Ad Code

రూ. 25 వేల కోట్లు నష్టపోయిన మార్క్ జుకర్‌బర్గ్‌ ?


సాంకేతిక లోపం కారణంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సర్వీసులు మంగళవారం గంట పాటు పనిచేయని సంగతి విదితమే. దీంతో మెటా సీఈవో జుకర్‌బర్గ్‌ మంగళవారం ఒక్క గంటలో 3 బిలియన్ల డాలర్లు (సుమారు రూ.25 వేల కోట్లు) నష్టపోయారు. దీంతో మెటా షేర్లు భారీగా క్షీణించాయి. బ్లూమ్‌బర్గ్‌ ఇండెక్స్‌లో జుకర్‌బర్గ్‌ సంపద సుమారు 3 బిలియన్లు తగ్గి 176 బిలియన్లకు పడిపోయింది. అయినప్పటికీ కుబేరుల్లో అతను నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. మంగళవారం మెటా షేర్లు 1.6 శాతం క్షీణించాయి. ఫలితంగా జుకర్‌బర్గ్‌ నికర విలువకు కోత పడింది.

 

Post a Comment

0 Comments

Close Menu