పేటీఎం ఈ-కామర్స్ సర్వీసు పేరు మార్చేసింది. పై ప్లాట్ఫారమ్స్ అనే కొత్త పేరుతో రిజిస్టర్ చేసుకుంది. ఆన్లైన్ రిటైల్ వ్యాపారంలో వాటాను పొందే ONDCలో విక్రేత ప్లాట్ఫారమ్ అయిన బిట్సాలను కూడా పేటీఎం కొనుగోలు చేసింది. సంబంధిత వర్గాల ప్రకారం.. కంపెనీ మూడు నెలల క్రితమే ఈ కొత్త పేరు మార్పు కోసం దరఖాస్తు చేసింది. ఈ నెల 8న కంపెనీల రిజిస్ట్రార్ నుంచి అనుమతి పొందింది. దాంతో కంపెనీ పేరు పేటీఎం ఇ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పై ప్లాట్ఫారమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చుకుంది. ఈ సర్టిఫికేట్ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఇ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో విలీనం అయిందని ఫిబ్రవరి 8న రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేటీఎం ఇ-కామర్స్లో ఎలివేషన్ క్యాపిటల్ అతిపెద్ద వాటాదారుగా ఉంది. దీనికి పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, సాఫ్ట్బ్యాంక్, (eBay) సపోర్టు కూడా ఉంది. 2020లో ప్రారంభమైన ఇన్నోబిట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని కంపెనీ ఇప్పుడు కొనుగోలు చేసింది. పూర్తి-స్టాక్ ఓమ్నిచానెల్, హైపర్లోకల్ కామర్స్ సామర్థ్యంతో (ONDC) విక్రేత ప్లాట్ఫారమ్గా పనిచేస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పై ప్లాట్ఫారమ్లు ఓఎన్డీసీ నెట్వర్క్లో ప్రముఖ కొనుగోలుదారుల ప్లాట్ఫారమ్ బిట్సిలా కొనుగోలుతో దాని వాణిజ్యపరంగా మరింత బలంగా మారుతుందని తెలిపాయి. 2020లో బిట్సిలా ప్రారంభం కాగా.. ఓఎన్డీసీలో మొదటి మూడు విక్రయదారుల ప్లాట్ఫారమ్లలో ఇదొకటి. ఓఎన్డీసీలో మెక్డొనాల్డ్స్, బిగ్బాస్కెట్ వంటి మార్క్యూ బ్రాండ్లకు సపోర్టు ఇస్తుంది. బిట్సిలా ఫుల్-స్టాక్ ఓమ్నిచానెల్, హైపర్లోకల్ కామర్స్ సామర్థ్యాలు దీని వృద్ధికి ఆజ్యం పోశాయి. 30 కన్నా ఎక్కువ నగరాల్లోని 10వేల స్టోర్లలో 600 మిలియన్లకు పైగా ఉత్పత్తులను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది.
0 Comments