Ad Code

నకిలీ బ్యాంక్ యాప్‌లతో మోసపోకండి !

దేశంలో స్టాక్‌ మా​ర్కెట్‌ ఇన్వెస్టర్లు, బ్యాంకు ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని మోసగాళ్ల సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటువంటి హానికరమైన యాప్‌ల గురించి ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులను హెచ్చరించింది. వారి బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ములను దొంగిలించడానికి ఈ యాప్‌ల ద్వారా అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వ నిర్వహణలోని సైబర్ సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ అవేర్ నెస్ హ్యాండిల్స్‌ కు సంబంధించిన సైబర్ దోస్త్ వీటిని గుర్తించింది. ఈ హానికరమైన యాప్‌ల ద్వారా జరిగే ప్రమాదాలపై వినియోగదారులను హె​చ్చరించింది. యూనియన్-రివార్డ్స్.ఏపీకే పేరుతో నకిలీ యూనియన్ బ్యాంక్ యాప్ ను గుర్తించారు. ఇది యూనియన్ బ్యాంక్ అధికారిక ఆండ్రాయిడ్ యాప్‌గా మారి వినియోగదారులకు రివార్డ్‌లను అందిస్తుంది. దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్న వారి ఖాతాలలో సొమ్ములు మాయమవుతున్నాయి. ఇటీవల స్టాక్‌ మార్కెట్‌ లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య బాగా పెరిగింది. దీని ఆసరాగా చేసుకునే అనేక మోసపూరిత యాప్ లు తయారయ్యాయి.


దేశంలో స్టాక్‌ మా​ర్కెట్‌ ఇన్వెస్టర్లు, బ్యాంకు ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని మోసగాళ్ల సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటువంటి హానికరమైన యాప్‌ల గురించి ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులను హెచ్చరించింది. వారి బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ములను దొంగిలించడానికి ఈ యాప్‌ల ద్వారా అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వ నిర్వహణలోని సైబర్ సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ అవేర్ నెస్ హ్యాండిల్స్‌ కు సంబంధించిన సైబర్ దోస్త్ వీటిని గుర్తించింది. ఈ హానికరమైన యాప్‌ల ద్వారా జరిగే ప్రమాదాలపై వినియోగదారులను హె​చ్చరించింది. యూనియన్-రివార్డ్స్.ఏపీకే పేరుతో నకిలీ యూనియన్ బ్యాంక్ యాప్ ను గుర్తించారు. ఇది యూనియన్ బ్యాంక్ అధికారిక ఆండ్రాయిడ్ యాప్‌గా మారి వినియోగదారులకు రివార్డ్‌లను అందిస్తుంది. దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్న వారి ఖాతాలలో సొమ్ములు మాయమవుతున్నాయి. ఇటీవల స్టాక్‌ మార్కెట్‌ లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య బాగా పెరిగింది. దీని ఆసరాగా చేసుకునే అనేక మోసపూరిత యాప్ లు తయారయ్యాయి. వీటివల్ల దేశవ్యాప్తంగా అమాయక పౌరులు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. గ్రూప్-లు అనే మోసపూరిత యాప్ గురించి భారత ప్రభుత్వ సైబర్ సెల్ ఐఫోన్ వినియోగదారులను హెచ్చరించింది. ఈ యాప్ ను చూ చీ క్యో హుయ్ పేరుతో రూపొందించారు. వినియోగదారులను అనాలోచిత స్టాక్ ట్రేడింగ్ కార్యకలాపాలలో పాల్గొనేలా ఈ యాప్ మోసం చేస్తుంది. సెక్యూరిటీస్, ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కింద నమోదు కాని అనేక యాప్ లు ఆన్ లైన్ లో కనిపిస్తున్నాయి. వాటిలో ఐఎన్ఎస్ఈసీజీ, సీహెచ్ఎస్-ఎస్ఈఎస్, ఎస్ఏఏఐ, ఎస్ఈక్యూయూఓఐఏ, గూమీతో సహా అనేక మోసపూరిత యాప్‌లను గుర్తించారు. ఇవి వినియోగదారులకు తప్పుడు వాగ్దానాలు చేసి స్టాక్‌లో పెట్టుబడి పెట్టేలా ఆకర్షిస్తున్నాయి. దీనివల్ల వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. బాధితులు తరచుగా డిజిటల్ వాలెట్లలో ప్రదర్శించబడే నకిలీ లాభాల కోసం మోసగాళ్లు పేర్కొన్న బ్యాంకు ఖాతాలలో నిధులను జమ చేస్తున్నారు. ఆన్ లైన్ లో ఇటువంటి స్కామ్ లు పెరిగిపోవడంతో వినియోగదారులకు సెబీ  హెచ్చరికలు జారీ చేసింది. వివిధ స్టాక్ మార్కెట్ లలో , ఇతర వాటిలో పెట్టుబడి పెట్టేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సోషల్ మీడియా మెసేజ్‌లను అనుసరించడం మానుకోవాలని హితవు పలికింది. వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ ఛానెళ్లు, అనధికార స్టాక్ మార్కెట్ యాక్సెస్‌ను అందించే యాప్‌లు తదితర పెట్టుబడి కార్యకలాపాలలో పాల్గొనే ముందు ఫైనాన్సిల్ ప్లాట్‌ఫారమ్‌ల ఆధారాలను ధ్రువీకరించాలి సూచించింది.

Post a Comment

0 Comments

Close Menu