Ad Code

కేరళలో పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటు

 

కేరళలో కరోనా మహమ్మారి పాజిటివిటీ రేటు అంతకంతకే పెరిగిపోతున్నది. ఇవాళ మొత్తం 96,481 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అందులో 17,106 మందికి పాజిటివ్ వచ్చింది. పాజిటివిటీ రేటు 17.73 శాతంగా నమోదైంది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు పెరిగిపోతుండటంపై జనం ఆందోళన చెందుతున్నారు. ఈరోజు కొత్తగా 17,106 మందికి పాజిటివ్ రాగా, 20,846 మంది రికవరీ అయ్యారు. కొత్తగా 83 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 19,428కి పెరిగింది. ఇక ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులలో రికవరీ అయిన వారు, మరణించిన వారు పోగా మరో 1,78,462 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu