Ad Code

గూగుల్ పే ద్వారా చేసే మొబైల్ రీఛార్జ్​పై కన్వీనియన్స్ ఫీజు ?


గూగుల్ పే ద్వాారా చేసే మొబైల్ రీఛార్జ్​లపై ఆ సంస్థ కన్వీనియన్స్ ఫీజును విధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ నెటిజన్​ సామాజిక మాద్యమం ఎక్స్​లో పోస్ట్ చేశారు. అయితే దీనిని గూగుల్ పే సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. ఇప్పటికే ఫోన్​ పే, పేటీఎం లాంటి సంస్థలు యూపీఐ ద్వారా చేసే మొబైల్​ రీఛార్జ్​లకు రుసుమును వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో గూగుల్ పే కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. ముకుల్ శర్మ అనే వ్యక్తి ట్విట్టర్​లో సంబంధిత పోస్ట్​ను షేర్​ చేశారు. ఆయన గూగుల్ పే యాప్ ద్వారా రూ. 749 రూపాయలు జియో ప్రీపెయిడ్ రీచార్జ్​ చేసుకున్నారు. దీనిపై రూ.3 కన్వీనియన్స్ ఫీజు​ విధించినట్లుగా మెసేజ్​ వచ్చింది. అయితే రూ. 100లోపు గూగుల్ పే ద్వారా రీఛార్జ్ చేసేవారికి ఈ నిబంధన వర్తించదని ముకుల్ శర్మ సామాజిక మాధ్యమం ఎక్స్​లో షేర్​ చేశారు. ఆ పోస్ట్ ప్రకారం రూ. 100 నుంచి రూ.200 వరకు కన్వీనియన్స్​ ఛార్జ్​ రూ.2లు, రూ. 200 నుంచి రూ.300 వరకు చేసే రీఛార్జ్​లపై రూ.3 లు ఛార్జ్ చేస్తుంది. రూ.300పైన చేసిన రీఛార్జులకు కూడా రూ. 3 ఛార్జీ ఉందని ముకుల్ శర్మ తెలిపారు. కన్వీనియన్స్​ ఫీజుకు సంబంధించి నవంబర్ 10న అప్​డేట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. గూగుల్ పే నిబంధనల ప్రకారం ఏదైనా కొనుగోలు పూర్తి చేయడానికి ముందు సంబంధిత ఖర్చుల గురించి వినియోగదారులకు తెలియజేస్తామని పేర్కొంది. మరోవైపు గూగుల్ తన సేవా నిబంధనలను భారత్​ వినియోగదారులకు ఇటీవలే అప్​డేట్ చేసింది. అయితే ఈ కన్వీనియన్స్​ ఫీజు విధింపు నవంబర్ 10న అప్​డేట్ చేసిన నిబంధనల్లో భాగమా అనేది అస్పష్టంగా ఉంది. లావాదేవీనీ పూర్తి చేయడానికి ముందు వర్తించే ఛార్జ్​ల గురించి వినియోగదారులకు తెలుసుకునేవిధంగా ఈ నిబంధనలు ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu