Ad Code

'క్లౌడ్'​తో రిలయన్స్ జియో మేజిక్ !

అతి తక్కువ బడ్జెట్లో క్లౌడ్​ ల్యాప్​టాప్​ తీసుకువచ్చేందుకు రిలయన్స్ జియో సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా ఒకే ల్యాప్​టాప్​ను ఎక్కువ మంది యూజర్లు వాడుకోవడానికి వీలవుతుంది. అయితే ఇందుకోసం యూజర్లు ప్రత్యేకంగా సబ్​స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.  రిలయన్స్ జియో ఇటీవలే జియోబుక్ పేరుతో ఒక లో-కాస్ట్​ ల్యాప్​టాప్​ను అందుబాటులోకి తెచ్చింది. దీని ధర  రూ.14,499. వాస్తవానికి ఇది కేవలం బేసిక్ కంప్యూటింగ్​కు మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రొఫెషనల్ వర్క్​కు ఇది ఏ మాత్రం ఉపయోగపడదు. అందుకే రిలయన్స్ జియో దీనికి 'క్లౌడ్' సపోర్ట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. జియో తీసుకురానున్న ఈ క్లౌడ్​ ల్యాప్​టాప్ అనేది ఒక డంబ్​ టెర్నినల్ మాత్రమే అని గుర్తించుకోవాలి. అయితే దీని ప్రాసెసింగ్, స్టోరేజ్ అంతా జియో క్లౌడ్​లోనే జరుగుతుంది. అందువల్ల కంప్యూటర్​లో చాలా ఖరీదైన సూపర్​ ప్రాసెసర్​, స్టోరేజ్ డివైజ్​లు ఉండాల్సిన అవసరం ఉండదు. కనుక ల్యాప్​టాప్​ ధర చాలా వరకు తగ్గుతుంది. ప్రస్తుతం జియో కంపెనీ హెచ్​పీ క్రోమ్​బుక్​లో క్లౌడ్​ కంప్యూటింగ్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. రిలయన్స్ జియో అతి తక్కువ ధరకే ల్యాప్​టాప్​ అందించాలనే లక్ష్యంతో ఈ క్లౌడ్ ల్యాప్​టాప్​ కాన్సెప్ట్​ను తీసుకువస్తోంది. అయితే ఈ సర్వీస్ వాడుకోవాలంటే.. యూజర్లు కచ్చితంగా జియో క్లౌడ్​ సబ్​స్క్రిప్షన్​ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ జియో క్లౌడ్ ల్యాప్​టాప్​ వల్ల విద్యాసంస్థలకు ఆర్థికంగా బాగా కలిసిరానుంది. ఎలా అంటే.. విద్యా సంస్థలు తమ విద్యార్థుల కోసం భారీ స్థాయిలో హార్డ్​వేర్స్​ను కొనుగోలు చేస్తూ ఉంటాయి. దీని వల్ల వాటిపై చాలా ఆర్థిక భారం పడుతుంది. ఒకసారి జియో క్లౌడ్​ ల్యాప్​టాప్ అందుబాటులోకి వస్తే.. ఈ ఖర్చులు భారీగా తగ్గే అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఎంటర్​ప్రైజెస్​కు కూడా జియో క్లౌడ్ ల్యాప్​టాప్స్ బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. జియో కంపెనీ ఈ క్లౌడ్ ల్యాప్​టాప్​ను ఎప్పుడు మార్కెట్​లోకి తెస్తుందో ఇంకా వెల్లడించలేదు.

Post a Comment

0 Comments

Close Menu