తొలి తరం కంప్యూటరీలో మెమరీ వుండేది కాదు. అవి ఎప్పటికప్పుడు ఇన్ఫుట్ను అందుకొని ప్రాసెస్ చేసేవి. అదీ కూడా కొన్ని బిట్ల సమాచారాన్ని మాత్రమే అందుకోగలిగేవి. అందువల్ల ప్రాసెస్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకొనేవి. ప్రాసెస్ వేగవంత చేయడానికి మెమరీ అనేది అత్యంత ముఖ్యమని ఫారెస్టర్ అనే కంప్యూటర్ శాస్త్రవేత్త గ్రహించి ప్రయోగాలు చేశాడు. మెగేటిక్ టేపులను ఒక చుట్టగా చుట్టి, అలాగే నియాన్ బల్పులను ఒక 3డి Array వాటితో మెమరీని తయారుచేసే ప్రయత్నం చేశాడు. ఇటువంటి అనేక ప్రయోగాలు చేసిన తరువాత కోర్ మెమరీని తయారు చేశాడు. దీనిని ఇన్ఫుట్ సాధనాల నుంచి సమాచారాన్ని అందుకొని ప్రాసెస్చేసి వెంటనే అందించే విధంగా రూపొందించాడు. దీనిని కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసి వాడటంతో కంప్యూటర్ వేగం గణనీయంగా పెరిగింది. ఆ తరువాత కాలంలో అనేక మార్పులు చెంది. నేటి తరం ర్యామ్గా రూపొందింది.
0 Comments