Ad Code

జనరేటివ్ ఏఐపై కంపెనీలు ఫోకస్ ?


నరేటివ్ ఏఐపై కంపెనీలు ఫోకస్ పెడుతున్నాయి. ఈ క్రమంలో ఆసియా పసిఫిక్ కంపెనీలు ఉత్పాదక ఏఐలో పెట్టుబడులను పెంచుతున్నాయి. భారత్ సహా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, జపాన్, సింగపూర్‌లలో కంపెనీలు 2024లో జనరేటివ్ ఏఐపై పెట్టే ఖర్చు దాదాపు మూడు రెట్లు పెరగనుందని, ఈ ఏడాదిలో ఆయా కంపెనీలు 3.4 బిలియన్ డాలర్లు (రూ.28 వేల కోట్లకు పైగా) ఖర్చు చేయనున్నాయని దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చేపట్టిన ఓ అధ్యయనం అంచనా వేస్తోంది. జనరేటివ్ ఏఐపై ఖర్చు విషయంలో ఉత్తర అమెరికా దేశాల కంటే తక్కుగా ఉన్నప్పటికీ ఆసియా పసిఫిక్ దేశాల్లో ఈ సాంకేతికతపై పరిశోధనలు, అభివృద్ధి అత్యధికంగా ఉన్నట్లు ఇన్ఫోసిస్ పరిశోధన విభాగమైన ఇన్ఫోసిస్ నాలెడ్జ్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, జపాన్, భారతదేశం, సింగపూర్ దేశాల్లోని వెయ్యి మందికిపైగా బిజినెస్ లీడర్లు, ఏఐ పరిశోధకులతో ఇన్ఫోసిస్ ఈ సర్వే చేపట్టింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జనరేటివ్ ఏఐపై భారీగా పెట్టుబడి పెడుతున్న దేశాల్లో చైనా అగ్రగామిగా ఉంది. ఈ ఏడాది చైనా కంపెనీలు ఈ టెక్నాలజీపై పెట్టే ఖర్చు 160 శాతానికిపైగా పెరిగి 2.1 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. అయితే దీని ప్రభావం జాబ్స్‌పై కచ్చితంగా ఉంటుందన్న ఆందోళన ఉద్యోగులను కలవపెడుతోంది.

Post a Comment

0 Comments

Close Menu