Ad Code

పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం : 20 మంది దుర్మరణం


ఉత్తర పెరూలోని లిబర్టాడ్‌ రీజియన్‌లో ఓ బస్సు రోడ్డుపై నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదం లో సుమారు 20 మంది మృతి చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పెరూ అధికారులు చెబుతున్నారు. బస్సు తయాబాంబా నుంచి ట్రుజిల్లోకు ప్రయాణిస్తోండగా ఈ దుర్ఘటన జరిగిందని, సుమారు 100 మీటర్ల లోతైన లోయలోకి బస్సు దూసుకెళ్లిందని పేర్కొన్నారు. ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జయిందని, నాలుగేళ్ల చిన్నారితో సహా సహా 20 మంది సంఘటనా స్థలంలో మరణించారని అధికారులు చెబుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu