Ad Code

బూమ్‌ మోటార్స్‌ కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాల విడుదల

 

 

తమిళనాడు లోని కోయంబత్తూరుకు చెందిన బూమ్‌ మోటార్స్‌ కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాలను మార్కెట్లో విడుదల చేసింది. బూమ్ కార్బెట్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాహనాన్ని రెండు వేరియంట్లలో మార్కెట్లో విడుదల చేసింది. అవి కార్బెట్‌ 14, కార్బెట్‌ 13 ఈఎక్స్‌.  ఇక కార్బెట్ 14లో 2.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, కార్బెట్ 14 ఈఎక్స్‌లో 4.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అమర్చించింది కంపెనీ. కార్బెట్ 14 వేరియంట్ ఒక్కసారి చార్జ్‌ చేస్తే సుమారు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అలాగే కార్బెట్ 14ఈఎక్స్ టూవీలర్ ను ఒక్కసారి చార్జ్‌ చేస్తే 200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. వీటి ధర వరుసగా రూ.89,999, రూ.1,24,999. వాహనాల బుకింగ్‌ కూడా ప్రారంభమైంది. ఈ రెండు వేరియంట్లకు చార్జింగ్‌ అయ్యేందుకు 2.5 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఇక స్పీడు విషయానికొస్తే గరిష్టంగా 75 కిలోమీటర్లు. ఈ వాహనాన్ని ఈఎంఐ రూపంలో కూడా కొనుగోలు చేయవచ్చు. నెలకు ఈఎంఐ రూ.1699 నుంచి ప్రారంభం అవుతుంది. ఐదు సంవత్సరాల పాటు ఈఎంఐ సదుపాయం పొందవచ్చు. ఇ-స్కూటర్స్‌ ఏడేళ్ల వారంటీతో లభించనున్నాయి. స్కూటర్‌ జీవిత కాలం ముగిసిన తర్వాత బ్యాటరీలు బూమ్‌ మోటార్స్‌ తిరిగి కొనుగోలు చేస్తాయి.

Post a Comment

0 Comments

Close Menu