ డ్రాగన్ 8th జనరేషన్ తో ఈ మొబైల్ ఉన్నది. 

Post a Comment

0 Comments

Close Menu