Ad Code

నింజా ప్రొ మ్యాక్స్ స్మార్ట్‌వాచ్ విడుదల!


దేశీ వేరబుల్స్ బ్రాండ్ ఫైర్ బోల్ట్ మరో బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో విడుదల చేసింది. నింజా సిరీస్‌లో ఫైర్ బోల్ట్ నింజా ప్రొ మ్యాక్స్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ ట్రాకర్‌, హార్ట్‌రేట్ మానిటర్‌, బీపీ సెన్సర్, స్లీప్ ట్రాకర్ వంటి న్యూ ఫీచర్లతో అందుబాటు ధరలో ఈ స్మార్ట్‌వాచ్ యూజర్లను ఆకట్టుకోనుంది. నింజ, నింజా 2, నింజా 2 మ్యాక్స్‌కు అదనంగా తాజా నింజా స్మార్ట్‌ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో కస్టమర్లను ఆకర్షిస్తుందని ఫైర్ బోల్ట్ సహ వ్యవస్ధాపకులు ఆయుషి, ఆర్నవ్ కిషోర్ తెలిపారు. భిన్న వ్యక్తిత్వాలు కలిగిన వారికి నచ్చేలా అన్ని రకాల కలర్ వేరియంట్స్‌లో నింజా ప్రొ మ్యాక్స్ అలరిస్తుందని వారు తెలిపారు. అడ్వాన్స్‌డ్ డిస్‌ప్లే టెక్నాలజీ, ఎలిగెంట్ డిజైన్డ్ షేప్‌తో పాటు ఐపీ67 వాటర్‌ప్రూఫ్‌తో కూడిన ఈ స్మార్ట్‌వాచ్ వ్యాయామం చేస్తున్న సమయంలో అన్ని పారామీటర్స్‌ను ఆటోమేటిక్‌గా వెల్లడించేలా 27 భిన్న బిల్టిన్ స్పోర్ట్స్ మోడ్స్‌ను కలిగిఉంటుంది. ఈ డేటా యూజర్ల ఫిట్‌నెస్ లెవెల్‌పై సమగ్ర వివరాలను అందిస్తుంది. ఫైర్ బోల్ట్ నింజా ప్రొ మ్యాక్స్‌ను రూ 1899 ప్రారంభ ధరతో కంపెనీ లాంఛ్ చేసింది. ప్లిఫ్‌కార్ట్‌పై ఎక్ల్సూజివ్‌గా ఈ స్మార్ట్‌వాచ్ అందుబాటులో ఉంది. బ్లాక్‌, యల్లో, బ్లూ, షాంపేన్ గోల్డ్‌, పింక్ గోల్డ్‌, రెడ్ నేవీ, రోజ్ గోల్డ్‌, ఆలివ్ వంటి ఎనిమిది రంగుల్లో నింజా ప్రొ మ్యాక్స్ లభిస్తుంది. ఇక ఈ స్మార్ట్‌వాచ్ 1.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 9.5 ఎంఎం థిక్‌నెస్‌తో స్లీకెస్ట్ వాచ్‌గా యూజర్లను ఆకర్షిస్తుంది. చర్మానికి అనుకూలంగా ఉండే సిలికాన్ స్ట్రాప్‌తో ఈ స్మార్ట్‌వాచ్ ముందుకొచ్చింది. 200ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో 8 రోజుల నార్మల్ యూసేజ్‌తో పాటు నెలరోజుల స్టాండ్‌బై టైంతో నింజా ప్రొ మ్యాక్స్ అలరిస్తుంది.


Post a Comment

0 Comments

Close Menu