Ad Code

త్వరలో ఉద్యోగుల జీతాలు పెంచునున్న టీసీఎస్‌ ?


టీసీఎస్‌ ఉద్యోగులకు ఉద్యోగులకు జీతాలు పెంచాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లుగా 'బిజినెస్‌ స్టాండర్డ్‌' కథనం ప్రచురించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2024- 25 ఆర్థిక సంవత్సరంలో సంస్థలో పనిచేస్తున్న ఆఫ్ సైట్ ఉద్యోగులకు  సగటున 7 నుంచి 8 శాతం వేతనాలు పెంచే ఆలోచనలో ఉంది. అలాగే ఆన్ సైట్ ఉద్యోగులకు ఈసారి 2 నుంచి 4 శాతం జీతాలు పెంచనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో అద్భుతమైన పని తీరు కనబరిచిన ఉద్యోగులకు ఏకంగా 12  నుంచి 15 శాతం వరకు వేతనం పెంచనున్నట్లు బిజినెస్‌ స్టాండర్డ్‌ తన కథనంలో పేర్కొంది. ఈ వేతన పెంపు ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu