Ad Code

ట్విట్టర్ యూజర్లకు కొత్త రూల్స్ !


లెన్ మాస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత రోజుకో కొత్త రూల్స్ తీసుకు వస్తున్నాడు. ఈ సారి ఎక్కువ మంది వైరిఫై అకౌంట్లు తీసుకునేలా కొత్త రూల్ ప్రవేశపెట్టాడు. సాధారణంగా ట్విట్టర్ ని చూడాలంటే అకౌంట్ ద్వారా తప్పకుండా లాగిన్ కావాల్సి ఉంటుంది. గతంలో ట్విట్టర్ లాగిన్ కాకపోయినా లింక్ ను బ్రౌజర్ లో ఓపెన్ చేసి చూసుకునే వీలు ఉండేది. కానీ ఇప్పుడు ఆ సౌకర్యాన్ని నిలిపివేశారు. అల్ రెడీ లాగిన్ ఉన్నవారు మాత్రమే చూడగలరు.. లేని వారు తప్పనిసరి ట్విట్ర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిందే. అంతేకాదు ట్విట్టర్ యూజర్లు ప్రతిరోజూ చదివే పోస్ట్ ల సంఖ్యను కూడా పరిమితం చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం ట్విట్టర్ యూజర్లు సర్వర్ డౌన్ అయినట్లుగా పెద్ద సంఖ్యలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక పరిమితులు వర్తిస్తాయి అని.. ఇటీవల ట్విటర్‌ నుంచి భారీ ఎత్తున డేటా చోరీ అవుతుందని దాన్ని అరికట్టేందుకే ఈ చర్యలు తీసుకున్నామని మస్క్‌ చెబుతున్నారు. కొన్ని అసౌకర్యమైన ఇబ్బందులను నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నాట్లు ట్వీట్‌ చేశాడు. 'ఇక నుంచి వెరిఫై అకౌంట్ యూజర్లు 10వేల పోస్టులు మాత్రమే చూడగలరు. అన్ వెరిఫైడ్ యూజర్లు 1000 పోస్టులు మాత్రమే.. ఇక కొత్తగా ట్విట్టర్ యూజర్లు కేవలం 500 ట్విట్లు మాత్రమే చూడవొచ్చ' అని ట్వీట్ చేశారు. మొదట వెరిఫైడ్ ఖాతాదారులకు 6000, ఆన్ వెరిఫైడ్ వారికి 600, కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసిన వారికి 300 పోస్టుల లిమిట్ పెట్టిన ఎలన్ మాస్క్ కొన్ని గంటల తర్వాత తన నిర్ణయాన్ని సవరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్ చేశారు. ఇప్పటికే ట్విట్టర్ ఆదాయాన్ని మరింత పెంచేందుకు బ్లూటిక్ కోసం సబ్‌స్క్రిప్షన్ ఎలెన్ మాస్క్ పాలసీని తీసుకు వచ్చాడు. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu