Ad Code

12 గిగావాట్​ అవర్​ బ్యాటరీ తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం జీఓడీఐతో ఒప్పందం


2030 నాటికి దేశం 150 గిగావాట్​ అవర్ అడ్వాన్స్​కెమిస్ట్రీ సెల్​​ (ఏసీసీ) లక్ష్యాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్​ఏ) హైదరాబాద్​లో మంగళవారం నిర్వహించిన 3వ వార్షిక ఇండియా బ్యాటరీ తయారీ సప్లై చైన్ సమ్మిట్ 'ఐబీఎంఎస్​సీఎస్​'లో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. దేశంలోని 150 ఏసీసీ గిగావాట్​అవర్​ బ్యాటరీ తయారీలో, తెలంగాణ వాటా 30 గిగావాట్​ అవర్ ఉందని చెప్పారు. రాష్ట్రంలో 16 గిగావాట్​అవర్​ తయారీ కేంద్రం ఏర్పాటుకు అమర రాజా పెట్టుబడులు పెడుతున్నదని ఆయన పేర్కొన్నారు. వారం రోజుల క్రితం దావోస్​లో తెలంగాణ ప్రభుత్వం 12 గిగావాట్​ అవర్​ బ్యాటరీ తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం జీఓడీఐతో ఒప్పందంపై సంతకం చేసిందని, కొన్ని ఇతర కంపెనీలతో చర్చలు ముగింపుదశల్లో ఉన్నాయని ఆయన వివరించారు. 

Post a Comment

0 Comments

Close Menu