Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Saturday, May 27, 2023

ఒకే ప్లాన్ ని తొమ్మిది మంది వాడుకోవచ్చు!


ఎయిర్‌టెల్ రూ. 599 ప్లాటినం ఫ్యామిలీ ప్లాన్‌ పేరిట ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఎయిర్‌టెల్ తీసుకొచ్చింది. దీనిని కపుల్ ప్లాన్ గా పిలుస్తారు. అంటే ఒకే ప్లాన్‌పై భార్యాభర్తలు ఇద్దరూ ప్రయోజనం పొందవచ్చు. ప్రైమరీ యూజర్ ఈ ప్లాన్ మేనేజ్ చేస్తుంటారు. కావాల్సినప్పుడు మరొక కుటుంబ సభ్యుణ్ని ఈ ప్లాన్‌లో యాడ్ చేసుకోవచ్చు. లేదా ప్లాన్ నుంచి తీసేయవచ్చు. ఈ ప్లాన్‌లోకి కొత్తగా ఎవరు వచ్చినా సెకండరీ యూజర్‌గా పరిగణించాలి. సెకండరీ యూజర్ కోటా కింద ఉన్న డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ఉన్న ఇద్దరికీ అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దాంతో పాటు నెల రోజులకు గానూ ఇద్దరికి 105 జీబీ డేటా వరకు లభిస్తుంది. అందులో మళ్లీ 75 జీబీ ప్రైమరీ యూజర్‌ లభిస్తుండగా.. మిలిగిన 30 జీబీ డేటా సెకండరీ యూజర్‌ కోటా కింద ఉంటుంది. ఒక వేళ ఈ డేటాను పూర్తిగా ఉపయోగించుకోలేకపోతే మరుసటి నెలకు బదిలీ చేసుకోవచ్చు. గరిష్ఠంగా 200 జీబీ వరకు బదిలీ చేసుకునే వీలుండడం గమనార్హం. ప్రైమరీ, సెకండరీ యూజర్లతో పాటు మరో 8 మంది వరకు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ప్రతి కనెక్షన్‌కు రూ.299 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రతి వ్యక్తికి 30 జీబీ డేటా అదనంగా వస్తుంది. పైగా అన్ని ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌లపై పరిచయ ప్రయోజనంగా అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా ఆస్వాదించవచ్చు. అందువల్ల, ఏదైనా 5G డేటా వినియోగం ప్లాన్ డేటా కోటా కింద పరిగణించబడదు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ 5G ప్లస్ 3000 నగరాల్లో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ తీసుకున్న వారికి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అమెజాన్ ప్రైమ్ ఆరు నెలల సభ్యత్వం లభిస్తుంది. అలాగే ఏడాది పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్, ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ ప్యాక్ లభిస్తాయి. అంతేకాక ఉచితంగా హలో ట్యూన్స్, వింక్ ప్రీమియం, ఏడాది పాటు అపోలో 24/7 సేవలు పొందవచ్చు. అలాగే ఎయిర్ టెల్ స్టోర్లు, కస్టమర్ కేర్ సెంటర్లలో వీఐపీ సర్వీస్ కింద ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. ఎయిర్‌టెల్ దాని ప్లాటినం కస్టమర్‌లకు ప్రాధాన్యతనిస్తుంది. వారికి ప్రత్యేకమైన వీఐపీ సేవలను అందిస్తుంది. ‘ప్రియారిటీ సర్వీస్’తో, ప్లాటినం కస్టమర్‌లు ఎయిర్‌టెల్ కాల్ సెంటర్‌లు, స్టోర్‌లలో ప్రిఫరెన్షియల్ కస్టమర్ సపోర్ట్‌ను పొందవచ్చు.

No comments:

Post a Comment

Popular Posts