మూడవ త్రైమాసికంలో మొత్తం భారతీయ స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు 52 మిలియన్ యూనిట్లను దాటాయి. అయితే ఈ ఫలితాల్లో రెడ్మీ 9, రెడ్మీ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలతో 22 శాతం వాటాతో షావోమీ ఇండియన్ స్మార్ట్ఫోన్ మార్కెట్ షిప్మెంట్లో అగ్రస్థానంలో నిలిచింది. 19శాతం షిప్మెంట్తో శాంసంగ్ భారత్లో రెండవ అతిపెద్ద స్మార్ట్ఫోన్ బ్రాండ్గా నిలిచింది. క్యూ3 భారతీయ స్మార్ట్ఫోన్ షిప్మెంట్లపై కౌంటర్పాయింట్ నివేదికలో షావోమీ, శాంసంగ్, వివో, రియల్మీ, ఒప్పో ఫోన్ల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. షావోమీ 22శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా..షావోమీ నుండి విడుదలైన నాలుగు స్మార్ట్ఫోన్లు రెడ్మీ9, రెడ్మీ9 పవర్, రెడ్మీ నోట్ 10, రెడ్మీ 9 అత్యధికంగా అమ్ముడైన జాబితాలో మొదటి నాలుగు స్థానాల్ని దక్కించుకున్నాయి. ఈ నాలుగు ఫోన్లు మూడవ త్రైమాసికంలో మిలియన్ కంటే ఎక్కువగా అమ్ముడైన ఫోన్ల జాబితాలో చోటు సంపాదించాయి. ఈ ఏడాదిలో రెడ్మీ 9 ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడైన మోడల్గా అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో 19 శాతం స్మార్ట్ఫోన్ మార్కెట్ వాటాతో శాంసంగ్ రెండవ స్థానంలో ఉంది. రూ.10,000 నుంచి రూ.30,000 మధ్యలో ఉన్న ఫోన్ అమ్మకాల మార్కెట్ వాటా 25 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ ఎం42, శాంసంగ్ గెలాక్సీ ఎం 52, శాంసంగ్ గెలాక్సీ ఏ 22, శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ మోడళ్లు 5జీ స్మార్ట్ఫోన్ సెగ్మెంట్ బ్రాండ్లు రెండో స్థానాన్ని ఆక్రమించాయి. కొత్తగా విడుదలైన శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్3, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోన్లో భారత స్మార్ట్ ఫోన్ యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నట్లు తేలింది.
No comments:
Post a Comment