గోల్డ్ ఏటీఎంలు అందుబాటులోకి రానున్నాయి. గోల్డ్ సిక్కా కంపెనీ త్వరలో గోల్డ్ ఏటీఎంలను తీసుకొస్తామని ప్రకటన చేసింది. మూడు ప్రోటోటైప్ ఏటీఎంలను అబిడ్స్, సికింద్రాబాద్, ఓల్డ్సిటీలలో ఏర్పాటు చేస్తామని తెలిపింది. కస్టమర్ ఏటీఎం డెబిట్, క్రెడిట్ కార్డులను వాడి ఈ ఏటీఎంల నుంచి బంగారం కొనుక్కోవచ్చు. అర గ్రాము నుంచి 100 గ్రాముల వరకు గోల్డ్ కొనొచ్చు. హైదరాబాద్లో పెట్టే ప్రోటోటైప్లు సక్సెస్ అయితే దేశం మొత్తంలో మూడు వేల గోల్డ్ ఏటీఎంలను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. రూరల్ ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది.
0 Comments