Ad Code

ఫ్లిప్​కార్ట్​ బిగ్​ దీపావళి సేల్​లో మొబైల్స్​పై భారీ ఆఫర్స్​ !


రేపటి నుంచి  ఫ్లిప్​కార్ట్ బిగ్ దీపావళి సేల్​  ప్రారంభం కానుంది. ఫ్లిప్​కార్ట్ ప్లస్​ మెంబర్స్​కు నేటి నుంచే ఈ సేల్ అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్​కార్ట్ ఐఫోన్​ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ల వరకు అన్నింటిపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్​ ప్రకటించింది. ముఖ్యంగా ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 , మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్లపై డిస్కౌంట్​లను ప్రకటించింది. ఈ డీల్స్​ నవంబర్​ 11 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఫ్లిప్​కార్ట్ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్​లో ఐఫోన్ 14 ధర రూ.61,999గా ఉంటుంది. కానీ ఫ్లిప్​కార్ట్ ఈ దీపావళి సేల్​లో దానిని రూ.54,999కే అందుబాటులో ఉంచింది. అయితే బ్యాంక్​ డిస్కౌంట్​ కింద రూ.4,000, ఎక్స్ఛేంజ్ ఆఫర్​ రూ.1000 అప్లై చేస్తే.. ఈ దీపావళి సేల్​లో ఐఫోన్​ 14ను కేవలం రూ.49,999కే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్​ 14 ప్లస్​ ధర ప్రస్తుతం రూ.79,900 వరకు ఉంది. కానీ ఫ్లిప్​కార్ట్​ దీపావళి సేల్​లో దీనిని కేవలం రూ.59,999కే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్​కార్ట్​లో దీపావళి సేల్​లో మోటోరోలా 40 మోడల్ రూ.25,999కు లభిస్తోంది. నథింగ్​ ఫోన్ ఈ ఫెస్టివ్​ సేల్​లో రూ.33,999కు అందుబాటులో ఉంది. వివో టీ 2 ప్రో రూ.21,999కే కొనుగోలు చేయవచ్చు. పోకో ఎక్స్​ 5 ప్రో ఫోన్​ను ఈ సేల్​లో రూ.18,499కే సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ F14 5జీ మొబైల్​పై ఈ సేల్​లో రూ.9000 వరకు డిస్కౌంట్​ అందిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ F34 5G Model రూ.14,999కే లభిస్తోంది. పిక్సెల్ 7ఏ ఫోన్​ను ఈ సేల్​లో రూ.31,499కు పొందవచ్చు. ఫ్లిప్​కార్ట్​లో మోటోరోలా ఎడ్జ్​ నియో ఫోన్​లపై కూడా భారీ డిస్కౌంట్స్​ను అందిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu