Ad Code

ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి


సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం చింతలఘాట్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 65వ నంబరు జాతీయ రహదారిపై గోవా నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జహీరాబాద్ వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి పంపించారు. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అవడంతో యువతి మృతదేహం శకలాల్లో ఇరుక్కుపోయింది. బాధితులను హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన స్నేహితులుగా పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన యువతి నిహారిక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రేన్ సాయంతో కారును పక్కకు తప్పించి ఆ మార్గంలో రాకపోకలను పునరుద్ధరించారు.

Post a Comment

0 Comments

Close Menu