Ad Code

శాప్‌ ల్యాబ్స్ ఇండియా భూమి పూజ !


శాప్‌ ల్యాబ్స్ ఇండియా ఎండీ, సీనియర్‌ వైస్‌ ప్రెసిడింట్‌ సింధు గంగాధరన్ కొత్త క్యాంపస్‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో 41.07 ఎకరాల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు. ఇది 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. 'శాప్‌ ల్యాబ్స్ ఇండియా 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం బెంగళూరులో 15,000 ఉద్యోగాలను సృష్టించే కొత్త 41 ఎకరాల క్యాంపస్‌తో భారతదేశంలో మా పెట్టుబడులను మరింతగా పెంచుతున్నాం' అని శాప్‌ ల్యాబ్స్ ఇండియా ఎండీ, సీనియర్‌ వైస్‌ ప్రెసిడింట్‌ సింధు గంగాధరన్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌లో ప్రస్తుతం శాప్‌ ల్యాబ్స్‌కు అతి పెద్ద ఆర్‌అండ్‌డీ హబ్‌ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ మొత్తం ఆర్‌అండ్‌డీ విభాగంలో 40 శాతం వాటా దీని నుంచి ఉంది. కొత్త క్యాంపస్ నిర్మాణం భారతదేశం పట్ల తమ నిబద్ధతను మరింత బలపరుస్తుందని శాప్‌ కంపెనీ తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu