అంబుజ బాంధవాన్వయ నృపాగ్రణి బోనము నేడు సూర్య పా
కంబున నాయితనంబయిన కబ్జము భోజన శాల లోన బ
ల్యం బిడినారు. పంకజదళాక్షులు రెండవ ఝాము ఘంట వ్రే
యంబడి నారగింప సమయంబని చెచ్చెర విన్నవించినన్
వేల్పు లొనరించినట్టి దుర్వృత్తి యగుట
నెరిగి యింతియె గాక యొండేమి యనుచు
నారగించె దివోదాసుదారక కిరణ
తాప పక్వంబులగు పదార్థంబు లెలమిన్
అర్థము:--పరిచారికలు వచ్చి సూర్యవంశ ప్రభువుల్లో గొప్పవాడా రిపుంజయ మహా రాజా! ఈ రోజు భోజనం సూర్య కిరణాల వేడితో తయారయింది. భోజనశాలలో పద్మ దళాలవంటి కన్నులు గల భామినులు పళ్ళెం లో పెట్టినారు రెండో ఝాము ఘంట మ్రోగింది త్వరగా తినడానికి రండి అని పిలుస్తారు. అప్పుడు రిపుంజయుడు (దివోదాసు) దేవతలు అగ్నిని నిరోధించడం కంటే యింకేమి చేయగలరు అంటూ సూర్య కిరణాల వేడిమి తో తయారైన పదార్థాలు తిన్నాడట. ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం యిప్పుడు ఆవిష్కరించిన ఇలాంటి విషయాలేన్నింటికో మన సాహిత్యం లో తార్కాణాలున్నాయి. పరిశోదించాలనే ఉత్సుకత ఉన్నవారికి పెన్నిధి మన తెలుగు సాహిత్యం.
"కాశీఖండ మయః పిండం నైషధం విద్వదౌషధం" కాశీఖండము" అను శ్రీనాథుడు రచించిన కావ్యము
యినుపముద్దవలె గట్టిగా వుంటుంది.(అంటే అంత త్వరగా అర్థం కాదు అని) ఇంక నైషధం విద్వాంసులకు ఔషధము వంటిది.
మనవాళ్ళు వేరే దేశం వాళ్ళు చెప్తేనే కానీ నమ్మరు కదా! మన వేదాల్లో ఎన్నో ఇలాంటివి వున్నాయి.వాటిని చదివే వాళ్ళే కరువైనారు.అది మన దురదృష్టం
0 Comments