Ad Code

స్మార్ట్‌ఫోన్ ఏన్నేళ్లు సర్వీసు ఇస్తుంది ?


మార్కెట్‌లో రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి. చాలా కంపెనీలు కొత్త ఫోన్‌తో మూడు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ ని అప్‌గ్రేడ్ చేస్తామని కస్టమర్‌లకు వాగ్దానం చేస్తాయి. ఇది మాత్రమే కాదు.. OS అప్‌గ్రేడ్‌లతో పాటు, కొన్ని కంపెనీలు కస్టమర్ల భద్రత కోసం ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా అందిస్తున్నాయి. కొన్ని స్మార్ట్‌ ఫోన్లు అప్‌డేట్స్‌ అందించడం నిలిపివేస్తాయి. మరికొన్ని స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు మూడు, నాలుగు సంవత్సరాల పాటు అప్‌డేట్‌ అందిస్తూనే ఉంటాయి. తద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌లకు ఎటువంటి సమస్య లేదా వైరస్ దాడి జరగకుండా, భద్రత కోసం అప్‌డేట్‌లు అందిస్తాయి. అయితే మీ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ ఈ అప్‌డేట్‌ను అందించడం ఆపివేసినప్పుడు ఫోన్‌ను మార్చడం మంచిదని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. బడ్జెట్ స్మార్ట్ ఫోన్, ఖరీదైన ఫోన్ అనే తేడా లేదు. ఏ ఫోన్ అయినా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ఇవ్వడం మానేస్తే దాని జీవితం ముగిసినట్టే. 10,000 రూ. చౌక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీలు సాధారణంగా వినియోగదారులకు OS అప్‌డేట్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లను చాలా కాలం పాటు అందిస్తామని వాగ్దానం చేయవు. కానీ మరోవైపు, ఫ్లాగ్‌షిప్ ఫీచర్‌లతో వచ్చే ఖరీదైన మొబైల్‌లను కలిగి ఉన్న కంపెనీలు వినియోగదారులకు OS అప్‌డేట్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లను మరింత తరచుగా అందిస్తాయి. దీని కారణంగా, ఈ నమూనాలు సురక్షితంగా ఉంటాయి. అలాగే చాలా కాలం పాటు ఉపయోగించవచ్చు. స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసిన తర్వాత దానిని జాగ్రత్తగా వాడుకోవడం చాలా ముఖ్యం. ఫోన్‌ సర్వీసు ఎక్కువ కాలం రావాలంటే ఇష్టానుసారంగా యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. అనవసరమైన యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేయడం వల్ల బ్యాటరీ త్వరగా అయిపోవడమే కాకుండా ఫోన్‌ సర్వీసు కూడా త్వరగా ముగిసే అవకాశం ఉంది. దీని వల్ల ఫోన్‌పై మరింత ఒత్తిడి పెరిగిపోతుంటుంది. అలాగే ఛార్జింగ్‌ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, బ్యాటరీ పూర్తిగా అయిపోయే వరకు స్మార్ట్‌ ఫోన్‌ ఎప్పుడు వాడకూడదని సూచిస్తున్నారు. అలాగే ఫోన్‌ ఛార్జింగ్‌ వంద శాతం కూడా ఉండకూడదని చెబుతున్నారు. ఎప్పుడు కూడా ఫోన్‌లో గేమ్స్‌ వాడటం వల్ల కూడా ఫోన్‌ వేడెక్కి త్వరగా పాడైపోయే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu