Ad Code

ఐటెల్ ఏ24 ప్రో విడుదల


ఐటెల్ కంపెనీ ఏ24 ప్రో పేరుతో కొత్త 4జీ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది. కాంపాక్ట్ డిజైన్‌తో ఈ ఫోన్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది . ఇందులో బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 5 ఇంచుల డిస్‌ప్లే ఉంటుంది. స్టోరేజ్ 32 జీబీ ఉంటుంది. ఈ ఫోన్ రేటు రూ. 4,600. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1.4 గిగాహెర్ట్జ్ యూనిసెక్ ఎస్‌సీ9832ఈ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్‌లో ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. వెనుక భాగంలో 2 ఎంపీ కెమెరా ఉంటుంది. ముందు భాగంలో 0.3 ఎంపీ కెమెరా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇందులో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. అలాగే 3020 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇందులో ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోన్ బంగ్లాదేశ్‌లో లాంచ్ అయ్యింద. త్వరలోనే మన దేశంలోకి కూడా ఈ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇకపోతే మన దేశంలో ఇప్పటికే రూ. 5 వేల రేంజ్‌లో పలు రకాల స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. మార్‌క్యూ దగ్గరి నుంచి జియో వరకు పలు కంపెనీలు తక్కువ ధరలోనే స్మార్ట్‌ఫోన్స్ అందిస్తున్నాయి. రూ. 5 వేల కన్నా తక్కువే ఈ ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. వాట్సాప్ సహా ఇతర సోషల్ మీడియా యాప్స్ కూడా వాడొచ్చు. జియో ఫోన్ నెక్ట్స్ తొలి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ ఎంఆర్‌పీ రూ. 5,999. అయితే ఈ ఫోన్‌ను అమెజాన్‌లో రూ. 4499కే కొనొచ్చు. ఈ ఫోన్‌లో 5.45 అంగుళాల స్క్రీన్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 13 ఎంపీ రియర్ కెమెరా, 2 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu