Ad Code

రాప్టీ ఎనర్జీ కంపెనీ హై వోల్టేజ్ ఈ-బైక్ !


మిళనాడులో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ లో రాప్టీ ఎనర్జీ కంపెనీ తన ట్రాన్స్‌పరెంట్ బైక్‌ను ప్రదర్శించింది. ఇది ప్రపంచంలోనే తొలి హై వోల్టేజీ ఎలక్ట్రిక్ బైక్ అని రాప్టీ కంపెనీ వెల్లడించింది. చెన్నైలో 4 ఎకరాల విస్తీర్ణంలో రాప్టీ కంపెనీ తన తొలి ప్లాంట్‌ను ప్రారంభించింది. రూ.85 కోట్లతో మొదలైన ఈ కంపెనీ ప్రతి ఏటా లక్ష యూనిట్ల వరకూ బైక్‌లను ఉత్పత్తి చేయనుంది. బైక్ లోపల అన్ని పార్టులను చూడొచ్చు. అలాగే ఈ హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ బైక్ స్పోర్టీ లుక్‌లో కనిపించనుంది. ఈ బైక్‌లో ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ మెకానిజం అంతా దిగువ భాగంలో ఉంటుంది. బైక్‌లోని బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. గరిష్ట వేగం చూస్తే 135 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు. ఈ బైక్ కేవలం 3.5 సెకన్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. సీసీఎస్ ఛార్జింగ్ స్టేషన్‌లో ఈ బైక్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీ 45 నిమిషాల్లోనే 80 శాతం వరకూ ఛార్జ్ అవుతుందని రాప్టీ కంపెనీ తెలిపింది. అయితే ఈ బైక్ ధర, మార్కెట్లోకి వచ్చే సమయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించేదు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే ఈ బైక్‌ను విడుదల చేసేందుకు రాప్టీ ఎనర్జీ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. 2019 నుంచి రాప్టీ కంపెనీ ఈ బైక్‌ను తయారు చేసే పనిలో ఉంది. త్వరలోనే ఈ హై వోల్టేజీ ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులోకి రానుంది.

Post a Comment

0 Comments

Close Menu