జియో ట్రూ 5జీ సేవలు ప్రారంభం !
Your Responsive Ads code (Google Ads)

జియో ట్రూ 5జీ సేవలు ప్రారంభం !


జియో ట్రూ 5జీ సేవలు ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చాయి. జియో 5జీ ఆఫర్‌ను కూడా ప్రకటించింది రిలయన్స్ జియో. అక్టోబర్ 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 ఎగ్జిబిషన్‌లో భారతదేశంలో 5జీ సేవల్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీపావళికి జియో సేవల్ని ప్రారంభిస్తామని రిలయన్స్ జియో ముందుగా ప్రకటించినా, దసరా పర్వదినాన నాలుగు నగరాల్లో జియో ట్రూ 5జీ సేవలు ప్రారంభమాయ్యాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసిలో జియో ట్రూ 5జీ బీటా ట్రయల్ దసరా నుంచి మొదలవుతుందని కంపెనీ ప్రకటించింది దసరా 2G వంటి టెక్నాలజీల వల్ల కలిగే అడ్డంకులపై విజయానికి ప్రతీక అని, Jio True 5G నిజమైన జ్ఞానం లభిస్తుందని కంపెనీ ప్రకటించింది. జియో ట్రూ 5జీ ప్రారంభం కానున్న నాలుగు నగరాల్లో వెల్‌కమ్ ఆఫర్ కూడా ప్రకటించింది కంపెనీ. ఇన్విటేషన్ల ద్వారా కస్టమర్లకు జియో ట్రూ 5జీ సేవల్ని అందించబోతుంది. కస్టమర్ల ఫీడ్‌బ్యాక్ తీసుకొని సేవల్ని మెరుగుపర్చనుంది. జియో ట్రూ 5జీ వెల్‌కమ్ ఆఫర్ కూడా ప్రకటించింది కంపెనీ. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి నగరాల్లో ఇన్విటేషన్ ద్వారా ఈ ఆఫర్ అందిస్తోంది. కస్టమర్లకు 1 Gbps+ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తోంది కంపెనీ. ఇతర నగరాల్లో కూడా బీటా ట్రయల్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఆ నగరంలో ప్రతి కస్టమర్‌కు ఉత్తమమైన కవరేజీ, యూజర్ ఎక్స్‌పీరియెన్స్ లభించేవరకు బీటా ట్రయల్ కొనసాగుతుంది. జియో వెల్‌కమ్ ఆఫర్ కస్టమర్లు తమ ప్రస్తుత జియో సిమ్ లేదా 5G హ్యాండ్‌సెట్‌ను మార్చాల్సిన అవసరం లేకుండా ఆటోమెటిక్‌గా జియో ట్రూ 5జీ సేవల్ని పొందొచ్చు. కస్టమర్లకు జియో 5జీ సేవల్ని వారి 5జీ మొబైల్స్‌లో మెరుగ్గా అందించేందుకు కంపెనీ అన్ని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లతో కలిసి పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా 425 మిలియన్లకు పైగా కస్టమర్లు ఉన్న జియో, 5జీ ద్వారా భారతదేశాన్ని డిజిటల్ సొసైటీగా మార్చే లక్ష్యాన్ని వేగవంతం చేయబోతోంది. ఈ కనెక్టివిటీ, సాంకేతికత ద్వారా జీవితాలను మెరుగుపరచడం, జీవనోపాధిని పెంచడం ద్వారా మానవాళికి సేవ చేయడంలో సహాయపడుతుంది. యో ట్రూ 5జీ వీకేర్ సూత్రం ద్వారా నిర్మించబడింది. విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, చిన్న, మధ్యతరహా, పెద్ద పరిశ్రమలు, IoT, స్మార్ట్ హోమ్‌లు, గేమింగ్‌లో 1.4 బిలియన్ల భారతీయులను ప్రభావితం చేసే మార్పులను తీసుకురానుంది. జియో ట్రూ 5జీ నెట్వర్క్‌తో మూడు రెట్లు ప్రయోజనం ఉంటుంది. జియో 5జీ నెట్వర్క్ 4జీ నెట్వర్క్‌పై ఆధారపడదు. అడ్వాన్స్‌డ్ 5జీ నెట్వర్క్ లభిస్తుంది. తక్కువ జాప్యం, భారీ మెషిన్-టు-మెషిన్ కమ్యూనికేషన్, 5G వాయిస్, ఎడ్జ్ కంప్యూటింగ్. నెట్‌వర్క్ స్లైసింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇతర ఆపరేటర్‌లు ప్రారంభించిన 4G-బేస్డ్ నాన్-స్టాండలోన్ నెట్‌వర్క్‌ల కంటే చాలా గొప్పగా ఉంటుంది. జియో దగ్గర అతిపెద్ద స్పెక్ట్రమ్ అందుబాటులో ఉంది. 700MHz, 3500 MHz, 26 GHz బ్యాండ్‌లతో 5G కోసం అతిపెద్ద, అత్యంత సముచితమైన వైర్‌లెస్ స్పెక్ట్రమ్ మిక్స్ ద్వారా, ఇతర ఆపరేటర్‌ల కంటే జియో ట్రూ 5జీ ప్రత్యేకమైన ప్రయోజనాన్ని అందిస్తుంది. డీప్ ఇండోర్ కవరేజీ ఇచ్చే 700MHz లో బ్యాండ్ స్పెక్ట్రమ్ జియో దగ్గర మాత్రమే ఉంది. క్యారియర్ అగ్రిగేషన్ అనే అధునాతన సాంకేతికతను ఉపయోగించి 5G ఫ్రీక్వెన్సీలను కలిపి ఒకే ఫ్రీక్వెన్సీగా ఇస్తుంది. కవరేజ్, సామర్థ్యం, నాణ్యత, తక్కువ ధర లాంటి అసమానమైన కలయికను అందిస్తుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog