Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Sunday, October 31, 2021

పులిని చంపిన వేటగాళ్లు


పులిని చంపారన్న ఆరోపణలతో అరెస్టుకు వచ్చిన అధికారులపై దాడి జరిగింది. 10 మంది అనుమానితులను బలవంతంగా తీసుకెళ్తున్న వాహనాన్ని ఆందోళనకారులు అడ్డుకున్నారు. గ్రామస్తులను చేధించుకొని వాహనంలో వెళ్లిపోయారు. పులి చర్మం కేసులో అమాయకులను అరెస్ట్‌ చేయడంతో పాటు ఎంతో పవిత్రంగా భావించే ఈ మాసంలో తమ ఇళ్లల్లోకి అధికారులు బూట్లతో వచ్చి సోదాలు చేశారని ఆరోపిస్తూ ఇంద్రవెళ్లిలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మరో వైపు.. ఫారెస్ట్‌లో వేటగాళ్ల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎంత నిఘా, సీసీ కెమెరాలు పెట్టినా వారి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. పులులకు నిలయమైన ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో స్మగ్లర్లు అడవి జంతువులను రాత్రికి రాత్రే మాయం చేస్తున్నారు. వాటి చర్మాన్ని, గోర్లను తీసుకొని విదేశాలకు స్మగ్లింగ్‌ చేస్తున్నారు. తాజాగా ఆసీఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ ఫారెస్ట్‌ డివిజన్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కొద్ది రోజుల క్రితమే వెలుగులోకి రాగా.. గోప్యంగా ఉంచిన అధికారులు రహస్యంగా విచారణ చేస్తున్నారు. రెండు పులుల హతం అయినట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. వాటిలో ఒక చర్మాన్ని పట్టుకున్నట్టు.. మరో చర్మం పక్క రాష్ట్రానికి తరలించినట్టు సమాచారం. అయితే.. ఈ స్మగ్లింగ్‌కు పాల్పడినట్టు అనుమానిస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. చంపేసిన పులులు కూడా కాగజ్‌నగర్‌ కారిడార్‌లో సంచరించిన పులులుగా అనుమానాలు కలుగుతున్నాయి. ఇంద్రవెళ్లి, హీరాపూర, కాగజ్‌నగర్‌ ప్రాంతాల్లో మాత్రం రహస్యంగా విచారణ కొనసాగతోంది. ఈ సందర్భంలోనే అరెస్టుకు వచ్చిన అధికారులను అడ్డుకోవడంతో ఈ గొడవ మొదలయింది.

ఎన్నికలకు షెడ్యూల్ విడుదల


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడులయింది. ఏపీలో 3, తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబరు 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబరు 19న పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. ఏపీలో మే 31న ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. ఇక తెలంగాణలో ఆరుగురు ఎమ్మెల్సీ పదవీ కాలం జూన్ 3న ముగిసింది. ఈ స్థానాలకు గతంలోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వస్తూ వచ్చింది ఈసీ. ప్రస్తుతం కరోనా వ్యాప్తి అదుపులోనే ఉండడంతో.. ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు భర్తీ చేసేందుకు షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. ఏపీ అసెంబ్లీలో వైసీపీకి, తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్‌కు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండడంతో.. మెజారిటీ స్థానాలను ఆయా పార్టీలే గెలుచుకునే అవకాశముంది.

ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారా?



ఫాస్ట్ ఫుడ్స్ ఆరోగ్యానికి చాలా హానికరమని మరోసారి తేల్చాయి. 'జర్నల్ ఆఫ్ ఎక్స్‌పోజర్ సైన్స్ & ఎన్వీరాన్‌మెంటల్ ఎపిడెమియాలజీ'లో ఈ అధ్యయన తేలింది.  మెక్‌డొనాల్డ్స్‌, బర్గర్ కింగ్, పిజ్జా హట్, డోమినోస్, టాకో బెల్ వంటి ప్రప్రముఖ ఫుడ్ రెస్టారెంట్లలోని ఆహారంలో హానికరమైన 'ఫెలేట్స్' అనే ప్లాస్టిక్ సాఫ్ట్ ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. సాధారణంగా ఈ ఫేలేట్స్‌ను ప్లాస్టిక్ వస్తువులు మరింత ఫ్లెక్సిబుల్‌గా ఎక్కువకాలం మన్నేందుకు ప్లాస్టిసైజర్స్‌గా వాడతారు. వినైల్ ఫ్లోరింగ్, లూబ్రికేటింగ్ ఆయిల్స్, సబ్బులు, హెయిర్ స్ప్రేస్, లాండ్రి డిటర్జెంట్‌లలో కూడా వీటిని వినియోగిస్తారు. జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం, సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, బోస్టన్ యూనివర్సిటీ, హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధనకర్తలు ఈ ప్రముఖ రెస్టారెంట్ల నుంచి తెచ్చిన మొత్తం 64 శాంపిళ్లను పరీక్షించారు. హామ్‌బర్గర్లు, ఫ్రైస్, చికెన్, చీజ్ పిజ్జా వంటి పదార్థాలను పరిశీలించారు. ఇందులో దాదాపు 80 శాతానికి పైగా వాటిలో డీఎన్‌బీపీ అనే ఫెలేట్, 70 శాతం వాటిలో డీఈహెచ్‌టీ అనే ఫెలేట్ ఉన్నట్లు తేలింది. ఈ మేరకు హిందూస్థాన్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. ఈ డీఈహెచ్‌టీ అనే ప్లాస్టిసైజర్‌ను ఎక్కువగా గ్లోవ్స్, బాటిల్ క్యాప్స్, బెల్ట్స్, వాటర్ ప్రూఫ్ క్లాతింగ్‌లో వినియోగిస్తారు. ఇవి ఆహారంలో ఎక్కువగా ఉపయోగించడం వల్ల పిల్లల ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిపారు. గర్భవతులకు కూడా ఇది ప్రమాదకరమన్నారు. అయితే ఈ అధ్యయనాన్ని ఇంకా విస్తృత స్థాయిలో చేయాల్సి ఉందని వారు వెల్లడించారు. ఎందుకంటే ఈ శాంపిళ్లన్నీ కేవలం ఒక నగరం నుంచి తీసుకున్నవేనని స్పష్టం చేశారు.

బుడమ కాయ - ప్రయోజనాలు

 

 

మన చుట్టుపక్కల ఉండే ఎన్నో రకాల మొక్కల గురించి మనకు పెద్దగా తెలీదు. వాటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బుడమ కాయ తీపి పులుపు కలిసి విచిత్రమైన రుచితో ఉంటాయి. ఈ కాయలు పైన సన్నటి పొర లాంటి కవచం ఉండి లోపల చిన్ని పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగా పండినప్పుడు టమాటా రంగులో ఉంటాయి. నులిపురుగుల సమస్య ఉన్నవారు ఈ పండ్లు తింటే నులిపురుగుల సమస్య తొలగిపోతుంది. అలాగే మలబద్దకం సమస్యకు కూడా సహాయపడుతుంది. ఈ పండ్లను దసరా రోజు అమ్మవారి దగ్గర పెట్టి కొంతమంది తింటుంటారు. పొలాల్లో పని చేసే వారికి గాయాలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ కాయలను తెచ్చి వాటినుండి వచ్చే పసరును గాయాలపై వేస్తే రక్తస్రావం తగ్గి గాయాలు త్వరగా మానిపోతాయి. ఈ కాయలను తినడం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్ధ బలపడుతుంది. ఈ కాయలలోనే కాకుండా ఆకులలో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకులో విటమిన్ ఎ సమృద్ధిగా ఉండటం వలన కంటికి సంబంధించిన సమస్యల నివారణకు ఉపయోగపడుతుంది కీళ్ల నొప్పులు మోకాలు నొప్పులు ఉన్నవారు ఈ ఆకులను తెచ్చి మెత్తగా నూరి నొప్పులున్న చోట కట్టడం వలన నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

తక్కువ బడ్జెట్లో 'నాయట్టు' రీమేక్ ?

 

ఈ ఏడాది మలయాళం నుంచి వచ్చిన మంచి చిత్రాల్లో 'నాయట్టు' ఒకటి. రాజకీయ నాయకులు.. ప్రభుత్వాధినేతలు ప్రజల మధ్య కులం కుంపట్లు పెట్టి వ్యవస్థలను తమ స్వార్థం కోసం ఎలా ఉపయోగించుకుంటారో  అత్యవసర పరిస్థితులు తలెత్తినపుడు ప్రభుత్వం కోసం పని చేసేవాళ్లు ఎలా బలిపశువులు అయిపోతారో ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. కొవిడ్ నేపథ్యంలో ఈ హార్డ్ హిట్టింగ్ మూవీ నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజై మలయాళీలనే కాక వివిధ భాషల వాళ్లను అమితంగా ఆకట్టుకుంది. మార్టిన్ ప్రకాట్ రూపొందించిన ఈ చిత్రంలో కుంచుకో బోబన్, నిమిష, జార్జ్ జోసెఫ్ ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా ఆ ముగ్గురి చుట్టూనే తిరుగుతుంది. కథాబలానికి తోడు కథనంలో ఉత్కంఠ  ఈ ముగ్గురి అద్భుతమైన నటన దర్శకుడి ప్రతిభ తోడై సినిమా క్లాసిక్ స్టేటస్ తెచ్చుకుంది. 'నాయట్టు' రిలీజై కొన్ని రోజులకే తెలుగు రీమేక్ హక్కులు అమ్ముడైపోయాయి. అల్లు అరవింద్ వారి జీఏ2 పిక్చర్స్ దీని హక్కులను సొంతం చేసుకుంది. తెలుగు వెర్షన్ కోసం స్క్రిప్ట్ వర్క్, ప్రి ప్రొడక్షన్, కాస్ట్ అండ్ క్రూ ఎంపిక అన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడీ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి షూట్‌కు రెడీ అయిపోయారు. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాల దర్శకుడు కరుణ కుమార్ 'నాయట్టు' తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నాడు. బన్నీ వాసు, దివ్య మాధురి కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. తమిళంలో జార్జ్ జోసెఫ్ చేసిన కీలక పాత్రను ఇక్కడ రావు రమేష్ చేయబోతున్నారు. ఆయన కెరీర్లో ఈ పాత్ర ఒక మైలురాయిలా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఒరిజినల్లో కుంచుకో చేసిన పాత్రను ప్రియదర్శి, నిమిష కనిపించిన క్యారెక్టర్లో అంజలి కనిపించనున్నారు. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ మ్యూజిక్ అందించబోతున్నాడు. తక్కువ బడ్జెట్లో శరవేగంగా ఈ సినిమాను పూర్తి చేయడానికి టీం రెడీ అయింది.


పోషకాహారంతో ఆయుర్దాయం పెంచుకోండి..!

 

మనం తీసుకునే ఆహారం, జీవనశైలి బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అయితే చాలా మంది ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పోషకాహారం తీసుకోవడం, ఆకు కూరలు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుంది. ఈ ఆహార పదార్థాలను డైట్ లో తీసుకోవడం వల్ల ఆయుర్దాయాన్ని పెంపొందించుకోవచ్చు. ఆకు కూరలు: ఆకుకూరలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అన్న సంగతి అందరికీ తెలుసు. ఆయుర్దాయాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఆకుకూరలు సహాయపడతాయి. ముఖ్యంగా పాలకూరలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. క్రానిక్ సమస్యలు రాకుండా ఇదే చూసుకుంటుంది. అలానే ఆయుర్దాయాన్ని పెంపొందించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.

ఓట్స్: ఓట్స్ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. పైగా వీటిని మనం తయారు చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఒక సర్వే ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే ఆరు వారాల పాటు ఓట్స్ ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గాయని తేలింది. రోజుకి 100 గ్రాములు ఓట్స్ ని తీసుకుని వాళ్లలో కొలెస్ట్రాల్ తగ్గిందని బాడీ వెయిట్ కూడా తగ్గిందని తెలుస్తోంది. కాబట్టి ఓట్స్ ని మీ డైట్ లో తీసుకోవడం కూడా మంచిదే. దీని వల్ల ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. బ్లూ బెర్రీస్: ఓట్స్ తో పాటు బ్లూ బెర్రీస్స్ తీసుకుంటే ఆయుర్దాయం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు బ్లూ బెర్రీస్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కనుక ఓట్స్ తో బ్లూ బెర్రీస్ తీసుకోండి. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకోవడం మంచిది. ఇలా అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అలానే ఆయుర్దాయం కూడా పెరుగుతుంది.

గీతాంజలి రామకృష్ణ


గీతాంజలి 1960వ దశకములో పేరొందిన తెలుగు సినిమా నటి. గీతాంజలి దక్షిణ భారత భాషలన్నింటితో పాటు హిందీ సినిమాలలో కూడా నటించింది. గీతాంజలి 1947లో కాకినాడలో శ్రీరామమూర్తి, శ్యామసుందరి దంపతులకు జన్మించారు. నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్న కుటుంబంలో గీతాంజలి రెండవ అమ్మాయి. కాకినాడలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంటులో కొన్నేళ్లు చదివింది. మూడేళ్ల ప్రాయం నుండే గీతాంజలి తన అక్క స్వర్ణతో పాటు కాకినాడలోని గంధర్వ నాట్యమండలిలో లక్ష్మారెడ్డి, శ్రీనివాసన్ ల వద్ద నాట్యం నేర్చుకోవటం ప్రారంభించింది. నాలుగేళ్ల నుండే అక్కతో పాటు సభల్లో నాట్య ప్రదర్శనలు ఇవ్వటం ప్రారంభించింది. సహనటుడు రామకృష్ణను వివాహమాడి చిత్రరంగం నుండి నిష్క్రమించింది. వివాహం కాకముందు రామకృష్ణ, గీతాంజలి కలిసి కొన్ని సినిమాలలో నటించారు. గీతాంజలి 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరింది. గీతాంజలి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ 2019, అక్టోబరు 31 ఉదయం 4 గంటలకు మరణించారు.

డబ్బు...కాలం...విలువ.....!

 



సర్దార్ వల్లభ్ భాయి పటేల్



భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించారు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నారు. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టారు.1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించారు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించారు. రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించారు. స్వాతంత్ర్యానంతరం జవహార్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్రమంత్రిమండలిలో హోంశాఖ మంత్రి గానూ, ఉప ప్రధానమంత్రి గానూ బాధ్యతలను నిర్వహించారు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశారు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేదించారు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైనారు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్ధతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న మరణించారు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇచ్చింది. 1875 అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియాడ్లో జవేరీ భాయి, లాడ్‌లా పటేల్‌లకు నాల్గవ సంతానంగా వల్లభభాయి పటేల్ జన్మించారు. జవేరీభాయి వృత్తి రీత్యా వ్యవసాయదారుడు. జవేరీ భాయి పేట్ లావ్ తాలూకాలోని కరంసాద్ గ్రామంలో జన్మించారు.సామాన్య గృహస్థుడైనా 1857 స్వాతంత్ర్య సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి దళంలో పోరాడారు. భారతీయ శాసనసభ సభ్యుడు, రాజకీయ నాయకుడు, స్వరాజ్ పార్టీ సహ వ్యవస్థాపకుడు విఠల్ భాయ్ పటేల్ సోదరుడవుతారు. వల్లభాయ్ ప్రాథమిక విద్యాభ్యాసం తన ఊరిలో సాగించారు. స్థానికంగా జరిగిననూ ఉన్నత న్యాయశాస్త్రం చదువులకై ఇంగ్లాండు వెళ్ళి బారిష్టర్ పరీక్ష ఉత్తీర్ణుడైనారు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగివచ్చి అహ్మదాబాదులో న్యాయవాద వృత్తిని చేపట్టారు. తన భార్య అయిన ఝవెర్బాను పుట్టింటి నుండి తీసుకొచ్చి గోద్రాలో కాపురం పెట్టారు.1904లో ఆయనకు ఒక కుమార్తె - మణిబెన్, 1906లో దహ్యాభాయ్ అను కుమారుడు జన్మించారు. 1909లో ఆయన భార్య కాన్సర్ వ్యాధితో మరణించింది. వల్లభాయ్ కోర్టులో ఒక కేసు గురించి వాదిస్తున్నపుడు ఆమె మరణించిన వార్తను అందించినపుడు ఆ పేపరును చూసి తన జేబులో పెట్టుకొని, తిరిగి కేసు వాదించి గెలిచారు. ఆ తర్వాతే ఆ వార్తను ఇతరులకు తెలియచేసారు. ఆమె మరణానంతరం తిరిగి వివాహం చేసుకోరాదని నిశ్చయించుకున్నారు. తన కుటుంబసభ్యుల సహకారంతో పిల్లలను పెద్దవాళ్ళను చేసారు. 36 ఏళ్ళ వయసులో ఇంగ్లాండుకు వెళ్ళి అక్కడ లండన్‌లో ఒక లా కాలేజీలో చేరారు.36 నెలల కోర్సును 30 నెలలో పూర్తిచేసారు, అదీ క్లాసులో ప్రథమ స్థానంలో. తర్వాత అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చి అనతికాలంలోనే గొప్ప లాయరుగా విశేష కీర్తిని,ధనాన్ని ఆర్జించారు.ఆయన ఎప్పుడూ తెల్ల దొరలా సూటు బూటు వేసుకొని దర్జాగా తిరిగేవారు. బారిష్టరు పట్టా పుచ్చుకొని ఇంగ్లాండు నుంచి తిరిగి వచ్చిన వల్లబ్ భాయి పటేల్ దేశంలో జరుగుతున్న భారత జాతీయోద్యమం ప్రభావానికి లోనైనారు.తన వృత్తిని నిర్వహిస్తూనే గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యారు.1928లో బార్డోలీలో బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి విజయవంతంగా నడిపించి, దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు.అప్పుడే అతనికి సర్దార్ అనే పేరు వచ్చింది. గాంధీ మొదలుపెట్టిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని దాదాపు 300,000 మంది సభ్యులతో కలసి దాదాపు 15 లక్షల రూపాయల విరాళాలు సేకరించారు. విదేశీ వస్తు దహనంలో భాగంగా తనవద్దనున్న తెల్లదొరలు వేసుకొనే బట్టలను అగ్నికి ఆహుతి చేసారు. తన కుమార్తె మణి, కొడుకు దాహ్యాతో కలసి జీవితాంతం ఖాదీ బట్టలు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గుజరాత్‌లో మద్యపానం, అస్పృశ్యత, కులవిచక్షణలకు వ్యతిరేకంగా పనిచేసారు. 1931 కరాచి భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షుడిగా ఎన్నికైనారు.ఉప్పు సత్యాగ్రహం, 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం మొదలగు ఉద్యమాలలో కూడా ప్రముఖ పాత్ర వహించారు. భారత రాజ్యాంగ రచనకై ఏర్పడిన భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా వల్లబ్ భాయి పటేల్ మంచి సహకారాన్ని అందించారు. అంబేద్కర్ను డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించుటలో ముఖ్య పాత్ర పోషించారు. భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్ గా పనిచేశారు.భారత పార్లమెంటులో రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్ లకు నామినేట్ చేయు అధికారానికి కూడా అతనే ప్రతిపాదించారు. దేశ స్వాతంత్ర్యం కోసం విశేషకృషి సల్పిన వల్లబ్ భాయి పటేల్ కు సహజంగానే స్వాతంత్ర్యానంతరం ముఖ్యమైన పదవులు లభించాయి. జవహర్ లాల్ నెహ్రూ మంత్రిమండలిలో హోంమంత్రిగాను, ఉప ప్రధాన మంత్రిగాను 1947 నుంచి 1950 డిసెంబరు 15న మరణించేవరకు పదవులు నిర్వహించారు. భారత జాతీయోద్యమం సమయంలోనే వల్లబ్ భాయి పటేల్ నెహ్రూతో విభేదించారు. ముఖ్యంగా 1936 భారతీయ జాతీయ కాంగ్రెస్ సదస్సులో నెహ్రూ ప్రవచించిన సోషలిజాన్ని వల్లబ్ భాయి పటేల్ వ్యతిరేకించారు. స్వాతంత్ర్యానంతరం కూడా స్వదేశీ సంస్థానాల విలీనంలో నెహ్రూ శాంతి కాముకను కాదని బలవంతంగా బలప్రయోగం, సైనిక చర్యలు చేపట్టి విజయం సాధించారు. కాశ్మీర్ అంశాన్ని ఐక్య రాజ్య సమితికి నివేదించడంలో నెహ్రూతో విభేదించారు. పాకిస్తాన్ కు చెల్లించవలసిన రూ.55 కోట్లు ఇవ్వరాదని కూడా వల్లబ్ భాయి పటేల్ నెహ్రూతో వాదించారు. తొలి రాష్ట్రపతి ఎన్నికలలో కూడా చక్రవర్తి రాజగోపాలచారి వైపు నెహ్రూ మొగ్గు చూపగా, వల్లబ్ భాయి పటేల్ రాజేంద్ర ప్రసాద్ను ప్రతిపాదించి సఫలీకృతుడైనారు. అలాగే 1950 కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ అభ్యర్థి కృపలానీని కాదని పురుషోత్తమ దాస్ టాండన్ ను గెలిపించారు.

నీ మేలు కోరేవారు....!

 



పంచపాతకాలు....!

 



Saturday, October 30, 2021

కార్బన్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ విడుదల

 



స్మార్ట్‌ఫోన్ కంపెనీ కార్బన్ భారత టీవీ మార్కెట్‌లోకి ఎంటరవుతోంది. బడ్జెట్ ఫోన్ల తయారీ కంపెనీగా పేరొందిన కార్బన్ అందుబాటు ధరల్లో భారత్‌లో స్మార్ట్ ఎల్ఈడీ టీవీలను తయారుచేయనుంది. దేశీ మార్కెట్‌లో మేడ్ ఫర్ ఇండియా, మేడిన్ ఇండియా రేంజ్ స్మార్ట్ టీవీలు, ఎల్ఈడీ టీవీలను లాంఛ్ చేసిన కార్బన్ ఈ మార్కెట్‌లో విస్తరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. తమ న్యూ రేంజ్ స్మార్ట్ టీవీల విక్రయం కోసం కార్బన్ రిలయన్స్ డిజిటల్‌తో చేతులు కలిపామని కార్బన్ ఎండీ ప్రదీప్ జైన్ వెల్లడించారు. తమ స్మార్ట్ ఎల్ఈడీ టీవీలతో కస్టమర్లకు అందుబాటైన ధరలో వినూత్న ఫీచర్లతో కూడిన ఉత్పత్తులు అందిస్తామని చెప్పారు. తమ టీవీల ధరలు రూ 7990 నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపింది

ఆ రాయి ఖరీదు 24 కోట్లు !

 

యూకేకి చెందిన 70 ఏళ్ల బామ్మ రకరకాల వస్తువులను తీసుకొచ్చే వాళ్ల దగ్గరి నుంచి ఓ స్టోన్ ను కొనుగోలు చేసినట్లు ఆమెకు గుర్తు. కొని చాలా రోజులు కావడంతో మరిచిపోయింది. ఓ రోజు అనవరమైన వస్తువులను డస్ట్ బిన్ లో పడేసేందుకు సిద్ధమైంది. అప్పుడు ఆ స్టోన్ దొరికింది. దీనిపై నార్త్ షీల్డ్స్ లోని ఫీటన్ బై వేలం పాటదారులకు చెందిన మార్క్ లేన్ మాట్లాడారు. ఆభరణాల బ్యాగులో దానిని పెట్టుకొని వచ్చిందని, ఒక పెద్ద రాయి వలే అనిపించిందన్నారు. డైమండ్ టెస్టర్ తో టెస్టు చేసేంత వరకు దానిని తాము గుర్తించుకోలేక పోయామన్నారు. బెల్జియంలో ఆంట్ వెర్ప్ లోని నిపుణులచే ధృవీకరించక ముందే..తాము దానిని లండన్ లోని తమ భాగస్వాములకు పంపామన్నారు. దీనిని రూ. 24 కోట్లు విలువ చేసే 34 క్యారెట్ల డైమండ్ గా నిర్ధారించారు. ఈ డైమండ్ రింగ్ ను నవంబర్ 30వ తేదీన వేలం వేస్తామని..అప్పటి వరకు లండన్ లోని డైమండ్ క్వార్టర్ హాటన్ గార్డెన్ లో ఉంచుతామన్నారు.

గోద్రేజ్ కుటుంబంలో చీలిక

 

సబ్బులు, గృహోపకరణాల నుంచి స్థిరాస్తి దాకా వివిధ రంగాల్లో విస్తరించిన దేశీయ దిగ్గజం గోద్రెజ్‌ గ్రూప్‌నకు గోద్రెజ్‌ కుటుంబం సారథ్యం వహిస్తోంది. అనివార్య కారణాల వల్ల ప్రస్తుతం ఈ కుటుంబంలో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వ్యాపార విభజన జరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు బయటి నుంచి ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం సలహాలు కోరినట్లు పేర్కొన్నాయి. 124 సంవత్సరాల క్రితం 1897లో న్యాయవాది నుంచి వ్యాపారవేత్త అవతారమెత్తిన అర్దెశిర్ గోద్రేజ్,  గోద్రేజ్ సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం గోద్రేజ్ గ్రూపునకు ఆది గోద్రేజ్‌ (79) ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన సోదరుడు నాదిర్.. గోద్రేజ్ ఇండస్ట్రీస్‌, గోద్రేజ్‌ అగ్రోవెట్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. వీరి కజిన్‌ జంషీద్‌ ఎన్‌ గోద్రేజ్.. గోద్రేజ్‌ అండ్‌ బోయ్స్‌ మానుఫ్యాక్చరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. గ్రూపును రెండుగా విభజించాలని భావిస్తున్నారని సమాచారం. దీంట్లో ఒకదానికి ఆది, నాదిర్‌ నేతృత్వం వహిస్తారు. మరో దాన్ని జంషీద్‌, ఆయన సోదరి స్మితా గోద్రేజ్‌ కృష్ణా నిర్వహిస్తారు. ఈ వార్తలపై సంయుక్త ప్రకటన విడుదల చేసిన గోద్రేజ్ కుటుంబం.. ''తమ గ్రూపు సంస్థల్లోని వాటాదార్లకు లబ్ధి చేకూరేలా దీర్ఘకాల వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందిస్తున్నాం'' అని తెలిపింది. ఇందులో భాగంగా బయటి నుంచి కూడా సలహాలు కోరినట్లు పేర్కొంది. ఈ కుటుంబానికి సన్నిహితంగా ఉండే బ్యాంకర్లు నిమేశ్‌ కంపానీ, ఉదయ్‌ కొటాక్‌తో పాటు న్యాయపరమైన వ్యవహారాల్లో పేరుగాంచిన జియా మోదీ, సిరిల్‌ ష్రాఫ్‌ సైతం ఈ చర్చల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

కళ్ళ కింద వాపు వస్తుందా !

 


ఎక్కువ సమయం కంప్యూటర్ పని చేసేవాళ్ళలోనూ, ఎప్పుడూ క్లాస్ రూమ్ లో పుస్తకాలతో కుస్తీ పట్టేవాళ్ళలోనూ, అస్తమానం ఫోన్ అదేపనిగా చూసి వాళ్లలోనూ, కళ్లకు ఎక్కువ శ్రమ తప్పని వాళ్ళలోనూ తరచుగా కళ్ళకింద వలయాలు, వాపు వచ్చే అవకాశం ఉంది. వీటిని నివారించడానికి ఇంట్లోనే సొంతంగా చేసుకోగలిగిన కొన్ని చిట్కాలు. ఈ చిట్కాలను మీరు ఉదయం కానీ పడుకునే ముందు గానీ ప్రయత్నించవచ్చు. 

* ఒక టీ స్పూన్ ఉప్పు లో కొద్దిగా వేడినీటిని కలిపి అందులో కాటన్ ప్యాడ్ ని కానీ కాటన్ క్లాత్ ను కానీ ముంచి కళ్ళ మీద పెట్టాలి. ఇలా చేయడం వలన అలసిన కళ్ళకు స్వాంతన కలిగిస్తుంది.

* కోడిగుడ్డులోని తెల్లసొనను ఒక కప్పు లోకి తీసుకుని దానిని బాగా గిలకొట్టి కొండ చుట్టూ రాయాలి. ఇలా రాసిన తర్వాత కొంతసేపటికి ఆరిపోయి స్కిన్ టైట్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు గోరువెచ్చటి నీళ్ళతో కడగాలి ఇలా చేస్తూ ఉంటే కళ్లకింద చర్మం సాగినట్లు ఉండటం వాపు వంటివి తగ్గుతాయి. * సాధారణంగా చాలా రకాల ఫేషియల్ ప్యాక్ లకు కళ్లచుట్టూ ఉన్న చర్మం నిర్వహించాల్సి ఉంటుంది.

తొక్కే కదా అని పారేయకండి..!

 


మనం అరటిపండుని తిని తొక్క పడేస్తుంటాం. కానీ ఆరోగ్యానికి అరటిపండు మంచిదైతే, చర్మ ఆరోగ్యానికి ఆ అరటిపండు తొక్క ఇంకా మంచిదట. అరటిపండు తొక్కతో ఎన్నో చర్మసమస్యలకు పరిష్కారంలభిస్తుంది. అరటితొక్కలో సిలికా ఎంటెంట్‌ ఉంటుంది. ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ఫినోలిక్స్, యాంటీమైక్రోబయల్‌ లక్షణాలు కలిగి ఉంటుంది. అరటి తొక్కలోని తెల్లటి భాగాన్ని మీ ముఖం మీద మొటిమలు, మచ్చలపై సున్నితంగా రుద్దాలి. దాన్ని 15 నిమిషాలపాటు అలాగే ఉంచి  ఆపై ముఖాన్ని నీటితో కడుక్కోవాలి. ఫైబర్‌ అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉండే అరటి తొక్క చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. చర్మంపై ముడతలు, మొటిమలను తగ్గిస్తుంది. ఇది మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్‌ చేయడానికి సహాయపడుతుంది. అరటి తొక్కలో యాంటీ ఇన్ఫమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయని అనేక అధ్యయనాల్లో తేలింది. సోరియాసిస్‌తో బాధపడుతున్నవారికి కూడా ఈ అరటి తొక్కతో దురద నుంచి ఉపశమనం కలగుతుందట. తొక్కను తిన్నా కూడా మంచిదేనట. అరటి పండు తొక్కను తినడం వల్ల ఎర్రరక్త కణాల సంఖ్య పెరుగుతుందట. ఈ తొక్కలో లుటీన్ అనే పదార్థం ఉంటుంది. కాబట్టి ఇది దృష్టి సమస్యలను పోగొటట్టంలో ఉపయోగపడుతుంది. రేచీకటి, శుక్లాలు రావు. దెబ్బలు, గాయాలు, దురదలు, పురుగులు, కీటకాలు కుట్టిన చోట అరటి పండు తొక్కను రుద్దితే ఉపశమనం లభిస్తుంది. అరటి పండు తొక్కతో దంతాలను తోముకుంటే దంతాలు దృఢంగా,తెల్లగా మారుతాయట. చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. అరటి పండు తొక్కనే నేరుగా తినలేమని అనుకునేవారు వాటిని జ్యూస్‌లా పట్టి కూడా తాగవచ్చు. లేదంటే అరటి పండు తొక్కను నీటిలో బాగా మరిగించి ఆ నీటిని కూడా తాగవచ్చట!.

షుగర్, రక్తపోటుకి చెక్ - దాల్చిన చెక్క టీ

 


వంటింటి పోపుల పెట్టెలో ఉండే ఓ మసాలా దినుసు దాల్చినచెక్క. అతిపురాతన మైన ఈ మసాల దినుసు ఇది మంచి సువాసననిస్తుంది. ఒక గ్లాసు నీటిలో చిటికెడు దాల్చిన చెక్కపొడిని కలిపితే శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ , బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క టీ అని కూడా పిలువబడే దాల్చిన చెక్క నీరు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. దాల్చిన చెక్క, ముఖ్యంగా సిలోన్ దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక ఔషధ ప్రయోజనాలను ఇస్తుంది. అందుకనే తినే ఆహారంలో మసాలా దినుసులను పూర్వకాలం నుంచి ఉపయోగిస్తున్నారు. దాల్చిన చెక్క నీరు రెగ్యులర్ గా తాగడం వలన శరీరంలోని అదనపు షుగర్ ను బయటకు పంపుతుంది. అంతేకాదు రక్తంలో చక్కర స్థాయిని నియంత్రిస్తుంది. గోరువెచ్చని నీటిలో దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగితే శరీరంలోని అదనపు కొవ్వు కరిగిపోతుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. అంతేకాదు గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. అగ్రికల్చరల్ రీసెర్చ్ మ్యాగజైన్‌లో ప్రచురించబడిన ఒక పరిశోధన ప్రకారం.. రోజుకు 1 గ్రాము దాల్చిన చెక్కను రెగ్యులర్ గా తినే ఆహారంలో చేర్చుకోవడం టైప్-2 డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు. దాల్చినచెక్కలోని యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంతోపాటు నిర్వహించడంలో సహాయపడతాయి. వాస్తవానికి దాల్చిన చెక్క జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. టాక్సిన్స్‌ను శరీరం నుంచి బయటకు పంపి నిద్రలేమిని దూరం చేస్తుంది. దాల్చిన చెక్క టీ తయారీకి ముందుగా ఒక గ్లాస్ కంటైనర్‌లో ఒక లీటరు నీటిని తీసుకోవాలి. తర్వాత అందులో ఒక అంగుళం దాల్చిన చెక్క వేసి మరిగించాలి. తర్వాత ఆ నీటిలో 2-3 నిమ్మకాయ ముక్కలను జోడించండి. ఆ నీటిని రాత్రంతా అలాగే ఉంచి.. మర్నాడు ఈ దాల్చిన చెక్క టీ తాగాలి.

ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్య ఫలితమే బొగ్గు కొరత


బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో సరిపడా బొగ్గు నిల్వలు లేకపోవటం కేవలం ప్రణాళికా లోపమే. పూర్తి నిర్లక్ష్యం, అసమర్ధత ఫలితమే. దేశంలో విద్యుత్‌ సరఫరా సజావుగా సాగాలంటే బొగ్గు, విద్యుత్‌ శాఖల మధ్య సమన్వయం ఉండాలి. మోడీ ప్రభుత్వం ఈ సమన్వయం సాధించటంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పుడు కుంటి సాకులు వెతుకుతోంది. ఎవరిని బలి చేయాలా అని దిక్కులు చూస్తోంది.

ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కటంతో పెరిగే విద్యుత్‌ గిరాకీకి తగ్గట్లు మార్కెట్‌ శక్తులు అంతా సిద్ధం చేసుకుంటాయని, ఆపత్కాల నిల్వలు సిద్ధంగా ఉంచకోవాల్సిన అవసరం లేదని మోడీ ప్రభుత్వం గుడ్డిగా నమ్మింది. స్వంత క్యాబినెట్‌లో మంత్రుల మధ్య సమన్వయం లోపించటం, మార్కెట్‌ శక్తులు ప్రత్యేకించి ప్రైవేటు శక్తులు దేశ అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తాయని ఆశించి ప్రభుత్వాలకు స్వత:సిద్ధంగా ఉండాల్సిన ప్రణాళికా వ్యవస్థను కుప్పకూల్చటం వల్లనే నేడు దేశం ఈ సమస్యను ఎదుర్కొంటోంది.
ప్రజలందరూ పండగలు జరుపుకోవటానికి సిద్ధమవుతున్న తరుణంలో మోడీ ప్రభుత్వం దేశంలో విద్యుత్‌ సరఫరాలో కృత్రిమ కొరతకు తెరతీసింది. కోవిడ్‌ రెండో ఉప్పెన తర్వాత ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కుతున్నప్పుడు సహజంగానే విద్యుత్‌ వినియోగం పెరుగుతుందన్న అంచనా కనీస ఇంగితం గలవారెవరికైనా ఉంటుంది. దీంతో పాటు పండుగలు కూడా కలిసి రావటంతో విద్యుత్‌ వినియోగం పెరగటం సహజం. ప్రస్తుతం సాయంత్రంపూట ఎక్కువగా విద్యుత్‌ వాడే సమయంలో (సాయంత్రం ఆరు గంటల నుండి పది గంటల వరకూ) వినియోగించే విద్యుత్‌కు అవసరమైన సరఫరా కంటే ఏడు వేల మెగావాట్లు తక్కువగా సరఫరా అవుతోంది.
ఈ కొరత ప్రధానంగా పంజాబ్‌, రాజస్థాన్‌, బీహార్‌, జార్ఖండ్‌ లో ఉంది. మరికొన్ని రాష్ట్రాలు సుదీర్ఘ విద్యుత్‌ కోత భయంతో ఉన్నారు. ఢిల్లీలో లోడ్‌ షెడ్డింగ్‌ జరగనున్నట్లు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. మిగిలిన రాష్ట్రాలు కూడా విద్యుత్‌ కొరతకు సిద్ధంగా ఉండాలని ప్రజలను కోరుతున్నాయి.
ఈ కొరత కృత్రిమంగా సృష్టించబడిందన్న వాస్తవాన్ని మనం గమనించాలి. దేశంలో 3,90,000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం ఉంది. ప్రస్తుతం సాయంత్రం పూటల్లో బాగా వినియోగిస్తే అయ్యే ఖర్చు 170000 మెగావాట్లు. అంటే ఉత్పత్తి సామర్ధ్యంలో సగం కూడా వినియోగించుకోవటం లేదు. అలాంటప్పుడు పంజాబ్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌ లో విద్యుత్‌ కొరత ఎందుకు తలెత్తింది ?
ఒకవేళ విద్యుత్‌ వినియోగం పెరిగిందనే అనుకున్నా విద్యుత్‌ శాఖ, బొగ్గు గనుల శాఖ ... పెరుగుతున్న విద్యుత్‌ వినియోగానికి అవసరమైన ఉత్పత్తికి తగ్గట్లు బొగ్గు సరఫరాకు వీలుగా ఎందుకు సమన్వయం చేసుకోవటం లేదు? దేశంలోని 135 విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు కొరత ఉందని విద్యుత్‌ శాఖ చెప్తోంది. కనీసం విద్యుత్‌ కేంద్రంలో 20 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ నాలుగు రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయని కేంద్ర విద్యుత్‌ నియంత్రణ సంస్థ ప్రకటిస్తోంది.
వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తి పరిమితంగా ఉంటుందన్నది తెలిసిందే. ఈ సంవత్సరం బొగ్గు గనులు ఎక్కువగా ఉన్న తూర్పు భారతంలో భారీ వర్షాలు, వరదలు కారణంగా బొగ్గు ఉత్పత్తి కుంటుపడింది. అందుకే వర్షాకాలం కంటే ముందే విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు తమకు కావాల్సిన ఆపత్కాల నిల్వలు సమకూర్చుకోవాల్సిందిగా కోల్‌ ఇండియా కంపెనీ విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే ఎన్టీపీసి మొదలు ఏ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రమూ ఈ సలహాను పాటించలేదు.
అంతర్జాతీయ మార్కెట్‌లో గత సంవత్సరం 60 డాలర్లుగా ఉన్న టన్ను ధర ఈ సంవత్సరం 180 నుండి 200 డాలర్లకు పెరగటం కూడా కొత్త సమస్యలు తెచ్చి పెట్టింది. టాటా, అదానీలు గుజరాత్‌లోని ముంద్రాలో నడుపుతున్న విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ప్రధానంగా దిగుమతయ్యే బొగ్గు ఆధారంగా నడుస్తాయి. పైన చెప్పినట్లు అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధరలు పెరగటంతో ఈ కంపెనీలు దిగుమతులు తగ్గించాయి. ఆ మేరకు ఉత్పత్తి తగ్గింది. ప్రస్తుతం యూనిట్‌కు రూ.16-20 వరకూ ఉత్పత్తి వ్యయం అవుతోంది.
అది కూడా బాగా గిరాకీ ఉన్న సమయంలో కావాల్సినంత విద్యుత్‌ సరఫరా సిద్ధంగా ఉంచటానికి వీలుగా మాత్రమే దేశీయ బొగ్గుతో పాటు దిగుమతి చేసుకున్న బొగ్గును ఉపయోగిస్తున్నారు. ప్రపంచం లోని అన్ని దేశాల కంటే భారతదేశంలోనే బొగ్గు నిల్వలు అత్యధికంగా ఉన్నాయి. అటువంటిది మన దేశంలో బొగ్గు సరఫరా కొరత ఏమిటి? అందులోనూ కీలకమైన విద్యుత్‌ రంగానికి సరఫరా చేయలేనంత కొరత ఎందుకు వచ్చింది? గత కొన్ని నెలలుగా నామమాత్రపు నిల్వలతో ఈ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ఎందుకు నడుస్తున్నాయి?
ఆర్థిక వ్యవస్థ కోవిడ్‌ అనంతరం పట్టాలు ఎక్కుతుందని చెప్తున్న ప్రభుత్వం తదనుగుణంగా పెరుగుతున్న విద్యుత్‌ గిరాకీకి అనుగుణంగా సరఫరా చేసేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అదనంగా పండగల సమయంలో విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉంటుందని కూడా ఈ ప్రభుత్వానికి తెలిసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి? ఇది దుర్మార్గమైన నిర్లక్ష్యం కాకపోతే మరేమిటి?
భారీ వర్షాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధరలు పెరగటం వల్ల ఈ సమస్య తలెత్తిందని బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రకటించారు. గుడ్డిలో మెల్ల.
బొగ్గు కొరత ఉంది అని అంగీకరించారు. సహజంగా ప్రభుత్వ లోపాలు, వైఫల్యాలు అంగీకరించే లక్షణం మోడీ ప్రభుత్వానికి గానీ, దాని అధికార ప్రతినిధులకు గానీ లేదు. ఈసారి ఎందుకో విదేశీ కుట్ర రాగాలాపన అందుకోలేదు. ఈ సంక్షోభానికి ప్రతిపక్షాలే కారణమన్న యథాప్రకారపు ఊకదంపుడు కూడా ఈసారి వినపడలేదు.
ఈసారి ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు గనుల కంపెనీ అయిన కోల్‌ ఇండియాపై అభాండం మోపారు. 2016 నాటికి కోల్‌ ఇండియా వద్ద యాభై వేల కోట్ల రూపాయలుగా ఉన్న నగదు నిల్వల్లో 2021 నాటికి రూ.30 వేల కోట్లు ఆవిరయ్యాయి.
రూ.20 వేల కోట్లు మాత్రమే మిగిలాయి. ప్రధానంగా డెవిడెండ్లు, ఇతర చెల్లింపుల రూపంలో ఈ రూ.30 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కోల్‌ ఇండియా నుండి పీల్చేసింది. దీని అర్ధం ఏమిటి? బొగ్గు గనుల తవ్వకానికి కావాల్సిన నిధులు సమకూర్చటానికి బదులు మోడీ ప్రభుత్వపు ఆర్థిక లోటును పూడ్చటానికి కోల్‌ ఇండియా తనవద్ద ఉన్న నగదు నిల్వలు కరిగించేసింది. ఇంకా సూటిగా చెప్పాలంటే మోడీ ప్రభుత్వం టాటాలు, అదానీలు, అంబానీలు, బిర్లాల నుండి వసూలు చేయాల్సిన వేల కోట్ల రూపాయలు వసూలు చేయకపోవటం వల్ల వచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల వద్ద ఉన్న నగదు నిల్వలను ఊడ్చేస్తోంది.
దేశంలో బొగ్గు సరఫరా ప్రధానంగా రైల్వేల ద్వారానే జరుగుతుంది. ఈ రకంగా చూసినప్పుడు రైల్వేల ఆదాయంలో గణనీయమైన వాటాను కోల్‌ ఇండియా సమకూరుస్తుంది. బొగ్గు గనులు ప్రైవేటీకరించటం యుపిఎ, ఎన్‌డిఎ ప్రభుత్వాల విధానాలుగా ఉన్నప్పటికీ దేశంలో అవసరమైన బొగ్గులో 85 శాతం కోల్‌ ఇండియా సరఫరా చేసేదే. మౌలిక వసతుల రంగాన్ని అభివృద్ధి చేయటానికి ప్రైవేటు రంగం ఒరగబెట్టిందేమీ లేదన్నది బొగ్గు సరఫరా విషయాన్ని పరిశీలిస్తే అర్ధమవుతుంది. ఈ వాస్తవాన్ని అంగీకరించటం మార్కెట్‌ మాంత్రికులకు మింగుడుపడని విషయమే.
గత రెండేళ్లుగా కోవిడ్‌ 19 వాతపడిన అన్ని రంగాల్లాగానే బొగ్గు ఉత్పత్తి కూడా మందగించింది. విద్యుత్‌ వినియోగం కూడా మందగించింది. కోవిడ్‌ నియంత్రణలు రద్దు చేసి ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుతున్నప్పుడు విద్యుత్‌ వినియోగం పెరుగుతందని అర్ధం చేసుకోవటానికి రాకెట్‌ తయారీ కోసం కష్టపడినంతగా శ్రమ పడనక్కర్లేదు. విద్యుత్‌ వినియోగం పెరగటం అంటే విద్యుత్‌ తయారీకి అవసరమైన బొగ్గు వినియోగం కూడా పెరగటం అన్నది ఇంగిత జ్ఞానానికి అందే విషయమే. జులై నుండి అక్టోబరు మధ్య కాలంలో బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో అవసరమైన బొగ్గు నిల్వ చేసేందుకు విద్యుత్‌ మంత్రిత్వ శాఖ, బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ చేసిన ప్రయత్నాలేమిటి ?
ప్రతి విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రమూ కనీసం 20 రోజులకు సరిపడా బొగ్గు నిల్వ ఉంచుకోవాలన్నది కనీసంగా పాటించాల్సిన నియమం. ఈ నియమాన్ని విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ఎందుకు పాటించలేదు? అర్ధం చేసుకోవటం తేలికే. ఆపత్కాల అవసరాలకు నిల్వ చేయటం అంటే అదనపు ఖర్చుకు సిద్ధపడటమే. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం వద్ద ఎంత తక్కువ బొగ్గు నిల్వలు ఉంటే అంత ఎక్కువ లాభం. అవసరానికి మాత్రమే వాడుకోవటం అన్న పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానపు సూత్రాల్లో భాగమే ఇది.
ప్రైవేటు పరిశ్రమల వద్ద నిల్వలు తక్కువగా ఉంచుకోవటమే లాభార్జన మార్గాల్లో ఒకటి. దీనివల్ల సరఫరాకు అంతరాయం వచ్చినా, ఇతర నష్టాలు జరిగినా ఆయా పరిశ్రమల నిర్వాహకులకేమీ పట్టదు. ఇవే పెట్టుబడిదారీ ఉత్పత్తి చలన సూత్రాలు. ప్రభుత్వ రంగం ఇవి తెలుసుకోలేకపోతోందనే సంస్కరణవాదుల ఏడుపు.
దేశీయ బొగ్గు కొరతను అధిగమించటానికి గత కొంత కాలంగా ఇండొనేషియా, ఆస్ట్రేలియాల నుండి బొగ్గు దిగుమతి చేసుకుంటూ వచ్చాం. కానీ ఈ సంవత్సరం దిగుమతి చేసుకోలేదు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కూడా కోవిడ్‌ బారి నుండి క్రమంగా విముక్తి చెందుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధరలు మూడు రెట్లు పెరిగాయి.
గతంలో టన్నుకు 60 డాలర్లుగా ఉంటే ఇప్పుడు 200 డాలర్లు అయ్యింది. దాంతో ప్రధానంగా దిగుమతి చేసుకున్న బొగ్గుపైనే ఆధారపడిన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ఈ పెరిగిన ధరలకు కొనుగోలు చేయలేక ఉత్పత్తిని తగ్గించుకుంటూ వచ్చాయి.
గిరాకీ, సరఫరా ఒకదానితో ఒకటి పొసగనప్పుడు అవసరాలు తీర్చుకోవటానికి వీలుగా ఆపత్కాల నిల్వలు సిద్ధం చేసుకోవటం ఏ రంగానికైనా, ఏ ఉత్పత్తికైనా తప్పని పరిస్థితి. అయితే విద్యుత్‌ రంగంలో కీలక సమస్య ఉత్పత్తి అయిన విద్యుత్‌ను నిల్వ చేయటం.
బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో మన అవసరాలకు తగినట్లుగా ఉత్పత్తి తగ్గించుకోవటమో పెంచుకోవటమో చేయొచ్చు. కానీ ప్రత్యామ్నాయ విద్యుత్‌ ఉత్పత్తి వనరులైన పవన విద్యుత్‌ లేదా సోలార్‌ విద్యుత్‌లకు మళ్లిన తర్వాత ఇటువంటి పరిస్థితి తలెత్తితే దేశానికి ఉన్న మార్గం ఏమిటి ?ఇక్కడ సమస్య కేవలం సోలార్‌ లేదా పవన విద్యుత్‌ సరఫరాల్లో ఎగుడు దిగుళ్లే కాదు. సాధారణంగా మనం సాయంత్రం వేళల్లో ఎక్కువ విద్యుత్‌ వినియోగిస్తాము. ఆ సమయంలో సూర్యరశ్మి ఉండదు. ఇటువంటి పరిస్థితిని అధిగమించటానికి బ్యాటరీలతో కూడిన విద్యుత్‌ గ్రిడ్‌ నిర్మాణం ఓ ప్రత్యామ్నాయంగా చెప్తున్నారు.
అంటే పగటి పూట సూర్యరశ్మి ఆధారంగా తయారయ్యే విద్యుత్‌ను ఇటువంటి భారీ బ్యాటరీల్లో భద్రపర్చి రాత్రుళ్లు వాడుకోవచ్చని చెప్తున్నారు. తాజా విద్యుత్‌ సంక్షోభం కేవలం రాత్రి, పగలు మధ్య విద్యుత్‌ కొరతలో తేడాల గురించిన సమస్యనే కాక రుతువుల ఆధారిత సమస్యలను కూడా ముందుకు తెచ్చింది. ఉదాహరణకు ప్రపంచంలోనే పవన విద్యుత్‌పై ఎక్కువగా ఆధారపడ్డ దేశం జర్మనీ.
కానీ ఈ సంవత్సరం అనేక పర్యావరణ సమస్యల రీత్యా అక్కడ గాలి స్థంభించటంతో విద్యుత్‌ ఉత్పత్తి ఆశించినంత జరగలేదు. ఎంతవేగంగా గాలి ఉంటే అంత ఎక్కువగా పవన విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. దాంతో మరో మార్గం లేక మూలనపెట్టిన బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను దుమ్ము దులిపి మళ్లీ ఉత్పత్తి ప్రారంభించి జర్మనీ తమకు అవసరమైన విద్యుత్‌ను సమకూర్చుకుంది.
ప్రత్యామ్నాయ విద్యుత్‌కు మళ్లిన తర్వాత ఇటువంటి సమస్యలు తలెత్తితే మనం ఎలా ఎదుర్కోబోతున్నాము? దేశ అవసరాలకు తగ్గట్లు ప్రణాళికలు రూపొందించగల మేధావులు మనకు ఇంకా మిగిలి ఉంటే వాళ్లు పరిశీలించాల్సిన మరో ప్రత్యామ్నాయం జల విద్యుత్‌. మనకున్న జలవిద్యుత్‌ వనరులను పైన చెప్పిన భారీ బ్యాటరీల్లాగా ఉపయోగించుకునే మార్గం ఉంది. విద్యుత్‌ గ్రిడ్‌లో అధిక విద్యుత్‌ సరఫరా అవుతున్నప్పుడు దాన్ని ఉపయోగించి భారీ రిజర్వాయర్లలో నీళ్లు తోడేయటం.
గ్రిడ్‌కు సరఫరా తగ్గినప్పుడు అదే రిజర్వాయర్లలోని నీటిని ఉపయోగించి విద్యుత్‌ ఉత్పత్తి చేయటం. అయితే ఈ మార్గంలో పెట్టుబడిదారులకు తక్షణ లాభాలేమీ రావు. కాబట్టి మార్కెట్‌ శక్తులు ఇటువంటి ప్రత్యామ్నాయాలకు సిద్ధపడరు. కానీ ఈ ప్రత్యామ్నాయం సమాజానికి దీర్ఘకాలంలో ఉపయోగంగా ఉంటుంది. కానీ తక్షణ లాభాలు ఆర్జించే భారీ బ్యాటరీలతో కూడిన గ్రిడ్‌కు మొగ్గు చూపుతున్నారు. అక్కడ లాభాలు ఎక్కువ.
బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో సరిపడా బొగ్గు నిల్వలు లేకపోవటం కేవలం ప్రణాళికా లోపమే. పూర్తి నిర్లక్ష్యం, అసమర్ధత ఫలితమే. దేశంలో విద్యుత్‌ సరఫరా సజావుగా సాగాలంటే బొగ్గు, విద్యుత్‌ శాఖల మధ్య సమన్వయం ఉండాలి. మోడీ ప్రభుత్వం ఈ సమన్వయం సాధించటంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పుడు కుంటి సాకులు వెతుకుతోంది. ఎవరిని బలి చేయాలా అని దిక్కులు చూస్తోంది. ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కటంతో పెరిగే విద్యుత్‌ గిరాకీకి తగ్గట్లు మార్కెట్‌ శక్తులు అంతా సిద్ధం చేసుకుంటాయని, ఆపత్కాల నిల్వలు సిద్ధంగా ఉంచకోవాల్సిన అవసరం లేదని మోడీ ప్రభుత్వం గుడ్డిగా నమ్మింది.
స్వంత క్యాబినెట్‌లో మంత్రుల మధ్య సమన్వయం లోపించటం, మార్కెట్‌ శక్తులు ప్రత్యేకించి ప్రైవేటు శక్తులు దేశ అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తాయని ఆశించి ప్రభుత్వాలకు స్వత:సిద్ధంగా ఉండాల్సిన ప్రణాళికా వ్యవస్థను కుప్పకూల్చటం వల్లనే నేడు దేశం ఈ సమస్యను ఎదుర్కొంటోంది. మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌...ప్రణాళికా సంఘం పోషించిన పాత్ర పోషించలేదని మరోసారి రుజువైంది.

                                                                                                                               -ప్రబీర్‌ పురకాయస్త

స్వామి వివేకానంద

 



జీవితం...!

 


జైలు నుంచి విడుదలైన ఆర్యన్ ఖాన్‌


బాలీవుడ్‌ను కుదిపేసిన క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో అరెస్టయిన ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ కేసులో ఆర్యన్‌కు గురువారమే బెయిల్‌ లభించినప్పటికీ విడుదల ప్రక్రియ ఆలస్యమవడంతో శనివారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చాడు. కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు షారుక్‌ ఆర్థర్‌ రోడ్‌ జైలుకు వచ్చారు. డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌కు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి పూర్తి ఉత్తర్వులను నిన్న జారీ చేసింది. కానీ, అవి సకాలంలో జైలుకు చేరలేదు. విడుదల ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఆర్యన్‌ శుక్రవారం రాత్రి కూడా జైల్లో ఉండక తప్పలేదు. శనివారం ఉదయం కోర్టు ఉత్తర్వులను పరిశీలించిన జైలు సిబ్బంది ఆర్యన్‌ను విడుదల చేశారు.

Friday, October 29, 2021

ఇక నుండి మెటాగా గుర్తింపు..!

 


ఫేస్ బుక్ ఇప్పుడు తన అన్ని విభాగాలను లేదా సర్వీస్ లను ఒక్క గూటికి చేర్చడానికి పూనుకుంది. దీనికి గూగుల్ ని ఉదాహరణగా చెపుకోవచ్చు. గూగుల్ ఒకే బ్రాండింగ్ పేరుతో తన అన్ని సర్వీస్ లను నడిపిస్తోంది. అదే విధంగా, ఫేస్ బుక్ కూడా తన అన్ని సర్వీస్ లను ఒక పేరు పరిధిలోకి తీసుకువస్తుంది. అదే, ప్రస్తుతం మనం చర్చించుకుంటున్న మెటా అంటే, ఫేస్ బుక్ సంస్థ తన ఫేస్ బుక్ , మెసెంజర్,వాట్సాప్,ఇంస్టాగ్రామ్ మరియు ఆక్యూల్స్ తో సహా అన్ని సోషల్ మీడియా సేవలను కవర్ చేసింది. ఇక రానున్న రోజుల్లో వాటన్నిటిని  మెటా పరిధిలోకి తీసుకువస్తుంది. అయితే, ఫేస్ బుక్ మజమాన్యం క్లియర్ గా చెబుతున్న మరియు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఫేస్బుక్, వాట్సాప్ మరియు ఇతర సర్వీస్ లు ప్రస్తుతం ఎలా పనిచేస్తున్నాయో ముందు కూడా అలానే పనిచేస్తాయి మరియు దీనిని రీబ్రాండ్ ప్రభావితం చేయదు.

ఈఎంఐ ఆప్షన్ లోనూ జియోఫోన్ నెక్స్‌ట్....!

 

ప్రపంచంలోనే అత్యంత చవకైనా స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నవారి కోసం జియోఫోన్ నెక్స్‌ట్ వచ్చేసింది. రిలయన్స్ జియో, గూగుల్ సంయుక్తంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించడం విశేషం. కేవలం రూ.1,999 ఎంట్రీ ప్రైస్ చెల్లించి ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. మిగతా మొత్తాన్ని 18 నెలలు లేదా 24 నెలల ఈఎంఐ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ కేవలం రూ.300 నుంచే ప్రారంభం అవుతుంది. ఈఎంఐ ఆప్షన్ ఎంచుకునేవారికి డేటా, వాయిస్ కాల్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎంచుకునే ఆప్షన్‌ను బట్టి బెనిఫిట్స్ మారుతుంటాయి. మొత్తం నాలుగు కేటగిరీల్లో ఎనిమిది రకాల ఈఎంఐ ఆప్షన్స్ ప్రకటించింది రిలయన్స్ జియో. రూ.300 నుంచి రూ.600 వరకు ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి. ఆల్వేస్ ఆన్ ప్లాన్‌లో రెండు ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. నెలకు రూ.300 చొప్పున 24 నెలలు లేదా నెలకు రూ.350 చొప్పున 18 నెలలు చెల్లించాలి. ఈ ప్లాన్ ఎంచుకున్నవారికి నెలకు 5జీబీ డేటా + 100 నిమిషాల కాల్స్ లభిస్తాయి, లార్జ్ ప్లాన్‌లో రెండు ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. నెలకు రూ.450 చొప్పున 24 నెలలు లేదా నెలకు రూ.500 చొప్పున 18 నెలలు చెల్లించాలి. ఈ ప్లాన్ ఎంచుకున్నవారికి అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 1.5జీబీ డేటా బెనిఫిట్స్ లభిస్తాయి., ఎక్స్ఎల్ ప్లాన్‌లో రెండు ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. నెలకు రూ.500 చొప్పున 24 నెలలు లేదా నెలకు రూ.550 చొప్పున 18 నెలలు చెల్లించాలి. ఈ ప్లాన్ ఎంచుకున్నవారికి అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 2జీబీ డేటా బెనిఫిట్స్ లభిస్తాయి., ఎక్స్‌ఎక్స్ఎల్ ప్లాన్‌లో రెండు ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. నెలకు రూ.550 చొప్పున 24 నెలలు లేదా నెలకు రూ.600 చొప్పున 18 నెలలు చెల్లించాలి. ఈ ప్లాన్ ఎంచుకున్నవారికి అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 2.5జీబీ డేటా బెనిఫిట్స్ లభిస్తాయి., ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్ ఇలా ఈఎంఐ ఆప్షన్‌తో రావడం ఇదే మొదటిసారి. ఇందులో ఏ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నా ముందు రూ.1,999 ఎంట్రీ ప్రైస్ చెల్లించాలి. రూ.501 ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్ వద్దనుకుంటే రూ.6,499 చెల్లించి ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. జియోమార్ట్ డిజిటల్ నెట్వర్క్‌లో 30,000 పైగా రీటైల్ పార్ట్‌నర్స్ దగ్గర జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది.  జియోమార్ట్ డిజిటల్ రీటైలర్ దగ్గర జియోఫోన్ నెక్స్‌ట్ కొనడానికి రిజిస్టర్ చేయొచ్చు. లేదా https://www.jio.com/next లింక్‌లో రిజిస్టర్ చేయొచ్చు. వాట్సప్‌లో 70182-70182 నెంబర్‌కు HI అని టైప్ చేసి రిజిస్టర్ చేయొచ్చు. కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిన తర్వాత దగ్గర్లోని జియోమార్ట్ రీటైలర్ దగ్గర జియోఫోన్ నెక్స్‌ట్ కలెక్ట్ చేసుకోవచ్చు. 

జియోఫోన్ నెక్స్‌ట్ లో ప్రగతి ఓఎస్


జియో మరో అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ జియోఫోన్ నెక్స్ట్ ను విడుదల చేసి సంచలనం సృష్టించింది. ఈ ఫోన్ లో అనేక అద్భుతమైన ఫీచర్లున్నాయి. ఈ ఫోన్ ప్రగతి ఆపరేటింగి సిస్టమ్ పై పని చేస్తుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ను గూగుల్, జియో కలిసి అభివృద్ధి చేశాయి. భారతీయ వినియోగదారులు అవసరాలను తీర్చడమే లక్ష్యంగా గూగుల్, జియో సంయుక్తంగా ఈ జియోఫోన్ ను అభివృద్ధి చేశాయి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సరికొత్త ఫీచర్లతో యూజర్లు మంచి అనుభూతిని ఇవ్వనుంది. గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న మిలియన్ల కొద్ది యాప్ లు ఈ ఆపరేటింగ్ సిస్టమపై పని చేస్తాయి. ప్రత్యేకమైన సెక్యూరిటీ ఫీచర్లు సైతం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉన్నాయి.

* మాట్లాడడం ద్వారా ఫోన్ ను ఆపరేట్ చేయవచ్చు. (ఉదాహరణ: యాప్ లు ఓపెన్ చేయడం, సెట్టింగ్స్ మేనేజ్ చేయడం.) ఇంటర్నెట్ నుంచి సైతం సమాచారాన్ని కావాల్సిన భాషలో పొందొచ్చు.

* రీడ్ ఎలౌడ్ ఫీచర్ సహాయంతో యూజర్లు స్క్రీన్ పైన ఉన్న టెక్స్ట్ ను తమకు కావాల్సిన భాషలో చదివి వినిపించవచ్చు.

* ఇందులో ట్రాన్స్‌లేట్ నౌ అనే ఫీచర్ ఉంది. ఈ యాప్‌లో మొబైల్ స్క్రీన్ లేదా ఇమేజ్‌ను తమకు నచ్చిన భాషలో ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. 

* స్మార్ట్, పవర్ ఫుల్ కెమెరాను పొందుపర్చారు. పోట్రైట్ తో పాటు అనేక రకాల ఫొటోగ్రఫీ మోడ్స్ కు  ఇది సపోర్ట్ చేస్తుంది. ఆటోమోటిక్ బ్లర్డ్ బ్యాక్ గ్రౌండ్ ఫీచర్ ద్వారా యూజర్లు ఆకట్టుకునే ఫొటోలను పొందవచ్చు. నైడ్ మోడ్ ద్వారా లైట్ తక్కువగా ఉన్న సమయంలోనూ యూజర్లు మంచి ఫొటోలను తీయవచ్చు.

* గూగుల్ ప్లే స్టోర్ లోని మిలియన్ల కొద్ది యాప్ లకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో గూగుల్, జియో యాప్స్ కు సంబంధించిన ప్రీ లోడ్ యాప్ లు ఉంటాయి.

* సెక్యూరిటీ, నూతన ఫీచర్లకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అందించేలా ఓఎస్ ను తీర్చిదిద్దారు.

* నియర్ బై షేర్ ఫీచర్ ద్వారా ఇంటర్ నెట్ లేకుండానే యాప్స్, ఫైల్స్, ఫొటోలు, వీడియోలు, మ్యూజిక్ ను ఇతరులకు షేర్ చేయొచ్చు.

దుమ్ము లేపుతున్న రెడ్‌మీ అమ్మకాలు !

 

మూడవ త్రైమాసికంలో మొత్తం భారతీయ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లు 52 మిలియన్ యూనిట్లను దాటాయి. అయితే ఈ ఫలితాల్లో రెడ్‌మీ 9, రెడ్‌మీ 10 సిరీస్ స్మార్ట్‌ ఫోన్‌ల అమ్మకాలతో 22 శాతం వాటాతో షావోమీ ఇండియన్‌ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ షిప్‌మెంట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. 19శాతం షిప్‌మెంట్‌తో శాంసంగ్‌ భారత్‌లో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది. క్యూ3 భారతీయ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లపై కౌంటర్‌పాయింట్ నివేదికలో షావోమీ, శాంసంగ్‌, వివో, రియల్‌మీ, ఒప్పో ఫోన్‌ల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. షావోమీ 22శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉండగా..షావోమీ నుండి విడుదలైన నాలుగు స్మార్ట్‌ఫోన్‌లు రెడ్‌మీ9, రెడ్‌మీ9 పవర్‌, రెడ్‌మీ నోట్‌ 10, రెడ్‌మీ 9 అత్యధికంగా అమ్ముడైన జాబితాలో మొదటి నాలుగు స్థానాల్ని దక్కించుకున్నాయి. ఈ నాలుగు ఫోన్‌లు మూడవ త్రైమాసికంలో మిలియన్ కంటే ఎక్కువగా అమ్ముడైన ఫోన్‌ల జాబితాలో చోటు సంపాదించాయి. ఈ ఏడాదిలో రెడ్‌మీ 9 ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో 19 శాతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాటాతో శాంసంగ్ రెండవ స్థానంలో ఉంది. రూ.10,000 నుంచి రూ.30,000 మధ్యలో ఉన్న ఫోన్‌ అమ్మకాల మార్కెట్‌ వాటా 25 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎం42, శాంసంగ్‌ గెలాక్సీ ఎం 52, శాంసంగ్‌ గెలాక్సీ ఏ 22, శాంసంగ్‌ గెలాక్సీ ఏ52ఎస్‌ మోడళ్లు 5జీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌ బ్రాండ్‌లు రెండో స్థానాన్ని ఆక్రమించాయి. కొత్తగా విడుదలైన శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌3, శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 3 ఫోన్‌లో భారత స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నట్లు తేలింది.


8.5శాతం వడ్డీకి కేంద్రం ఆమోదం ?

 

2020-21 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్యనిధి (ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్ ఫండ్‌-ఈపీఎఫ్‌)పై 8.5శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనిపై త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌పై 8.5శాతం చొప్పున వడ్డీ జమ చేయాలని ఈ ఏడాది మార్చిలోనే ఈపీఎఫ్‌వో నిర్ణయ మండలి కేంద్ర ట్రస్టీల బోర్డుకు ప్రతిపాదించింది. ఇందుకు కార్మిక శాఖ కూడా సమ్మతించింది. తాజాగా ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థికశాఖ నుంచి ఆమోదం లభించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. 5కోట్లకు పైగా ఈపీఎఫ్‌ చందాదారులకు త్వరలోనే ఈ వడ్డీని జమ చేసే అవకాశాలున్నాయి. పీఎఫ్‌పై 8.5శాతం వడ్డీరేటు.. గత ఏడేళ్లలో ఇదే తక్కువ కావడం గమనార్హం. 2018-19, 2016-17లో 8.65శాతం చొప్పున వడ్డీ జమ చేయగా.. 2013-14, 2014-15లో 8.75శాతం చొప్పున ఇచ్చారు. 2015-16లో 8.8శాతం చొప్పున జమచేశారు. అయితే కొవిడ్‌ సమయంలో విత్‌డ్రాలు పెరగడం, ఖాతాదారుల నుంచి జమయ్యే సొమ్ము తగ్గిపోవడంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీని 8.5శాతానికి తగ్గించారు.

ఫ్లిప్‌కార్ట్‌లో నోకియా T20 ట్యాబ్లెట్ సేల్


ప్రముఖ స్మార్ట్​ బ్రాండ్​ నోకియా మరో ట్యాబ్లెట్​ను​ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. నోకియా టీ20 పేరుతో దీన్ని భారత మార్కెట్​లోకి ఆవిష్కరించనుంది. నవంబర్ 3 వరకు జరగనున్న ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సేల్​లో ఇది అమ్మకానికి రానుంది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్‌ తన టీజర్ పోస్టర్​లో నోకియా టీ20ని లిస్ట్​లో చేర్చింది. ఇప్పటికే గ్లోబల్​ మార్కెట్​లో విడుదలైన ఈ ట్యాబ్లెట్​లో అనేక అద్భుతమైన ఫీచర్లను అందించింది. నోకియా T20 ట్యాబ్లెట్ 10.4 అంగుళాల 2K డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో వర్చువల్ ఇంటరాక్షన్‌లను సులభతరం చేసే స్టీరియో స్పీకర్లను చేర్చింది. 8,200mAh లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, ప్రత్యేక గూగుల్​ కిడ్స్​ స్పేస్ వంటి అప్​డేటెడ్​ ఫీచర్లను అందించింది. భారత మార్కెట్​లో నోకియా T20 ధర తెలియనప్పటికీ, ఇది గ్లోబల్​ మార్కెట్​తో సమానంగా ఉండనుంది. యూరప్‌లో, నోకియా T20 వైఫై వేరియంట్​ దాదాపు రూ. 17,200, వైఫై + 4జీ మోడల్ ధర సుమారు రూ. 20,600 నుండి ప్రారంభమవుతుంది. ఇండియాలో ఖచ్చితంగా ధర ఎంత ఉంటుందన్న వివరాలు తెలియదు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో ఈ ట్యాబ్లెట్ కొనొచ్చు.

భవిష్యత్ అంతా విద్యుత్ వాహనాలదే !

 

భవిష్యత్ అంతా విద్యుత్ వాహనాలదేనని, రాష్ట్రంలో ప్రతీ 25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. విద్యుత్ వాహనాలను ప్రజలు కొనుగోలు చేసేందుకు వీలుగా పన్ను రాయితీలు, తయారీదారులకు ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తోందన్నారు. విద్యుత్ వాహనాల విషయంలో అతి పెద్ద ఛాలెంజ్ ఛార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అని తెలిపారు.  శుక్రవారం హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో 'ఈవీ ట్రేడ్ ఎక్స్ పో'ను మంత్రి జగదీశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా..ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ వాహనాల కొనుగోళ్లు పెరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని ద్వారా కాలుష్యం బారి నుంచి బయటపడవచ్చని, ఏర్పాటు చేసిన ఇలాంటి ఎక్స్ పోల ద్వారా…ఈవీ వాహనాల అమ్మకాలతో పాటు..మార్కెట్ లో ఎలాంటి ట్రెండ్ నెలకొందనే విషయంపై అవగాహన కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ను మంత్రి జగదీశ్ స్వయంగా నడిపి చూశారు.

పెట్రోల్ కన్నా విమానాల ఇంధనం ధరే తక్కువ!

 


కారే కాదు బైక్ బయటకు తీయాలన్నా జేబులు ఖాళీ అయిపోతున్నాయి. ఇక కారు బయటకు తీస్తే చెప్పనే అక్కర్లేదు. జేబులు కాదు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఖాళీ అయ్యే పరిస్థితి. బైకు, కార్ల పెట్రోల్ ధర లీటరు రూ.110కు చేరుకోగా అదే విమానం ఇంధనం మాత్ర కేవలం రూ..79 మహా అయితే రూ.80గా ఉంది. అడ్డుఅదుపు లేకుండా పెరుగుతున్న ధరలతో బైకులు, కార్లను కొన్నాళ్లకు మూలనపడేయాలనే ఆలోచనలో కొందరు ఉండగా.. మరికొందరు తక్కువ ధరకే పెట్రోలు కావాలంటే విమానాలు కొనుక్కోవడం మేలంటూ సెటైర్లు వేస్తున్నారు. బైకు సామాన్యుడి వాహనం. కాస్త మెరుగైన ఆర్ధిక పరిస్థితి ఉంటే కారు ఇవే సర్వాసాధారణంగా ఉండే వాహనాలు. కానీ వాటికి కూడా ఇంధనం పోయించే పరిస్థితి లేదిప్పుడు. పెట్రోలు కంటే విమానాలకు వాడే పెట్రోలు చాలా చీప్‌గా లభిస్తుంది. తాజాగా పెరిగిన రేట్లతో ఢిల్లీలో సాధారణ పెట్రోలు లీటరు ధర రూ.108.64లు ఉండగా విమానాలకు ఉపయోగించే ఏవియేషన్‌ టర్బో ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌)పెట్రోలు లీటరు ధర రూ.79.02లకే లభిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై విషయానికి వస్తే రెగ్యులర్‌ పెట్రోలు ధర రూ.114.47 ఉండగా విమానాలకు ఉపయోగించే ఇంధనం లీటరు పెట్రోలు ధర రూ.77.37లకే లభిస్తోంది. చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌, బెంగళూరు ఇలా అన్ని నగరాల్లో ఇంచు మించు ఇలాగే ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సామాన్యులు వినియోగించే పెట్రోలు కంటే విమానాలకు వాడే పెట్రోలు ధర కనీసం 30 శాతం తక్కువ ధరకే లభిస్తోంది.

ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్ ముసుగులో మోసం


సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజలకు టోకరా వేసేందుకు జిత్తులమారి ట్రిక్కులు  ప్రయోగిస్తున్నారు. ప్రముఖ కంపెనీల అధికారుల్లా మాట్లాడుతూ కేవైసీ, ఓటీపీ పేరుతో ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. ఈ మోసాల గురించి ఇప్పటికే పలు సంస్థలు జనాలను హెచ్చరించాయి. కానీ ఇప్పటికీ ఈ కేటుగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్న వారందరో! తాజాగా కేవైసీ ఫారమ్‌ను అప్‌డేట్ చేసే సాకుతో ఒక ఎయిర్‌టెల్ కస్టమర్‌ను బురిడీ కొట్టించారు. సదరు కస్టమర్ బ్యాంక్ వివరాలు సేకరించి అతడి అకౌంట్ నుంచి భారీ నగదును తస్కరించారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ కేవైసీ, ఓటీపీ మోసాల గురించి తన కస్టమర్‌ లను మళ్లీ హెచ్చరించింది.

మోసగాళ్లు ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్‌ల ముసుగులో యూజర్ల బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎయిర్‌టెల్ తెలిపింది. ఈ తరహా కేటుగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. "బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి కాల్ చేస్తున్నట్లు లేదా మెసేజ్‌లు పంపిస్తున్నట్లు మోసగాళ్లు కస్టమర్లను సంప్రదించవచ్చు. తరువాత ఇప్పటికే ఉన్న బ్యాంక్ ఖాతాను అన్‌బ్లాక్ లేదా రెన్యువల్ చేస్తామని కస్టమర్ల ఖాతా వివరాలు లేదా ఓటీపీని అడగవచ్చు. కస్టమర్లు ఇచ్చే వివరాలు ఈ మోసగాళ్లు బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయడానికి ఉపయోగపడతాయి. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. కస్టమర్ ఐడీ, ఎంపిన్(MPIN), ఓటీపీ మొదలైన ఆర్థిక లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్‌లో పంచుకోవద్దని మిమ్మల్ని కోరుతున్నాం" అని ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విట్టల్ హెచ్చరించారు. ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్‌లుగా నటిస్తూ సైబర్ మోసగాళ్లు చేసే కాల్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని యూజర్లను విట్టల్ కోరారు. ఫేక్ యూపీఐ వెబ్‌సైట్‌లు, ఫేక్ ఓటీపీల కారణంగా తరచూ జరిగే మోసాల గురించి కూడా అతను వివరించారు. మోసగాళ్ల బాధితులు అవ్వకుండా ప్రతి కస్టమర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన పేర్కొన్నారు.

వ్యాక్సిన్ తీసుకున్న వారి నుంచి డెల్టా వ్యాప్తి !

 

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చాలా విజయ వంతంగా సాగుతోంది. ఇప్పటికే కొన్ని దేశాలు బూస్టర్‌ డోసులను కూడా ఇచ్చేశాయి. అయినప్పటికీ యూకే, రష్యా లాంటి దేశాల్లో కరోనా విలయం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఆయా దేశాల్లో డెల్టా రకం వైరస్‌ వ్యాప్తి విపరితంగా ఉంది. మరీ… వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ కరోనా ఉదృతికి కారణమేంటి ? అంటే వ్యాక్సిన్‌ వేసుకున్న వారి నుంచి కూడా డెల్టా వ్యాప్తి చెందడమే అని ఓ అధ్యయనం లో తేలింది. కరోనా రకాల్లోనే అత్యంత ప్రమాదకరమైన వేగవంతమైన వేరియంట్‌ గా పిలుస్తున్న డెల్టా రకం వైరస్‌.. టీకా వేసుకున్న వ్యక్తి నుంచి కూడా సులువుగా ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. బ్రిటన్‌ కు చెందిన ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ 621 మందితో ఏడాది పాటు చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం పడింది. 651 మందిపై ఈ అధ్యయనం జరపగా ఇందులో 205 మంది నుంచి వారి కుటుంబ సభ్యులకు డెల్టా వేరియంట్‌ సోకినట్లు తేలింది.

స్కిట్‌‌కి లక్ష ?

  

హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. జబర్దస్త్ లో అతను వేసే పంచులు బాగా పేలుతుంటాయి.  ఇక స్కిట్లు యూట్యూబ్‌లో ఎప్పుడు ట్రెండింగ్‌లోనే ఉంటాయి. జబర్దస్త్ తో పాటుగా శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలలో కనిపిస్తూ అలరిస్తుంటాడు. దీనితో హైపర్ ఆదికి మంచి డిమాండ్ కూడా ఉంది. అయితే అతనికి అంతే రేంజ్ లో రెమ్యునరేషన్ కూడా ఉంటుందని టాక్. ఈవెంట్‌ను బట్టి హైపర్‌ ఆది పారితోషికం డిమాండ్‌ చేస్తాడని సమాచారం. ఇక జబర్దస్త్ లో ఒక్కో స్కిట్ కి రెమ్యునరేషన్ లక్షల్లో ఉంటుందని తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే అతన్ని ఏడాది ఆదాయం కోటి రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా. ఇక బుల్లితెరతో పాటుగా సినిమాల్లో కూడా మెరుస్తూ అలరిస్తున్నాడు ఆది. కామెడీ షోలతో పాటుగా, సినిమాలతో కలిపి బాగానే వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సొంత ఊర్లో 16 ఎకరాలు కొన్న ఆది.. హైదరాబాదులో తాజాగా ఓ ప్లాట్ తీసుకున్నట్టుగా సమాచారం.

ప్రకృతి..!

 

జాన్ గాడ్ అనే వ్యక్తి ఒక బ్యాంకు స్థాపించాడు. ఇందులో అందరూ మెంబర్లు కావచ్చు. ప్రవేశం ఉచితం. మీ అకౌంట్లో ప్రతి రోజూ 86400  జమ చేయబడుతుంది. మీ ఓపిక పట్టి ఖర్చు పెట్టుకోవచ్చు. అయితే ఒక విషయం..!! బద్దకంతో గానీ, నిద్రపోయి గానీ మీరు కొంత ఖర్చు పెట్టకపొతే, ఆ మిగిలినదంతా మరుసటి రోజుకి ’మైనస్’ అయిపోతుంది. ఈ రోజు ‘అదా చేసి’ తరువాత ఖర్చు పెట్టుకుంటానూ అంటే కుదరదు.  మరుసటి రోజు పొద్దున్న మళ్ళీ ఎనభై ఆరువేల నాలుగు వందలు జమ చేయబడతాయి. దీన్ని ఇంకొకరి పేరు మీద ట్రాన్స్ ఫర్ చేయటానికి వీలు ఉండదు. ఎందుకంటే బ్యాంకు వారు ఎపుడైనా సరే ‘…నేటితో మీ అకౌంట్ క్లోజ్ చేస్తున్నాము’ అని నోటీసు ఇవ్వకుండానే చెప్పవచ్చు. వారసత్వం ప్రసక్తే లేదు. దీంట్లో మీరు మెంబర్ అయితే ఏం చేస్తారు? మీరు మరింత ఆనందంగా ఉండటం కోసం... మీరు ప్రేమించే వాళ్ళ కోసం... మరింత లాభదాయకంగా ఖర్చు పెట్టటానికి ప్రయత్నిస్తారు. మరింత   ఫలవంతంగా ఎలా ఖర్చుపెట్టాలా అని ఆలోచిస్తారు..! ఎందుకంటే మరుసటి రోజు పొద్దున్నకి దాని విలువ సున్నా అయిపోతుంది కాబట్టి. అంతే కదా..!

నిజంగా ఇలాంటి బ్యాంకు ఉంది, నమ్మకం కలగటం లేదా? అవును, నిజంగానే ఉంది. ఈ బ్యాంకుని సృష్టించి, రోజుకి ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు మీ అకౌంట్లో వేసేది ప్రకృతి..! మీరు వాడుకోని సమయం అంతా వృథా. పైగా మరణంతో అకౌంటు క్లోజ్ అయిపోతుంది. మీరు ఎంత ధనవంతులో ఆలోచించండి..! జీవితంలో విజయం సాధించాలంటే అన్నిటి కన్నా మొదటగా కావలసింది 'సమయం' విలువ గ్రహించటం ఈ విషయం గ్రహించి, ప్రతి క్షణాన్నీ ఆనందం కోసమో, ఆర్థిక లాభం కోసమో, చుట్టూ ఉన్న అనాధల కోసమో, ఆత్మీయుల ప్రేమ కోసమో ఖర్చు పెట్టిననాడు, మీరు విజయం సాధించినట్టే.

Thursday, October 28, 2021

నీరు ఎక్కువ తాగినా ప్రమాదమే !


మంచినీళ్ల వల్ల మనిషికి ఎన్నోలాభాలు ఉంటాయి. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్లు అయినా వాటర్ తాగాలని చెబుతుంటారు. ఇంకా ఇది కాకుండా..తీసుకునే ఆహారంలో కూడా వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. మన శరీరంలోని అవయవాలు, కణాలు సరిగ్గా పని చేయాలంటే సరైన మోతాదులో నీరు తీసుకోవాలి. అందుకే ఎక్కువ మంది నీరు ఎక్కువగా తీసుకుంటుంటారు. బరువుతగ్గాలంటే కూడా నీళ్లు ఎక్కువగా తాగుతారు. ఇంకా నీళ్లు ఎక్కువుగా తాగటం వల్ల కూడా శరీరంలో బ్లడ్ అంతా క్లీన్ అవుతంది అంటారు. కానీ నీరు ఎక్కువగాతాగటం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందట.  నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక హైడ్రేషన్‌కు దారి తీస్తుంది. ఇది మరీ ప్రమాదం కాకపోయినప్పటికీ.. కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మనిషి విసర్జించే మూత్రం యొక్క రంగు కూడా మనం ఎంత నీరు తీసుకుంటున్నామనే విషయాన్ని చెబుతుందట. మూత్రం నీలం రంగులో ఉంటే మనం తీసుకునే నీటి కంటెంట్ కూడా తగ్గించుకోవాలని అర్థం.  నీరు ఎక్కువగా తాగడం వల్ల మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఎక్కువ మంది రోజుకు 6 నుంచి 8 సార్లు మూత్ర విసర్జన చేస్తుంటారు. అయితే రోజుకు 10సార్లు మూత్ర విసర్జన చేసేవాళ్లు ఎక్కువగా నీళ్లు తీసుకుంటారని అర్థం. దీని వల్ల ఎక్కువగా అలసిపోయే ప్రమాదం ఉంటుంది. నీరసంగా అనిపిస్తుంది. చేతులు, పాదాలు, పెదాల్లో వాపు ఉండటం కూడా ఎక్కువ నీరు తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాల్లో ఒకటి. ఎక్కువగా నీళ్లు తీసుకోవడం వల్ల రక్తంలో సోడియం లెవల్స్ పడిపోయేందుకు కారణం కావొచ్చు. ఇది హైపోనాట్రిమియాకు కారణమవుతుంది. తలనొప్పి, వాంతులు, డయేరియా దీని లక్షణాలు. మన చేతులు, పాదాలు నొప్పి పెడితే అది కూడా అధిక హైడ్రేషన్‌కు కారణం అవ్వొచ్చు. కాబట్టి నీరు ఎక్కువగా తాగటం మంచిది కదా..అధికంగా తాగి లేనిపోని సమస్యలు తేచ్చుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. 

ఎలక్ట్రిక్‌ కార్లపై ఉబర్‌ చూపు...!

 

ప్రపంచవ్యాప్తంగా పలు ఆటోమొబైల్‌ కంపెనీలు ఎలక్ట్రిక్‌ కార్ల తయారీకి సన్నద్దమైన విషయం తెలిసిందే. సాంప్రదాయ శిలాజ ఇంధన వాహనాలకు చెక్‌ పెడుతూ, ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టి సారించాయి. కాగా హెర్జ్‌ వంటి రెంటర్‌ కార్‌ ఆపరేటర్స్‌ కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలను వాడేందుకు సిద్దమయ్యాయి. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ పేరొందిన టెస్లాతో అమెరికన్‌ రెంటల్‌ కార్‌ కంపెనీ హెర్జ్‌ కీలక ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. హెర్జ్‌ సుమారు లక్ష టెస్లా కార్లను ఆర్డర్‌ను చేసింది. తాజాగా మరో ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ క్యాబ్‌ ఆపరేటర్‌ ఉబర్‌ కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టిసారించింది. అందులో భాగంగా హెర్జ్‌ కంపెనీ భాగస్వామ్యంతో ఉబర్‌ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. హెర్జ్‌ రెంటల్‌ ఎలక్ట్రిక్‌ కార్లను ఉబర్‌ వాడనుంది. సుమారు 50 వేల ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉబర్‌ ఆర్డర్‌ ఇచ్చింది. 2023 నాటికి 50 వేలకు ఎలక్ట్రిక్‌ కార్ల క్యాబ్‌ సర్వీస్‌లను ప్రవేశపెడతామని ఉబర్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. అమెరికా, యూరప్‌, కెనడాలో 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 2040 నాటికి ఎలక్ట్రిక్‌ క్యాబ్‌ సేవలను ప్రవేశపెట్టనున్నట్లు ఉబర్‌ వెల్లడించింది.

శీతాకాలం - మహిళలు - పోషకాహారం


మహిళలు పోషకాహారం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే వయసు పైబడుతన్నా కొద్ది వారికి పోషకాల అవసరం అధికంగా ఉంటుంది. జీవనశైలిలో మార్పుల కారణంగా, చర్మం, జుట్టు, ఎముకలకు సంబంధించిన సమస్యలు మహిళలకు సాధారణం. తరచుగా మహిళలు వెన్ను, కాళ్ళలో నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 

విటమిన్ సి కోసం, మీరు నారింజ, నిమ్మ, కివి, బొప్పాయి, జామ మొదలైన సిట్రస్ పండ్లను తీసుకోవచ్చు. వాటిలో విటమిన్ సి ఉంటుంది. మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది మన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. చలికాలంలో వచ్చే వ్యాధులను దూరం చేస్తుంది, ఆకుపచ్చని కూరగాయలలో మన శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన విటమిన్లు , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూర, ఉదాహరణకు ఇందులో విటమిన్లు A , C అధికం. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. శీతాకాలం కాలానుగుణ ఆకుపచ్చ ఆకు కూరలకు ప్రసిద్ధి చెందింది. అందుకే ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది, కుంకుమపువ్వు, పసుపు, దాల్చినచెక్క , ఏలకులు వంటి భారతీయ మసాలా దినుసులు చలికాలంలో శరీరానికి అవసరమైన వేడిని అందిస్తాయి. ఇది కాకుండా జలుబు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధులను నివారించడానికి పనిచేస్తాయి. మీరు ఈ మసాలా దినుసులను అనేక విధాలుగా తీసుకోవచ్చు. మీరు వీటిని రకరకాల పానీయాలలో కలుపుకొని తాగవచ్చు, డ్రై ఫ్రూట్స్‌ చల్లని వాతావరణంలో వేడిని పుట్టిస్తాయి. ఖర్జూరం, అత్తి పండ్లు శీతాకాలం లో తినే డ్రై ఫ్రూట్స్‌లో ముఖ్యమైనవి. ఈ రెండిటిలో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం శక్తి స్థాయిని పెంచడంలో సహాయపడతాయి. సాధారణంగా గోరువెచ్చని పాలతో తీసుకుంటే చాలా మంచిది. చలికాలంలో తీవ్రమైన చలి కారణంగా మన చర్మం జుట్టు పొడిబారుతుంది. కావున శరీర పోషణకు నెయ్యి తీసుకోవడం చాలా ముఖ్యం. పోషకాహారాన్ని కాపాడుకోవడానికి మీరు క్రమం తప్పకుండా నెయ్యిని తీసుకోవాలి. చల్లని వాతావరణంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి నెయ్యి పనిచేస్తుంది.

ట్రూకాలర్ తో రైల్వేస్ ఒప్పందం

 


లక్షలాది మంది భారతీయులు ప్రతి రోజూ వినియోగించుకునే ఇంటిగ్రేటెడ్‌ నేషనల్‌ రైల్వేస్‌ హెల్ప్‌లైన్‌ 139 ను ఇప్పుడు ట్రూకాలర్‌ బిజినెస్‌ ఐడెంటిటీ సొల్యూషన్స్‌ ధృవీకరిస్తుంది. ప్రజలు ఇప్పుడు గ్రీన్‌ వెరిఫైడ్‌ బిజినెస్‌ బ్యాడ్జ్‌ లోగోను 139 హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేసినప్పుడవచ్చు. దీనితో పాటుగా ఎస్‌ఎంఎస్‌ సందేశాల హెడర్లు, వినియోగదారులు తమ బుకింగ్స్‌, పర్యటన వివరాలను ఐఆర్‌సీటీసీ నుంచి మాత్రమే అందుకున్నామనే భరోసా అందిస్తాయి. తద్వారా వెరిఫైడ్‌ టిక్‌ మార్క్‌ ఐకాన్‌, ఇండియన్‌ రైల్వేస్‌ బ్రాండ్‌ పేరు, ప్రొఫైల్‌ ఫోటోను ట్రూకలర్‌లో చూడవచ్చు. ఇది వినియోగదారులకు సురక్షిత పాటుగా మోసాలు జరిగేందుకు ఉన్న అవకాశాలను తగ్గిస్తుంది.

ట్రూకాలర్‌తో భాగస్వామ్యం గురించి రజ్నీ హసిజా, ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ - ఐఆర్‌సీటీసీ మాట్లాడుతూ '' ట్రూకాలర్‌తో కలిసి పనిచేస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ భాగస్వామ్యంతో, ఐఆర్‌సీటీసీ యొక్క కమ్యూనికేషన్‌ మాధ్యమాలను వినియోగదారులకు మరింత సురక్షితమైన రీతిలో ట్రూ కాలర్‌ భాగస్వామ్యంతో మార్చడంలో మరో అడుగు ముందుకు వేయడంతో పాటుగా మా వినియోగారుల నడుమ నమ్మకాన్ని వృద్ధి చేయనున్నాం'' అని అన్నారు. విస్తృత శ్రేణి ఉత్పత్తులు, సేవల పరంగా ఐఆర్‌సీటీసీ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్‌ రైల్వే హెల్ప్‌లైన్‌ 139ను నిర్వహిస్తుంది. దీనిని ప్రతి రోజూ లక్షలాది మంది ప్రజలు తమ రోజువారీ ప్రయాణీకుల రైళ్ల సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు వినియోగించుకుంటున్నారు. ఐఆర్‌సీటీసీ 139 ఎంక్వైరీ, హెల్ప్‌లైన్‌ సేవలను 2007లో భారత్‌ బీపీఓ సర్వీసెస్‌ లిమిటెడ్‌ను ఈ ప్రాజెక్ట్‌లో సాంకేతిక భాగస్వామిగా ప్రారంభించింది. ఈ హెల్ప్‌లైన్‌ ప్రతి రోజూ దాదాపు 2 లక్షల కాల్స్‌ను రైళ్ల సంబంధిత రిజర్వేషన్‌, ఆగమనం మరియు డిపార్చర్‌ తో పాటుగా భద్రత, వైద్య, ఇతర ప్రత్యేక అవసరాల కోసం అభ్యర్ధిస్తూ చేస్తున్నారు.

''ట్రూ కాలర్‌ ఫర్‌ బిజినెస్‌ సేవలను ఇప్పటికే వందలాది సంస్థలు వినియోగించుకుంటున్నాయి. మా పరిష్కారాలను అంతర్జాతీయంగా వినియోగించుకోవడం ద్వారా ఆధీకృత సంభాషణలు చేస్తున్నాము. ఐఆర్‌సీటీసీతో ఈ కార్యక్రమం కోసం కలిసి పనిచేయడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఎన్నో పరిష్కారాలలో ఇది మొదటిది. కమ్యూనికేషన్‌ పరంగా నమ్మకం కలిగించేందుకు మేము ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నాము మరియు భారత దేశ డిజిటల్‌ ప్రయాణంలో మద్దతునందించేందుకు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాము'' అని ట్రూ కాలర్‌ ఇండియా ఎండీ రిషిత్‌ ఝుంఝుంవాలా అన్నారు. 2014 నుంచి, ప్రజల అనుభవాలను మెరుగుపరచడంలో గణనీయంగా ఐఆర్‌సీటీసీ వృద్ధి చెందింది. మరీ ముఖ్యంగా టిక్కెట్ల బుకింగ్‌ మరియు సౌకర్యవంతమైన ప్రయాణాల పరంగా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. నూతన డిజిటల్‌ ఇండియా కింద, మరింత మంది ప్రజలు ఇప్పుడు టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు తప్ప రిజర్వేషన్‌ కేంద్రాలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. అందువల్ల ఐఆర్‌సీటీసీ ఇప్పుడు వారికి మరింత మెరుగైన సేవలను అందించడానికి తమ ప్రయత్నాలను మెరుగుపరుచుకుంటూ డెడికేటెడ్‌ యాప్స్‌, సురక్షిత ఈ-బుకింగ్‌ వెబ్‌సైట్‌ అందిస్తుంది.

కొడవటిగంటి కుటుంబరావు

కొడవటిగంటి కుటుంబరావు ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది. కొకు గా చిరపరిచితుడైన ఆయన తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో పది పన్నెండు వేల పేజీలకు మించిన రచనలు చేసారు. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించారు. కొకు గుంటూరు జిల్లా, తెనాలి లోని ఒక మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తెనాలిలో పాఠశాల చదువు 1925 వరకు సాగింది. చిన్నవయసులోనే 1914లో తండ్రీ, 1920లో తల్లీ మరణించడంతో మేనమామ వద్ద పెరిగారు.ఆయన చిన్నతనం గ్రామీణ జీవితంతో పెనవేసుకుపోయింది. కవీ, రచయితా అయిన అన్నయ్య వెంకటసుబ్బయ్య ద్వారా కొకు సాహితీ రంగప్రవేశం జరిగింది. ఆ కాలంలోనే ఆయనకు పాశ్చాత్య సాహిత్య పరిచయమూ ఏర్పడింది. పదమూడేళ్ళ లేత వయసులోనే కొన్ని పద్యాలు, ఒక అసంపూర్ణ థ్రిల్లరు నవలా రాసారు. అయితే కొద్ది కాలంలోనే వాటిని వదిలిపెట్టేసారు.1925లో ఉన్నత విద్య పూర్తికాక మునుపే 11 ఏళ్ళ పద్మావతితో ఆయన పెళ్ళి జరిగింది.1925 నుండి 1927 వరకు గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో ఇంటర్మీడియేటు చదివాక, 1927-29 కాలంలో మహారాజా కళాశాల, విజయనగరంలో బియ్యే ఫిజిక్సు చదివారు.ఈ కాలంలోనే రచనా వ్యాసంగాన్ని సీరియస్సుగా మొదలుపెట్టారు. బియ్యే చివరికి వచ్చేసరికి ఆయన నాస్తికునిగా మారిపోయారు. 1929లో కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి ఫిజిక్సులో చేరారు.1930లో కొకు తొలి రచన సినిమా ఓరియంటల్ వీక్లీలో ప్రచురితమైంది. ఆయన మొదటి కథ ప్రాణాధికం గృహలక్ష్మి మాసపత్రికలో అగ్రస్థానం పొందింది. అంతర్జాతీయంగా అలుముకున్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఎం.ఎస్.సి రెండో సంవత్సరం చదువు ఆగిపోయింది. 1931లో కొంతకాలం పాటు వరంగల్లులో ఉండి పిల్లలకు ప్రైవేట్లు చెప్పారు. చక్రపాణి, పిల్లలమర్రి బాలకృష్ణశాస్త్రి, పిల్లలమర్రి సాంబశివరావులతో కలిసి యువ ప్రెస్‌ను స్థాపించి యువ పత్రికను ప్రారంభించారు. 1939లో భార్య పద్మావతి మరణించింది. 1940 - 42 మధ్య కాలంలో ఆంధ్ర పత్రికలో పనిచేసారు.ఆ కాలంలో జరుక్‌శాస్త్రి (జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి) ఆయనకు సహోద్యోగి. 1942 లో నాలుగు నెలల పాటు ఒక మెటల్ కర్మాగారంలో పనిచేసారు.1942 జూలై నుండి 1943 జనవరి వరకు సిమ్లాలో జాతీయ యుద్ధ ప్రచారక సమితిలో కాపీ రైటరుగా పనిచేసారు.1944లో ఒడిషా జయపూరులో ఇన్స్పెక్టరేట్ ఆఫ్ మెటల్ అండ్ స్టీల్‌లో ఆర్నెల్ల పాటు ఫోర్మనుగా పనిచేసారు. మొదటి భార్య చనిపోయాక రెండవ పెళ్ళి చేసుకొన్నారు. రెండవ పెళ్ళి జరిగిన రెణ్ణెల్లకే భార్య అనారోగ్యంతో మరణించడంతో 1945లో వరూధినిని మూడవ పెళ్ళి చేసుకున్నారు.1948లో మూణ్ణెల్ల పాటు బొంబాయి ఎయిర్ ఇండియా కార్యాలయంలో ఎకౌంట్సు క్లర్కుగా పనిచేసారు.1948లో ఆంధ్రపత్రిక దినపత్రికలో చేరి 1950-51లో వారపత్రిక సంపాదకత్వం నిర్వహించారు. అదే సంవత్సరం కినిమా వారపత్రిక సంపాదకత్వం కూడా నిర్వహించారు.1952, జనవరి 1 నుండి చనిపోయే వరకూ చందమామలో పనిచేసి ఆ పత్రిక అత్యున్నత స్థితికి రావటానికి ఎంతో కృషి సలిపారు. జగత్తులో స్థలము, కాలము అనే రెండు కొలతలు ఉన్నట్టు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.  జగత్తుకు ఈ రెండు కొలతలే కాకుండా బుద్ధి అనేది కొలతగా పనిచేస్తుంది అనే సిద్ధాంతాన్ని బుద్ధికొలత వాదం అనే పేరుతో ఇతడు ప్రతిపాదించారు.ఈ ప్రతిపాదన అనేక చర్చలకు దారితీసింది. సాహిత్యం నుండి ప్రజల్నీ, రాజకీయాల నుండి సాహిత్యాన్నీ, ప్రజల నుండి రాజకీయాలనీ రక్షించే ప్రయత్నాలు చూస్తూంటే నాకు నవ్వొస్తుంది. నియంతల మీదా, నిరుద్యోగమ్మీదా, లాకౌట్ల మీదా, యుద్ధాల మీదా గొంతెత్తేందుకు కళాకారులకు హక్కు లేదు.., అది రాజకీయులకే ఉందనడం మూర్ఖత్వం. అణగదొక్కాలనుకునేవారే ఇలాంటి తలతిక్కవాదం చేస్తారు. ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు; జీవితంలోని కష్టాల్ని తీర్చలేనిది ఆవిష్కరణా కాదు; జీవితంలోని ప్రతీ కోణాన్ని చూపించలేనిది సాహిత్యమే కాదు మారుతున్న కాలానికి అనుగుణంగా సాహిత్యమూ మారాలి … పాతకాలపు సాహిత్య పద్ధతులకే కట్టుబడి ఉండడమంటే మోసం చెయ్యడమే కులం మిథ్య, మతం మిథ్య, ధనమొకటే నిజం (పేదవాడైన అగ్రకులస్తుని కంటే డబ్బున్న దళితునికే ఎక్కువ పేరు ఉంటుంది. ఈ వ్యవస్థని ఉద్దేశించి అన్న వాక్యం.

నిజాయితీగా మాట్లాడే వాడు ఒంటరివాడు...!

 



దీపావళికి జియో కానుక !

 

దీపావళి సందర్భంగా కస్టమర్లకు రిలయన్స్ జియో అద్భుతమైన బహుమతి ఇవ్వబోతుంది. కంపెనీ 4G స్మార్ట్‌ఫోన్ నెక్స్ట్‌ను మార్కెట్లోకి తీసుకుని రాబోతుంది. నవంబర్ 4వ తేదీన ఈ ఫోన్ విడుదల చేయబోతున్నట్లు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ప్రకటించారు. చాలా తక్కువ ధరకు లభించే ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ఎంతోకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.3499గా ఉంటుందని అంచనా వేస్తున్నారు టెక్ నిపుణులు. గూగుల్ భాగస్వామ్యంతో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తుండగా.. ఆండ్రాయిడ్ అనుకూలీకరించిన సాఫ్ట్‌వేర్‌తో ఫోన్ వస్తుంది. ఇందులో గూగుల్ అసిస్టెంట్, కెమెరా ఫిల్టర్‌లతో పాటు ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన జియో యాప్‌లు ఉండనున్నాయి. జూన్​24న జరిగిన కంపెనీ వార్షిక సమావేశంలో ఆర్​ఐఎల్​ ఛైర్మన్ అండ్​ మేనేజింగ్​ డైరెక్టర్​ ముఖేష్​ అంబానీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్​ఫోన్​ను అందించబోతున్నట్లు ప్రకటించారు. మేక్​ ఇన్​ ఇండియా చొరవతో తక్కువ ధరలోనే దీన్ని రూపొందించారు. దేశంలోని 30కోట్ల 2జీ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ చౌక స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి వచ్చిన తర్వాత 4G వినియోగం పెరుగుతుందని భావిస్తున్నారు.

రేషన్ షాపులో గ్యాస్ సిలిండర్ !




ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం లాంటి ఆయిల్ కంపెనీలన్నీ చిన్న సిలిండర్లను కూడా అమ్ముతుంటాయి. కమర్షియల్ సిలిండర్ 19 కిలోలు, డొమెస్టిక్ సిలిండర్ 14.2 కిలోల కెపాసిటీతో వస్తే ఈ చిన్న సిలిండర్లు కేవలం 5 కిలోల కెపాసిటీతో వస్తాయి. అత్యవసరంగా గ్యాస్ సిలిండర్ అవసరం అయినవారికి, బ్యాచిలర్స్‌కు, వలస కూలీలకు ఈ చిన్న సిలిండర్లు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ చిన్న సిలిండర్లను ఇకపై రేషన్ షాపుల్లో అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇండియన్ ఆయిల్ కంపెనీ ఛోటు పేరుతో, హిందుస్తాన్ పెట్రోలియం అప్పు పేరుతో, భారత్ పెట్రోలియం మినీ పేరుతో చిన్న సిలిండర్లను అమ్ముతున్నాయి. ఇవి ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ సిలిండర్లు. వీటిని ఎవరైనా కొనొచ్చు. ఈ చిన్న సిలిండర్లు కొనడానికి అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు. కేవలం ఐడీ ప్రూఫ్ చూపించి ఈ సిలిండర్ తీసుకోవచ్చు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లొచ్చు. ఎక్కడైనా రీఫిల్ చేయొచ్చు. చిన్న సిలిండర్లను రేషన్ షాపుల్లో అమ్మేలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయిల్ కంపెనీలతో సమన్వయం చేస్తోందని ఫుడ్ సెక్రెటరీ సుధాన్షు పాండే తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న రేషన్ షాపులు ఆర్థికంగా పుంజుకోవడానికి తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక భాగమని ఆయన అన్నారు. భారతదేశంలో మొత్తం 5.32 లక్షల రేషన్ షాపులు ఉన్నాయి. ఈ షాపుల ద్వారా 80 కోట్ల మంది లబ్ధిదారులకు సబ్సిడీ ధరలకే ఆహారధాన్యాలను జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారా సరఫరా చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. రేషన్ షాపుల ద్వారా చిన్న సిలిండర్లను అమ్మడంతో పాటు రుణాలు అందించడం లాంటి ఆర్థిక సేవల్ని కూడా ఈ నెట్‌వర్క్ ద్వారా అందించాలని భావిస్తోంది ప్రభుత్వం. రేషన్ షాపుల ఆర్థిక ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి బుధవారం వివిధ రాష్ట్రాల మంత్రులతో జరిగిన సమావేశంలో పలు అంశాలు చర్చించినట్టు సుధాన్షు పాండే తెలిపారు. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖతో పాటు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం ప్రతినిధులు ఆసక్తి చూపిన రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించాయి. రేషన్ షాపుల ద్వారా చిరు వ్యాపారులకు ముద్ర రుణాలు కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నాయి.

బిల్లు చూసి నోరెళ్లబెట్టారు!


ఐర్లాండ్‌కు చెందిన నలుగురు ఫ్రెండ్స్.. గెట్ టు గెదర్ ట్రిప్‌అడ్వైజర్‌ అనే పబ్‌లో టేబుల్ రిజర్వ్ చేసుకున్నారు. పలు ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చారు. నాలుగు గంటల పాటు సరదాగా గడిపారు. ఇక వెళ్ళిపోదామని అనుకున్న వాళ్లు వెయిటర్‌ను బిల్లు తీసుకురమ్మని కోరగా.. వచ్చిన ఆ బిల్‌ను చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. బిల్ సుమారు రూ. 50 వేలు కావడంతో ఆ స్నేహితులు నోరెళ్లబెట్టారు. ఈ చేదు అనుభవాన్ని వాళ్లు ఫేస్‌బుక్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. ”ట్రిప్‌అడ్వైజర్‌ పబ్‌కి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, మీ ప్లాన్‌ను మార్చుకోండి. అక్కడ సర్వీస్‌ అధ్వాన్నంగా ఉంటుంది. అంతేకాకుండా సిబ్బంది తప్పుడు బిల్లులు వేస్తున్నారు. మనం ఆర్డర్ చేయని ఐటెమ్స్‌ను కూడా బిల్‌లో చేరుస్తున్నారు” అని పోస్ట్ చేశారు. వాస్తవానికి మేము పబ్‌కి వెళ్లిన రోజు.. ముందుగానే టేబుల్ బుక్ చేసుకున్నాం. అయితే ఆ పబ్ నిర్వాహకులు మాకు తెలియకుండానే బుకింగ్ రద్దు చేశారు. వారితో సుదీర్ఘ సంభాషణ తర్వాత టేబుల్ ఇచ్చారు. మేము ఆర్డర్ ఇచ్చిన మొదటి ఐటెమ్‌ను కూడా గంట సమయం అనంతరం తీసుకొచ్చారు. అలాగే అక్కడి సిబ్బంది సర్వ్ చేయడంలో చాలా సమయాన్ని వృథా చేశారు. తమ తర్వాత వచ్చిన వారికి ముందు సర్వీసు చేస్తూ తమను వెయిట్ చేయించారు. దీని తర్వాత, బిల్ అడగగా దాన్ని చూసి ఖంగుతిన్నాం. నాలుగు గంటలు గడిపి సాధారణ ఐటెమ్స్ ఆర్డర్ ఇచ్చినందుకు రూ. 50 వేల బిల్లు అందజేశారు. మేము ఆర్డర్ చేయని ఐటెమ్స్ కూడా బిల్‌లో జోడించారు. అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

సూర్యకాంతం

 

సూర్యకాంతం  సినీ నటి. తెలుగు సినిమాల్లో గయ్యాళి పాత్రల్లో తన సహజ నటనతో ప్రాచుర్యం పొందింది. నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పాడు - "నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. 'సూర్యకాంతం' అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు" సూర్యకాంతం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28న తన తల్లితండ్రులకు 14వ సంతానంగా జన్మించింది. ఆరేళ్ళ చిన్న వయసులోనే పాడటం, నాట్యమాడటం నేర్చుకొంది. పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి. సినిమాల్లో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకొంది. మొదట జెమిని స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్ గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూ. జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియబరచిన మీదట 75 రూపాయలు చేశారు. తరువాత ధర్మాంగద (1949)లో ఆమెది మూగవేషం. ధర్మాంగద టైములో చిన్నా చితకా వేషాలువేసినా తరువాత లీలా కుమారి సాయంతో మొదటిసారిగా నారద నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది. మనసులో బొంబాయికి వెళదామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనను విరమించు కొంది. ఆ పరిస్థితిలో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తరువాత తన కల అయిన హీరోయిన్ వేషం సౌదామిని చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. బాగైన తరువాత సంసారం చిత్రంలో మొట్టమొదటి సారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది. తరువాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటించింది. అసలు సంసారం చిత్రం తరువాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాక ముందే ఇంకొక హీరోయిన్ ను పెట్టుకొని తీశేసారని తెలియడంతో, "ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను" అని ఆ సినిమాను నిరాకరించింది. కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. బి.నాగిరెడ్డి, చక్రపాణిలు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు. ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి - సూర్యకాంతం, రమణారెడ్డి - సూర్యకాంతం, ఎస్.వి.రంగారావు - సూర్యకాంతం- జంటలు, వాళ్ల దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవడం కద్దు. కొత్త సినిమా వస్తూంటే అందులో సూర్యకాంతం వుందా? అని ప్రేక్షకులూ, తారాగణంలో సూర్యకాంతం వున్నట్టేగదా? అని సినిమా డిస్ట్రిబ్యూటర్లూ - ఎదురు చూసేవారు. చక్రపాణి (1954), దొంగరాముడు (1955), చిరంజీవులు (1956), తోడికోడళ్లు (1957), అత్తా ఒకింటి కోడలే (1958), ఇల్లరికం (1959), భార్యాభర్తలు (1961), గుండమ్మకథ (1962), కులగోత్రాలు (1962), దాగుడుమూతలు (1964), అత్తగారు-కొత్తకోడలు, మూహూర్తబలం (1969) లాంటి మరపురాని ఎన్నో సినిమాలలో నటించింది. సూర్యకాంతాన్ని హాస్య నటీమణిగా ముద్ర వెయ్యడానికి లేదు. ఆమె ప్రత్యేకంగా హాస్యం చెయ్యకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు, నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం. సహాయ నటి అనే అనాలి. గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. ఓర చూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసుర్తూ కుడిచెయ్యి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణా చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ, అంతలోనే కల్లకబుర్లతో బొల్లిడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు. వ్యక్తిగా సూర్యకాంతం గయ్యాళి కానేకాదు - మామూలు మనిషే. ఏ సమావేశాలకో, సినిమా ఉత్సవాలకో ఆమె వెళ్లినప్పుడు ఆటోగ్రాపుల కోసం వెళ్లే స్త్రీలు సూర్యకాంతం దగ్గరకి వెళ్లడానికి భయపడేవారు. అయితే ఆమె నికార్సయిన మనిషి, కచ్చితమైన మనిషి, సహృదయం గల మనిషి, సహాయపడే మనిషి. ఆమె శుభ్రంగా కడుపునిండా తినేది, పదిమందికీ పెట్టేది. షూటింగ్‌కి వచ్చినప్పుడల్లా  తనతో ఏవో తినుబండారాలు తీసుకురావడం, అందరికీ పెట్టడం అలవాటు. ఇలాంటి అలవాటు సావిత్రి, కృష్ణకుమారి, జానకి వంటి నటీమణులకీ వుండేది. విశేష దినాలూ, పండగపబ్బాలూ వస్తే సరేసరి! షూటింగుల్లో జోకులు చెప్పడం, సూర్యకాంతం సరదాల్లో ఒకటి. ఒక షూటింగులో బయట కేకలు వినిపిస్తున్నాయని ‘సైలెన్స్‌! అవుట్‌సైడ్‌’ అని ప్రొడక్షన్‌ మేనేజర్‌ గట్టిగా అరిచాడు. ఫ్లోర్‌లో వున్న సూర్యకాంతం ‘ఓ!’ అని అంతకన్నా గట్టిగా అరిచింది. ‘ఏమిటమ్మా?’ అని అడిగితే, ‘సైలెన్స్‌ అవుట్‌ సైడ్‌ - అని గదా అన్నారు!’ అందామె నవ్విస్తూ. అలాంటి అల్లరి వుండేది ఆమెలో. ఓ సినిమాలో నాగయ్యను నానామాటలూ అని, నోటికొచ్చిన తిట్లు తిట్టాలి. షాట్‌ అయిపోయాక ఆయన కాళ్లమీద పడి ‘అపరాధం - క్షమించండి!’ అని వేడుకుంది. ‘పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావూ? లే!-’ అని నాగయ్య లేవనెత్తితే, కన్నీళ్లు తుడుచుకున్న భక్తీ, సెంటిమెంటూ ఆమెవి. దబాయింపూ, కచ్చితత్వమూ ఉన్న మనిషే అయినా, మనసు మాత్రం వెన్న, సున్నితం. అవసరమైన వాళ్లకి ఆర్థికసహాయం చేసేదిగాని అనవసరం అనిపిస్తే మాత్రం ‘పూచికపుల్ల’ కూడా విదిలించేది కాదు. మొహమాటపడకుండా తనకి రావాల్సిన పారితోషకాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేది. ఆమె అందర్నీ నమ్మేది కాదు. తన కారు రిపేరుకొస్తే ఎంత పెద్ద రిపేరైనా, మెకానిక్‌ ఇంటికొచ్చి తన కళ్లముందు చెయ్యవలసిందే - ఎంత ‘ఎక్స్‌ట్రా మనీ’ అయినా తీసుకోనీగాక! చివరి దశలో వేషాలు తగ్గిపోయినా, చివరిదాకా నటిస్తూ ఉండాలనే కోరుకునేది. తన ఆరోగ్యం బాగులేకపోయినా, ‘నటిస్తాను’ అని ధైర్యంగా చెప్పేది.

Wednesday, October 27, 2021

క్రిప్టో మార్కెట్లో అగ్రగామి కాయిన్స్విచ్ కుబేర్ క్రిప్టో

 

భారతదేశంలో అత్యంత పెద్ద అలాగే విలువైన క్రిప్టో ప్లాట్‌ఫారం కాయిన్‌స్విచ్ కుబేర్ భాకరతీయులకు ఆర్థిక సౌఖ్యం, సమానంగా నగదు సంపాదించేందుకు మద్ధతు ఇచ్చే నిరంతర ప్రయత్నాల్లో బాలీవుడ్ సూపర్‌స్టార్ రణవీర్ సింగ్‌తో కలిసి కొత్త వాణిజ్య ప్రకటనను విడుదల చేసింది. ఇటీవలి వాణిజ్య ప్రకటనలో కాయిన్‌స్విచ్ కుబేర్‌ ఆవిష్కారాత్మక ఆఫర్ వినియోగదారులకు క్రిప్టోలో పెట్టుబడులను కేవలం రూ.100తో ప్రారంభించేందుకు సాధ్యమయ్యేలా చేసింది. కుచ్‌తోబద్లేగా  ఈ వాణిజ్య ప్రకటనలో భాగంగా, కాయిన్ స్విచ్ కుబేర్ కొత్త 360-డిగ్రీ వాణిజ్య ప్రకటన వివిధ ఆన్‌లైన్ మరియు డిజిటల్ ప్లాట్‌ఫారాల్లో టెలివిజన్, ముద్రణ, ఓటీటీ ప్లాట్‌ఫారం డిస్నీ+హాట్‌స్టార్‌లలో ప్రసారమవుతుంది.కాయిన్‌స్విచ్ కుబేర్  పోర్టల్ సరళమైన, వినియోగదారుల-స్నేహి ఇంటర్‌ఫేస్ వినియోగదారులకు బిట్‌కాయిన్, ప్రజాదరణ పొందిన క్రిప్టో కరెన్సీ తరహాలో పెట్టుబడి చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. క్రిప్టో యూనికార్న్ చెయిన్ అనాలసిస్‌తో పని చేస్తుండగా, అన్ని క్రిప్టో లావాదేవీలను ఎటువంటి తరహా భద్రత ఉల్లంఘనల నుంచి అలాగే ఆర్థిక అక్రమాల నుంచి స్వచ్ఛంగా అలాగే సురక్షితంగా ఉంచుతుంది. ఇతర క్రిప్టో కరెన్సీ ఎక్ఛేంజ్‌ల తరహాలోనే కాకుండా, కాయిన్‌స్విచ్ కుబేర్ భారతదేశంలోని అగ్రగామి క్రిప్టో ఎక్ఛేంజ్‌లతో నగదుగా మార్చుకునేందుకు, ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు అత్యుత్తమ ధరల్లో లావాదేవీలను నిర్వహించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. కాయిన్‌స్విచ్ కుబేర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శరణ్ నాయర్ మాట్లాడుతూ, ''వినియోగదారులకు కొనుగోలు దశలో లోతైన వివరాలను అందించేందుకు శ్రమిస్తుండగా, వారికి సమాచారయుక్తమైన నిర్ణయాలను తీసుకునేందుకు మద్ధతు ఇచ్చే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము. క్రిప్టో కరెన్సీల గురించి జాగృతిని వృద్ధి చేసే మా నిరంతర ప్రయత్నంలో భాగంగా మేము బాలీవుడ్ సూపర్‌స్టార్ అలాగే అల్టిమేట్ యూత్ ఐకాన్ రణ్‌వీర్ సింగ్‌ భాగస్వామ్యానికి చాలా సంతోషిస్తున్నాము. మా 60%కు పైగా వినియోగదారులు టైయర్ 2-3 నగరాల్లో ఉన్నారు. వారిలో సగం మంది 28 ఏళ్ల కన్నా తక్కువ వయసు వారు ఉన్నారు. రణవీర్ తన సాటిలేని శక్తి, ఆకాంక్ష, విశ్వసనీయత మనకు క్రిప్టో విప్లవం గురించి ఎక్కువ మంది భారతీయులు క్రియాశీలకంగా ఉంచేందుకు, సమాచారాన్ని అందించేందుకు, ఉత్సుకత కలిగించేందుకు మద్ధతు ఇస్తారు'' అని వివరించారు. కాయిన్‌స్విచ్ కుబేర్ సెప్టెంబరు 2021లో కాయిన్ బేస్ వెంచర్స్, ఆండ్రిసెన్ హోరోబవిట్జ్ (ఎ16జడ్) నుంచి సిరీస్ సి ఫండింగ్‌లో 0 మిలియన్ డాలర్ల పెట్టుబడి సేకరించగా, భారతదేశంలో అత్యంత విలువైన యూనికార్న్‌గా గుర్తింపు దక్కించుకోగా, .9 బిలియన్ డాలర్ విలువ కలిగి ఉంది. ఇప్పుడు తన వృద్ధి చెందుతున్న వినియోగదారులకు విస్తృత స్థాయిలో పెట్టుబడి ఎంపికలను అందించాలని ప్రణాళికలు రూపొందించింది.

పెట్రోల్‌ రూ.120 దాటేసింది...!


మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌ జిల్లా కేంద్రంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.120.4కు చేరగా.. డీజిల్‌ ధర రూ.110ని దాటేసింది. మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన బాలాఘాట్‌లోనూ లీటరు పెట్రోల్‌ రూ. 119.23గా ఉంటే.. రాజధాని భోపాల్‌లో రూ.116.62కు పెరిగింది. ఇవాళ పెట్రోల్‌పై 36పైసలు పెరగడంతో లీటరు పెట్రోల్‌ ధర రూ.120 మార్కును దాటినట్లు అధికారులు చెబుతున్నారు. డీజిల్‌పై 37 పైసలు పెరగడంతో రూ.109.17కి చేరింది.

Popular Posts