Ad Code

పార్ట్‌టైమ్‌ జాబ్‌ పేరుతో నిలువు దోపిడీ చేసిన కేటుగాళ్లు !


హారాష్ట్రలోని వాకాడ్‌ ప్రాంతానికి చెందిన 39 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ గత జనవరి 24 నుంచి 27 తేదీల మధ్య రూ.30.20 లక్షలు నష్టపోయారు. ఇటీవల జాబ్‌ పోవడంతో నిరుద్యోగిగా మారారు. దీంతో ఆన్‌లైన్‌ టాస్క్‌లు పూర్తి చేసే పార్ట్‌టైమ్‌లో చేరారు. పోలీసుల కథనం ప్రకారం ఈ పార్ట్‌టైమ్‌ జాబ్‌ ఆఫర్‌ గురించి జనవరి 24న అతని  మొబైల్‌ ఫోన్‌కు సందేశం వచ్చింది. దీనికి స్పందించిన ఆయనకు ఫోన్‌లో మెసెంజర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయాలని చెప్పారు. ఆపై ఆయన్ను ఓ గ్రూప్‌లో చేర్చారు. ఆ తర్వాత వివిధ రకాల వస్తువులు, కంపెనీలకు రేటింగ్‌ ఇచ్చే టాస్క్‌లు అప్పగించారు. ఈ టాస్క్‌లు పూర్తి చేశాక రూ.40 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేస్తామని చెప్పి ముందుగా కొద్ది కొద్దిగా టెకీ నుంచి డబ్బు తీసుకున్నారు. ఇలా జనవరి 24 నుంచి 12 విడతల్లో రూ.30.20 లక్షలు మోసగాళ్లు చెప్పిన బ్యాంక్‌ అకౌంట్లకు బాధితుడు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. కంపెనీకి లాస్‌ వచ్చిందని మళ్లీ కొంత డబ్బు పంపించాలని చెప్పడంతో అనుమానం వచ్చిన అతను తాను అప్పటిదాకా ట్రాన్స్‌ఫర్‌ డబ్బును తిరిగిచ్చేయాలని డిమాండ్‌ చేశాడు. దీంతో మోసగాళ్లు అతని కాల్ కి  స్పందించడం మానేశారు. ఇదే విధంగా థెర్‌గావ్‌కు చెందిన 24 ఏళ్ల గ్రాడ్యుయేట్‌ యువతి కూడా రూ.2.39 లక్షలు నష్టపోయింది. ఈమే కాకుండా మరో ఆరుగురు కూడా ఆన్‌లైన్‌ టాస్క్‌లతో మోసపోయారు. వీరిలో ఓ ప్రైవేట్‌ కంపెనీలో మేనేజర్‌ గా పని చేస్తున్న మహిళ కూడా ఉన్నారు. ఆమె ఏకంగా రూ.72.05 లక్షలు నష్టపోవడం గమనార్హం.

Post a Comment

0 Comments

Close Menu