Ad Code

స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో భారీ వృద్ధి !


భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న స్మార్ట్ ఫోన్ల సంఖ్య గత 7 నెలల్లో 60 శాతం పెరిగింది. మరోవైపు ఐఫోన్ల ఎగుమతిలో 177 శాతం వృద్ధి కనిపించింది. అదే సమయంలో గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో మొత్తం 4.97 బిలియన్ డాలర్ల (మనదేశ కరెన్సీలో దాదాపు రూ.41 వేల కోట్లు) విలువైన స్మార్ట్ ఫోన్లు ఎగుమతి అయ్యాయని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సగటున ప్రతి నెలా ఒక బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఫోన్లు ఎగుమతి అవుతున్నాయని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తన ట్వీట్లో తెలిపారు. ప్రభుత్వ డేటా ప్రకారం కంపెనీ భారతదేశంలోని తన ముగ్గురు వెండర్ల ద్వారా 1.8 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి 5 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ ఫోన్లు ఎగుమతి అయ్యాయి. వార్షిక ప్రాతిపదికన దేశం నుంచి స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో 61 శాతం వృద్ధి నమోదైంది. కేంద్ర ప్రభుత్వం పీఎల్ఐ పథకం కింద యాపిల్ మూడో సంవత్సరం కూడా భారతదేశంలో తన తయారీని పెంచింది. దీంతో ఐఫోన్ మార్కెట్ షేర్ గణనీయంగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో మొత్తం స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో ఐఫోన్ వాటా 62 శాతంగా ఉంది. దీని తర్వాతి స్థానంలో మిగిలిన స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. గతేడాది 5.8 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ఫోన్లు ఎగుమతి అయ్యాయి. ఇందులో ఐఫోన్ వాటా 22 శాతంగా ఉంది. తైవాన్ కు చెందిన ఫాక్ స్కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ కంపెనీలు భారతదేశంలో భాగస్వామ్యం ద్వారా ఐఫోన్లను తయారు చేస్తున్నాయి. విస్ట్రాన్ ను ఇటీవలే టాటా ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేసింది. ఐఫోన్ 11, ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్లు భారతదేశంలో తయారు అయ్యాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ భారతదేశంలో ఏడు శాతం ఐఫోన్లను తయారు చేసింది. స్మార్ట్ ఫోన్ల తయారీలో చైనా ఆధిపత్యాన్ని సవాలు చేసే దిశగా భారత్ దూసుకుపోతుంది.

Post a Comment

0 Comments

Close Menu