Ad Code

ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా ఐమెసేజ్‌లు ?


థింగ్ కంపెనీ కొత్త మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ నథింగ్ చాట్స్‌ను లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ యూజర్ల కూడా ఆపిల్ ఐమెసేజ్‌లు వంటి ఫీచర్‌లను పంపుకునేందుకు అనుమతినిస్తుంది.ఈ కొత్త యాప్ ద్వారా థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడాల్సిన పనిలేకుండా ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ల మధ్య ఐమెసేజ్‌లు పంపుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఆపిల్ ఐమెసేజ్ వంటి ఫీచర్లను ప్రత్యేకంగా ఐఫోన్లలో అందుబాటులో ఉండగా.. ఆండ్రాయిడ్ యూజర్లకు అందించే మొదటి ఆండ్రాయిడ్ బ్రాండ్ ఏదీ లేదు. లండన్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు నథింగ్ ఫోన్ (2) వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నథింగ్ చాట్స్ అనే కొత్త మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రకటించింది. ఆండ్రాయిడ్‌లో ఇతర ఐమెసేజ్ థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారంలపై యూజర్లు ఆధారపడకుండా ఉండేలా ఈ కొత్త యాప్ తీసుకొచ్చింది. నవంబర్ 17వ తేదీ నుంచి నథింగ్ ఫోన్ (2) యూజర్లు తమ ఫోన్లలో అనే బ్లూ కలర్ బబుల్స్ పొందవచ్చు. ఐఫోన్ యూజర్లతో ఈజీగా మెసేజ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ నుంచి ఐఫోన్లకు మధ్య ఐమెసేజ్‌లు పంపుకునే అవకాశాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఈ కొత్త యాప్ తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లు తప్పనిసరిగా సన్‌బర్డ్‌ను విశ్వసించాలని నథింగ్ కంపెనీ పేర్కొంది. సన్‌బర్డ్ ఆర్కిటెక్చర్ యూజర్ల మధ్య మెసేజ్‌లను ఎలాంటి మధ్యవర్తిత్వ సర్వర్‌లలో స్టోర్ చేయకుండా నేరుగా పంపిణీ చేసేలా రూపొందించింది. అయినప్పటికీ, ఐమెసేజ్‌లను సన్‌బర్డ్ యూజర్ లొకేషన్ ఆధారంగా అమెరికా లేదా యూరప్‌లో ఉన్న లో ఎన్‌క్రిప్టెడ్ డేటాబేస్‌లో యూజర్ ఐక్లౌడ్ ఆధారాలను తాత్కాలికంగా స్టోర్ చేస్తుంది. ఈ ఆధారాలు యాప్ ద్వారా పంపిన ఐమెసేజ్ కోసం రిలేగా పనిచేస్తాయి. రెండు వారాల ఇన్‌యాక్టివ్ తర్వాత, సన్‌బర్డ్ ఈ అకౌంట్ సమాచారాన్ని సురక్షితంగా డిలీట్ చేస్తుందని నథింగ్ పీఆర్ ఇమెయిల్ ద్వారా వివరించారు.

Post a Comment

0 Comments

Close Menu