Ad Code

మరో 2 నగరాల్లో ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీసులు


ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీసులను వేగంగా విస్తరిస్తోంది. Airtel 5G సర్వీసులను ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులో తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ 5Gకి ఇప్పటికే సపోర్టు కలిగిన నగరాల జాబితాలో కొత్తగా మరో రెండు నగరాలు చేరాయి. టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీసును జమ్మూ, శ్రీనగర్‌లో ప్రారంభించింది. ఈ రెండు భారతీయ నగరాల్లో నివసిస్తున్న అన్ని అనుకూల 5G స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎయిర్‌టెల్Airtel 5Gని ఉపయోగించవచ్చు. Airtel 5G Plus భారతదేశంలోని 10+ నగరాల్లో అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్ గతంలో 5G సర్వీసులను మార్చి 2024 నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరుకుంటుందని చెప్పారు. మరోవైపు, Jio 5G సర్వీసులను 2023 చివరి నాటికి భారత్ అంతటా అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu