Ad Code

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8 ధర తగ్గింపు !

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8కు సంబంధించిన 128 జీబీ వైఫై వేరియంట్ ను రూ.66,999కి శాంసంగ్ విడుదల చేసింది. ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్ ని ఇప్పుడు రూ. 48,999కి కొనుగోలు చేయవచ్చు. గ్రాఫైట్, సిల్వర్, పింక్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో ఈ టాబ్లెట్ వస్తుంది. దీనితో పాటు శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8ని కొనుగోలు చేసే వారికి శాంసంగ్ కొన్ని ఆఫర్లను కూడా ఇస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్లపై వినియోగదారులు రూ. 6,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ టాబ్లెట్ పై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఇది నెలకు రూ. 4,226 నుంచి ప్రారంభం అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8లో 2560×1600 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉన్న 11 అంగుళాల WQXGA డిస్ప్లేను అందించారు. ఈ డివైస్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుంది. ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్ క్వాల్కాం స్నాప్డ్రాగన్ చిప్సెట్ ద్వారా పని చేయనుంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, 6 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉంది. వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8లో 8000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇటీవలే శాంసంగ్ భారతదేశంలో కొత్త శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9 సిరీస్ శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9 అల్ట్రాను లాంచ్ చేసింది. ఈ సిరీస్ ధర రూ. 85,999 నుంచి ప్రారంభం అవుతుంది. మన దేశంలో వీటికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ప్రారంభం అయ్యాయి.

Post a Comment

0 Comments

Close Menu