షియోమీ 12 ప్రో 5G పేరుతో కొత్త స్మార్ట్ఫోన్ త్వరలో లాంచ్ కానున్నది. ఈ స్మార్ట్ఫోన్కు సంబందించిన టీజర్ ను షియోమీ ఇండియా హెడ్ మను కుమార్ జైన్ విడుదల చేసారు. షియోమీ 12 ప్రో 5Gని భారతదేశంలో ఏప్రిల్ 12న విడుదల చేస్తున్నట్లు విడుదలైన టీజర్ ద్వారా తెలుస్తోంది. షియోమీ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో 12 సిరీస్ను విడుదల చేసింది. షియోమీ 12 ప్రో 5G ఫోన్ యొక్క గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది 6.73-అంగుళాల AMOLED డిస్ప్లేతో 2K రిజల్యూషన్, 1500నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు HDR10+ సర్టిఫికేషన్తో వస్తుందని భావిస్తున్నారు. ఇండియా యొక్క వేరియంట్ కూడా దాదాపుగా ఇవే స్పెసిఫికేషన్లను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఇండియా వేరియంట్ అదనపు రక్షణ కోసం పైన గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉండవచ్చు. షియోమీ 12 ప్రో 5G ఫోన్ Samsung యొక్క 4nm ప్రాసెస్ ఆధారంగా Qualcomm Snapdragon 8 Gen1 ప్రాసెసర్తో రన్ అవుతూ 12GB వరకు LPDDR5 RAM మరియు 256GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజీతో జతచేయబడి ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా MIUI 13లో రన్ కావచ్చు. అలాగే కెమెరా విభాగంలో 50MP Samsung JN1 అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 50MP సోనీ IMX707 ప్రైమరీ సెన్సార్ మరియు 2x ఆప్టికల్ జూమ్తో 50MP పోర్ట్రెయిట్ లెన్స్తో వెనుకవైపు ట్రిపుల్-కెమెరా లేఅవుట్ను చూడవచ్చు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP స్నాపర్ ఉండవచ్చు.
0 Comments