Ad Code

ఫ్లిప్‌కార్ట్‌లో నోకియా T20 ట్యాబ్లెట్ సేల్


ప్రముఖ స్మార్ట్​ బ్రాండ్​ నోకియా మరో ట్యాబ్లెట్​ను​ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. నోకియా టీ20 పేరుతో దీన్ని భారత మార్కెట్​లోకి ఆవిష్కరించనుంది. నవంబర్ 3 వరకు జరగనున్న ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సేల్​లో ఇది అమ్మకానికి రానుంది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్‌ తన టీజర్ పోస్టర్​లో నోకియా టీ20ని లిస్ట్​లో చేర్చింది. ఇప్పటికే గ్లోబల్​ మార్కెట్​లో విడుదలైన ఈ ట్యాబ్లెట్​లో అనేక అద్భుతమైన ఫీచర్లను అందించింది. నోకియా T20 ట్యాబ్లెట్ 10.4 అంగుళాల 2K డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో వర్చువల్ ఇంటరాక్షన్‌లను సులభతరం చేసే స్టీరియో స్పీకర్లను చేర్చింది. 8,200mAh లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, ప్రత్యేక గూగుల్​ కిడ్స్​ స్పేస్ వంటి అప్​డేటెడ్​ ఫీచర్లను అందించింది. భారత మార్కెట్​లో నోకియా T20 ధర తెలియనప్పటికీ, ఇది గ్లోబల్​ మార్కెట్​తో సమానంగా ఉండనుంది. యూరప్‌లో, నోకియా T20 వైఫై వేరియంట్​ దాదాపు రూ. 17,200, వైఫై + 4జీ మోడల్ ధర సుమారు రూ. 20,600 నుండి ప్రారంభమవుతుంది. ఇండియాలో ఖచ్చితంగా ధర ఎంత ఉంటుందన్న వివరాలు తెలియదు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో ఈ ట్యాబ్లెట్ కొనొచ్చు.

Post a Comment

0 Comments

Close Menu