Ad Code

ఎలక్షన్‌ కమిషన్‌కు 'చాట్‌జీపీటీ' కంపెనీ సాయం ?


లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. కృత్రిమ మేధస్సు  పోలింగ్ ప్రక్రియకు అడ్డంకి కాకుండా ఎదుర్కొనేందుకు 'చాట్‌జీపీటీ' సృష్టికర్త 'ఓపెన్‌ ఏఐ' సాయం తీసుకుంటోంది. ఈ మేరకు ఈసీఐ అధికారులు ఓపెన్‌ ఏఐ ప్రతినిధులతో ఇటీవల సమావేశం నిర్వహించారు. గత నెలలో జరిగిన ఈ సమావేశానికి భారత ఎన్నికల సంఘం కోసం ఓపెన్‌ ఏఐ ఒక ప్రజెంటేషన్‌ను సిద్ధం చేసింది. పోలింగ్ ప్రక్రియలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ దుర్వినియోగం కాకుండా ఎలా అరికట్టాలో కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు ఎలక్షన్‌ కమిషన్‌కు సూచనలిచ్చారు. ఈ సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోని పురోగతులను అధిక స్థాయిలో లోక్‌సభ ఎన్నికల సమయంలో దుర్వినియోగం కాకుండా చూసేందుకు బడా టెక్ కంపెనీలు, కేంద్ర సంస్థలు తీసుకోవాల్సిన చర్యల గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఓపెన్‌ఏఐ ప్రతినిధులు తెలియజేశారు.

Post a Comment

0 Comments

Close Menu