ఆంధ్రప్రదేశ్ సముద్ర గర్భంలో అరుదైన కోరల్స్ ?
Your Responsive Ads code (Google Ads)

ఆంధ్రప్రదేశ్ సముద్ర గర్భంలో అరుదైన కోరల్స్ ?


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలోని పూడిమడక తీరం నుంచి విజయనగరం జిల్లా చింతపల్లి తీరం వరకు జరిపిన సర్వేలో విభిన్న జాతుల కోరల్స్ జాడ లభించింది. ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో దాదాపు మూడేళ్ల పాటు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలు జరిపింది.శాస్త్రవేత్తలు పూడిమడక, రిషికొండ, భీమిలి, యారాడ, కైలాసగిరి, ఆర్కే బీచ్, మంగమూరి పేట, సాగర్ నగర్, తెన్నేటి పార్క్ ఇంకా అలాగే చింతపల్లి బీచ్ ప్రాంతాల్లో పరిశోధనలు జరిపారు. ఒక్కో ప్రాంతంలో నాలుగు భిన్నమైన ప్రాంతాలను సర్వే పాయింట్లుగా గుర్తించి.. మొత్తం 30 మీటర్ల లోతులో అంటే దాదాపు వంద అడుగుల లోతులో సర్వే చేశారు. విశాఖలోని స్కూబా డైవింగ్ సంస్థ అయిన లివిన్ అడ్వెంచర్స్ సహకారంతో నలుగురు శాస్త్రవేత్తలు చేపట్టిన సర్వేల్లో పూడిమడక వద్ద పగడపు దిబ్బల ఆఛూకీ కూడా లభ్యమైంది. ఈ సర్వేలో అరుదైన కోరల్స్ జాడను కనుక్కున్నట్టు కూడా తెలిసింది. ముఖ్యంగా డిస్కోసోమా, లోబాక్టిస్, హెక్సకోరిలియా, ఆక్టోటోరిలియా, పపోనాఎస్పీ, స్కెలరాక్టినియా కోరల్స్, లిథోపిలాన్‌ ఎస్‌పీ, మోంటీపోరా ఎస్‌పీ ఇంకా అలాగే పోరిటెస్‌ ఎస్‌పీ వంటి కోరల్స్ జాడ అనేది లభ్యమైంది. ఐతే వీటిలో కొంతభాగం తీసి మరోచోట పెంచే రకాలు చాలా అరదుగా ఉంటాయని..ఇక అలాంటి కోరల్స్ పూడిమడకలో ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. ఇందులో మరో విశేషమేటంటే.. ఈ కోరల్స్ మందుల తయారీకి కూడా బాగా ఉపయోగపడతాయని వెల్లడించారు. ఈ పరిశోధనల్లో భాగంగా విశాఖ తీరంలో 1,597 మొలస్కా జాతులు, 182 సినిడారియన్, 161 స్పాంజ్, 133 రకాల చేపలు, 106 క్రస్టేసియన్‌లు, 12 అసిడియన్‌లు ఇంకా అలాగే 3 ఫ్లాట్‌ వార్మ్‌లతో పాటు.. అన్నెలిడ్‌ వంటి జీవరాశుల నమూనాలను సేకరించారు. ఈ పగడపు దిబ్బలు అనేవి మత్స్య సంపద వృద్ధి చెందడానికి ఎంతగానో తోడ్పడతాయని కూడా శాస్త్రవేత్తలు తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog