Ad Code

వన్ ప్లస్ 12ఆర్ కొన్నవారికి ఫుల్ రీఫండ్ ?


సంవత్సరం మొదటి నెలలోనే వన్ ప్లస్  కొత్త స్మార్ట్ ఫోన్  సిరీస్ ను  లాంచ్ చేసింది. ఈ సిరీస్2లో కంపెనీ రెండు ఫోన్లను విడుదల చేసింది. మొదటి ఫోన్ వన్ ప్లస్ 12 కాగా రెండో ఫోన్ వన్ ప్లస్12ఆర్. ఈ రెండు ఫోన్ల అమ్మకాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు కంపెనీ వన్ ప్లస్12ఆర్ టాప్ వేరియంట్ ను  కొనుగోలు చేసిన వినియోగదారులకు రీఫండ్ ను  ఆఫర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ మొదటి వేరియంట్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ తో  వస్తుంది. రెండో వేరియంట్ 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఈ సిరీస్ లో  లాంచ్ చేసే సమయంలో 256 జీబీ స్టోరేజ్ ఉన్న వేరియంట్లో యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఫీచర్ ఉందని కంపెనీ తెలియజేసింది. ఈ ఫోన్ 128 జీబీ వేరియంట్లో యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఫీచర్ ఉంది. వన్ ప్లస్12ఆర్ టాప్ వేరియంట్ కోసం కంపెనీ చేసిన ప్రకటన తప్పు అని ప్రూవ్ అయింది. ఈ ఫోన్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఫీచర్ తో  వస్తుంది. కంపెనీ చేసిన తప్పుడు ప్రచారం కారణంగా ఇప్పుడు ఈ ఫోన్ ను కొనుగోలు చేసిన వినియోగదారులకు పూర్తి డబ్బును తిరిగి రీఫండ్ చేయాల్సి ఉంటుంది. వన్ ప్లస్ ప్రెసిడెంట్, సీవోవో కిండర్ లియు ఈ సమస్యపై చర్య తీసుకున్నారు. ‘మీ సహనానికి ధన్యవాదాలు. ఈ పరిస్థితి గురించి మా కస్టమర్ సేవకు తెలియశామని మీకు ప్రకటిస్తున్నాం. వారు గత కొన్ని వారాలుగా ఇబ్బందుల్లో ఉన్న వినియోగదారులకు సహాయం చేస్తారు.’ అని అయన ఫోరమ్ పోస్ట్ లో రాశారు. మీరు వన్ ప్లస్12ఆర్ 256 జీబీ వేరియంట్ ని  కొనుగోలు చేసి మీ ఫోన్ ఫైల్ సిస్టమ్ టైప్ స్టేటస్ గురించి చూడాలనుకుంటే కస్టమర్ కేర్ ని  సంప్రదించండి. వారు తదుపరి దశల్లో మీకు సహాయం చేస్తారు. 2024 మార్చి 16వ తేదీ వరకు ఈ రీఫండ్ వస్తుంది. ఇంతకుముందు సీనియర్ వన్ ప్లస్ ఎగ్జిక్యూటివ్ తప్పుడు ప్రమోషన్ కోసం కొనుగోలుదారులకు క్షమాపణలు చెప్పారు. ఇది కంపెనీ తరఫున లోపం అని పేర్కొన్నారు. ఇది కాకుండా కస్టమర్లు ఓపికగా ఉండి కంపెనీకి సపోర్ట్ ఇవ్వాలని కంపెనీ విజ్ఞప్తి చేసింది.


Post a Comment

0 Comments

Close Menu