Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Monday, February 28, 2022

స్మార్ట్‌ఫోన్‌లో మీ వెహికిల్ స్పీడ్ తెలుసుకోవచ్చు!

 

గూగుల్ మ్యాప్స్‌ను అందరూ తమకు కావాల్సిన ప్రాంతాలు, అడ్రస్‌ల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. గూగుల్ మ్యాప్స్ స్పీడోమీటర్‌లా పనిచేస్తుందన్న విషయం చాలామందికి తెలియదు. వాహనం నడిపేవారు స్పీడ్ పెంచితే వెంటనే గూగుల్ అలర్ట్ చేస్తుంది. మీరు స్పీడ్ మిలిట్ దాటినట్టైతే గూగుల్ మ్యాప్స్ స్పీడోమీటర్ కలర్ కూడా మారుతుంది. గూగుల్ మ్యాప్స్‌లో స్పీడోమీటర్ ఫీచర్ ఆన్ చేస్తే స్మార్ట్‌ఫోన్‌లో స్పీడోమీటర్ గుర్తు కనిపిస్తుంది. అందులో గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో వాహనం వెళ్తుందో తెలుసుకోవచ్చ. గూగుల్ మ్యాప్స్ తొలిసారిగా 2019 లో ఆన్ స్క్రీన్ స్పీడోమీటర్ ఫీచర్‌ను రిలీజ్ చేసింది. మొదట ఆసియా, యూరప్, యూకే లాంటి దేశాల్లో రిలీజైన ఈ ఫీచర్... ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. మీరు కూడా గూగుల్‌లో స్పీడోమీటర్ ఫీచర్‌ను ఎలా ఆన్ చేయడానికి ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ యాప్‌ను అప్‌డేట్ చేయండి. ఆ తర్వాత గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి. గూగుల్ మ్యాప్స్‌లో టాప్ రైట్ కార్నర్‌లో మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత navigation settings ఓపెన్ చేయండి. Driving Options లో స్పీడోమీటర్ ఆప్షన్ ఉంటుంది. స్పీడోమీటర్ ఎనేబుల్ చేయండి. ఇక మీరు ఎక్కడికైనా వెళ్లేప్పుడు ఈ ఫీచర్ వాడుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్లాలో మ్యాప్‌లో సెర్చ్ చేయాలి. ఆ తర్వాత మ్యాప్‌లో Start ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. గూగుల్ మ్యాప్స్ డైరెక్షన్స్ వివరిస్తుంది. మ్యాప్‌లోనే స్పీడోమీటర్ కనిపిస్తుంది. బైక్‌పై, కారులో వెళ్లేప్పుడు ఈ ఫీచర్ వాడుకోవచ్చు. మీరు బండి నడిపే సమయంలోనే కాదు... ఇతరుల వాహనాల్లో వెళ్తున్నప్పుడు కూడా ఆ బండి ఎంత స్పీడ్‌లో ఉందో తెలుసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. అయితే గూగుల్ మ్యాప్స్‌లోని స్పీడోమీటర్ ఫీచర్ చూపించే స్పీడ్ ఒక్కోసారి సరైనది కాకపోవచ్చు. స్పీడ్ ఎంత ఉందో ఓ అంచనాకు రావడానికి మాత్రమే ఈ ఫీచర్ ఉపయోగించుకోవాలి. ఇందులో కనిపించే స్పీడ్ 100 శాతం సరైనదిగా భావించకూడదు.

భారత్ లో "స్లావియా" కారును విడుదల చేసిన స్కోడా


జర్మనీకి చెందిన వోక్స్ వ్యాగన్ తమ సబ్సిడీ సంస్థైన స్కోడా నుంచి మరో కొత్త కారును భారత విఫణిలోకి విడుదల చేసింది. స్కోడా స్లావియా పేరుతో ఈ కారు ఇండియన్ మార్కెట్లోకి విడుదలైనట్లు సంస్థ తెలిపింది. సెడాన్ మోడల్ గా వస్తున్న ఈ కారు హోండా సిటీ, హ్యుండయ్ వెర్నా, సుజుకి సియాజ్ వంటి కార్లకు గట్టిపోటీ ఇస్తుందని సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే “కుషాక్” ఎస్యూవీ అమ్మకాలతో జోరుమీదున్న స్కోడా.. ఇప్పుడు సెడాన్ సెగ్మెంట్ లోనూ దృష్టిపెట్టింది. ఇండియాలో రూ.10.69 లక్షల ప్రారంభ ధరగా వస్తున్న ఈ కారులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. స్లావియా ఇంజిన్ విషయానికి వస్తే..ఇండియాలో రెండు పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లలో ఈ స్లావియా లభిస్తుంది. 1.0 లీటర్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుందని కంపెనీ తెలిపింది. వీటిలో మొదటగా 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ విషయానికొస్తే.. 3-సిలిండర్ TSI ఇంజిన్, 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ సిస్టంతో వస్తుంది. 114bhp మరియు 175Nm టార్క్ కలిగి ఉంది ఈ ఇంజిన్. ఇక 1.5 లీటర్ టర్బో పెట్రోల్ విషయానికొస్తే.. 4 – సిలిండర్ TSI ఇంజిన్, 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్ సిస్టంతో వస్తుంది. ఈ ఇంజిన్ 148bhp మరియు 250Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు లోపలి భాగంలో Apple CarPlay, Android Auto మరియు MirrorLink కనెక్టివిటీతో కూడిన 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, 2-స్పోక్ స్టీరింగ్ వీల్, యాంబియంట్ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్, మరియు వెనుక AC వెంట్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. కారు బయట ఫీచర్స్ ను పరిశీలిస్తే ముందు భాగాన బ్లాక్- క్రోమ్ సిగ్నేచర్ బటర్‌ఫ్లై గ్రిల్, L-ఆకారపు LED DRLలు, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ లైట్లు, నలుపు పూత పూసిన B, C-పిల్లర్లు, 16-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక LED టెయిల్ లైట్లు, క్రోమ్ స్ట్రిప్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. స్లావియా 1.0 TSI యాక్టివ్ MT: రూ. 10.69 లక్షలు, 1.0 TSI యాంబిషన్ MT: రూ. 12.39 లక్షలు, 1.0 TSI యాంబిషన్ AT: రూ. 13.59 లక్షలు, 1.0 TSI స్టైల్ MT (నాన్-సన్‌రూఫ్): రూ 13.59 లక్షలు, 1.0 TSI స్టైల్ MT: రూ. 13.99 లక్షలు, 1.0 TSI స్టైల్ AT: రూ. 15.39 లక్షలు.


షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీపై రూ.7,000 తగ్గింపు!


అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ ఇంకొన్ని గంటల్లో ముగుస్తుంది. షావోమీ గతేడాది రిలీజ్ చేసిన షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీగా డిస్కౌంట్ లభిస్తోంది. ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్స్‌తో కలిపి ఏకంగా రూ.7,000 వరకు తగ్గింపు పొందొచ్చు. షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.25,000 లోపు సెగ్మెంట్లో రిలీజైంది. ఇప్పుడు రూ.20,000 లోపే కొనొచ్చు. ధర చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.5,000 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్ కూడా కలిపి రూ.7,000 డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను రూ.19,999 ధరకే కొనొచ్చు. బ్యాంక్ ఆఫర్స్ చూస్తే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై రూ.3,500, కొటక్ బ్యాంక్ కార్డులపై రూ.4,500, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో కొంటే 10 శాతం, స్టాండర్డ్ ఛార్టర్డ్ క్రెడిట్ కార్డుపై 7.5 శాతం, హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డుపై 7.5 శాతం, హెచ్ఎస్‌బీసీ క్యాష్‌బ్యాక్ కార్డుపై 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసేవారికి రూ.20,250 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసేవారికి రూ.20,250 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ వర్తిస్తే కేవలం రూ.6,749 చెల్లించి షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఎక్స్‌ఛేంజ్ వ్యాల్యూ అంతకన్నా తక్కువ వస్తే కస్టమర్లు మిగతా మొత్తాన్ని చెల్లించాలి. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఇటీవల పాపులర్ అయిన ప్రాసెసర్. ఇదే ప్రాసెసర్ సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ, రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్, ఐకూ జెడ్5 5జీ, మోటోరోలా ఎడ్జ్ 20 స్మార్ట్‌ఫోన్లలో కూడా ఉంది. 

ప్రీపెయిడ్ ప్లాన్‌ల రీఛార్జ్‌పై సెల్ఫ్‌కేర్ యాప్ ఆఫర్ !


భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ప్రైవేట్ టెల్కోల కంటే తక్కువ ధరకే ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందించడమే కాకుండా తన మొబైల్ యాప్ - సెల్ఫ్‌కేర్ ద్వారా రీఛార్జ్ చేసుకునే కస్టమర్ల కోసం ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరల మీద తగ్గింపును కూడా అందిస్తోంది. కొన్ని నెలల క్రితం సెల్ఫ్‌కేర్ మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఇది చూడడానికి వోడాఫోన్ ఐడియా (Vi) మొబైల్ యాప్‌లా కనిపిస్తుంది. సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు ప్రీపెయిడ్ ప్లాన్‌లపై 4% తగ్గింపును పొందవచ్చు అని టెల్కో తెలిపింది. అయితే ఈ తగ్గింపు ఆఫర్ మార్చి 31, 2022 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఈ తగ్గింపు రీఛార్జ్ ఆఫర్ రూ.201 మరియు అంతకంటే ఎక్కువ విలువ కలిగిన ప్లాన్‌లపై మాత్రమే వర్తిస్తుంది. రీఛార్జ్ డిస్కౌంట్ ఆఫర్ అనేది కేవలం సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. గూగుల్ పే, ఫోన్ పే వంటి మరిన్నింటి థర్డ్-పార్టీ మొబైల్ యాప్‌ల ద్వారా రీఛార్జ్‌లు చేసుకుంటున్న వ్యక్తులకు ఈ డిస్కౌంట్ ఆఫర్ అందించబడదు. వెబ్‌సైట్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉన్న ప్రతి ప్లాన్ సెల్ఫ్‌కేర్ యాప్‌లో అందుబాటులో ఉంటుంది.

యాడ్స్ లేకుండా ప్లే పాస్ !


స్మార్ట్‌ఫోన్ కొన్నారంటే రకరకాల యాప్స్ ట్రై చేయడం యూజర్లకు అలవాటు. ప్రతీ అవసరానికి ఓ యాప్ డౌన్‌లోడ్ చేస్తూ ఉంటారు. గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు థర్డ్ పార్టీ స్టోర్స్‌లో కూడా యాప్స్ ఉంటాయి. అయితే థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించడం రిస్కే. అందుకే గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్స్ ఇన్‌స్టాల్ చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. గూగుల్ ప్లే స్టోర్‌లో వేలాది యాప్స్ ఉంటాయి. చాలావరకు యాప్స్‌లో యాడ్స్ ఉంటాయి. యాప్ ఇన్‌స్టాల్ చేసేప్పుడు Contains Ads అనే సమాచారం కనిపిస్తుంది. ఈ యాడ్స్ వద్దనుకుంటే ప్రీమియం వర్షన్ కొనాల్సి ఉంటుంది. ప్రీమియం వర్షన్ సబ్‌స్క్రైబ్ చేసిన వారికి యాడ్స్ ఉండవు. ఎక్కువ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గూగుల్ ప్లేస్టోర్‌లో ప్లే పాస్ సెక్షన్ లాంఛ్ చేసింది. ఇందులో 1,000 పైగా గేమ్స్, యాప్స్ అడ్వర్టైజ్‌మెంట్ లేకుండా అందుబాటులో ఉంటాయి. ప్రీమియం ఫీచర్స్ కూడా వాడుకోవచ్చు. ఇందుకోసం ప్రతీ నెలా లేదా ఏడాదికోసారి ఛార్జీలు చెల్లించాలి. ప్లే పాస్ కలెక్షన్‌లో స్పోర్ట్స్, పజిల్స్, Jungle Adventures, World Cricket Battle 2, Monument Valley లాంటి యాక్షన్ గేమ్స్ లాంటి యాప్స్ ఉన్నాయి. వీటితో పాటు Utter, Unit Converter, AudioLab, Photo Studio Pro లాంటి యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇండియాతో పాటు 59 దేశాలకు చెందిన డెవలపర్స్ రూపొందించిన 1,000 పైగా యాప్స్‌ని ప్లే పాస్ ఆఫర్ చేస్తుంది. ప్లే పాస్ వన్ మంత్ ట్రయల్ ఆఫర్ ఉంది. నెలకు రూ.99 చెల్లించాలి. లేదా ఏడాదికి రూ.889 ధరకు యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. లేదా నెలకు రూ.109 ప్రీపెయిడ్ వన్ మంత్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది. గూగుల్ ఫ్యామిలీ యాప్‌లో రిజిస్టర్ అయినవారు ప్లే పాస్ సబ్‌స్క్రిప్షన్‌ను ఐదుగురితో షేర్ చేసుకోవచ్చు. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లాంటి సబ్‌స్క్రిప్షన్స్ తీసుకొని సినిమాలు, షోస్ యాడ్స్ లేకుండా చూసే అవకాశం ఉన్నట్టు, గూగుల్ ప్లే స్టోర్‌లో ప్లే పాస్ తీసుకొని 1,000 పైగా యాప్స్‌ని యాడ్స్ లేకుండా ఉపయోగించుకోవచ్చు. యాప్స్‌లో వచ్చే యాడ్స్‌తో ఇబ్బందిపడేవారికి ఈ సబ్‌స్క్రిప్షన్ ఉపయోగపడుతుంది. ప్లే పాస్ ఫీచర్ దేశమంతా యూజర్లకు అందుబాటులోకి రానుంది. రకరకాల యాప్స్, గేమ్స్ రూపొందించే ఇండియన్ డెవలపర్స్‌కు ప్లే పాస్ ద్వారా ఆదాయం పెంచుకునే అవకాశం ఉంటుందని, తమ యూజర్ బేస్‌ను ప్రపంచ దేశాలకు విస్తరించుకోవచ్చని గూగుల్ ఇండియా తెలిపింది.

Sunday, February 27, 2022

జూన్ నాటికి సిట్రోయెన్ సి3 లాంచ్ ?


సిట్రోయెన్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో మరో కొత్త SUV కార్ ని విడుదల చేయనుంది. ఈ SUV 'సిట్రోయెన్ సి3'. ఇప్పటికే కంపెనీ తన సి5 మోడల్ అమ్ముతుంది. కంపెనీ త్వరలోనే సి3 అనే చిన్న SUV కార్ ని తీసుకురానుంది. ఇది కంపెనీ నుంచి ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనున్న రెండవ మోడల్. ఇది 2022 జూన్ నాటికి ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.ఇక త్వరలో రానున్న కొత్త సిట్రోయెన్ సి3 SUV కంపెనీ స్టాండర్డ్ మాడ్యులర్ అనేది ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ఈ SUV కార్ స్పాట్ టెస్ట్ లో చాలాసార్లు కనిపించడం జరిగింది. సిట్రోయెన్ సి3 SUV కార్ ని కంపెనీ 'మేడ్ ఇన్ ఇండియా ఫర్ ఇండియన్స్'గా అభివర్ణించడం జరిగింది. కాబట్టి ఇది భారతదేశంలోనే ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.ఇండియాలోని కాంపాక్ట్ SUV సెగ్మెంట్ లో బలమైన ప్రత్యర్థులు ఉండటం వల్ల రానున్న ఈ సి3 SUV గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది మిగిలిన ప్రత్యర్థులకంటే కూడా చాలా ప్రత్యేకంగా ఇంకా అలాగే కొంత భిన్నంగా ఉండాలి. కాబట్టి ఈ సిట్రోయెన్ సి3 SUV 78 విభిన్న యాక్ససరీస్ తో ఇంకా అలాగే అనేకరకాల కస్టమైజేషన్ ఆప్సన్స్ తో రానుంది.కేవలం అది మాత్రమే కాకుండా.. ఈ సబ్-4మీ SUV 4 కార్ విభిన్న ఎక్స్టీరియర్ కలర్ ఆప్సన్స్ పొందటమే కాకుండా ఇంకా అలాగే రెండు వేర్వేరు రూఫ్ కలర్ ఆప్షన్‌లతో కూడా అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఇది చూడటానికి ఎంతగానో ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే చూపరులను ఒక్క సారికే కట్టిపడేస్తుంది.అలాగే ఇందులోని ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ సిస్టమ్‌ అనేది ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఇంకా అలాగే నావిగేషన్ వంటి విభిన్న ఫీచర్స్ అందిస్తుంది. అంతే కాకూండా, సి3 SU లో 1-లీటర్ గ్లోవ్ బాక్స్, ముందు ఇంకా వెనుక రెండు 2-లీటర్ డోర్ పాకెట్‌లు ఉన్నాయి. దీనితో పాటు, సెంట్రల్ కన్సోల్‌లో స్టోరేజ్ ఇంకా అలాగే స్మార్ట్‌ఫోన్ హోల్డర్‌గా పనిచేసే వెనుక భాగంలో రెండు కప్పు హోల్డర్లు అనేవి ఇవ్వబడ్డాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు డ్రైవింగ్ టైంలో ఎంతగానో అనుకూలంగా ఉంటాయి.

6G టెక్నాలజీ అమలు వ్యూహంపై చర్చలు!


జాతీయ టెలికాం స్టాండర్డ్స్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ గా డిపార్ట్‌మెంట్ గుర్తించిన లాభాపేక్ష లేని పరిశ్రమతో కూడిన TSDSI గత సంవత్సరం 6G టెక్నాలజీలను ప్రారంభించే బాధ్యత కలిగిన ITU ఫోరమ్‌కు విజన్ డాక్యుమెంట్ మరియు సూచనలను సమర్పించింది . TSDSIలో వైస్ ఛైర్మన్ మరియు Jio ప్రమాణాలకు అధిపతి అయిన సతీష్ జమదగ్ని తెలిపిన ఒక ప్రకటన ప్రకారం TSDSI వర్కింగ్ గ్రూప్‌లలో 6G ఎనేబుల్ గురించి చర్చిస్తోంది. 6Gని ప్రారంభించడం మరియు అది ఎలా ఉండాలనే దానిపై దేశం యొక్క పూర్తి దృష్టిని ITU పత్రాలలో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ లేదా IMT-2030 అవసరాలలో భాగంగా 2022 జూలై నాటికి ITU తన అభిప్రాయాల ఆధారంగా తీర్పును ఇవ్వబోతోందని ఆయన తెలియజేశారు. మరోవైపు జెనీవా ఆధారిత యూనియన్ 6Gపై చర్చించడానికి 2030ని లక్ష్యంగా చేసుకుంది. ఆ తర్వాత 3GPP లేదా మూడవ తరం భాగస్వామ్య ప్రాజెక్ట్ ప్రమాణాలను రూపొందించడంలో పని చేయవచ్చు. భారతదేశ ప్రమాణాల సంస్థ TSDSI 2020 ప్రారంభం నుండి 6G గురించి చర్చించడం ప్రారంభించింది. గ్లోబల్ స్టాండర్డ్ బాడీలతో సామరస్యంగా ఉంటూనే 6Gని ఎనేబుల్ చేయడానికి అవసరమైన సాంకేతికతలకు మద్దతు ఇవ్వడానికి భారతదేశంలోనే జరుగుతున్న పరిశోధనలతో కూడిన సమగ్ర వ్యూహాన్ని ప్లాన్ చేసింది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు, టెక్నాలజీ విక్రేతలు మరియు చిప్‌సెట్ తయారీదారుల మద్దతుతో TSDSI దేశంలోని డిజిటల్ విభజనను తగ్గించడంలో సహాయపడే తదుపరి తరం టెక్నాలజీను ప్రారంభించడంతోపాటు సర్వత్రా మొబైల్ కనెక్ట్ చేయబడిన సమాజాన్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D) కోసం మరియు సాంకేతికత కోసం కూడా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి అంకితం చేయబడిన 6G టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్‌ను ఇటీవల రూపొందించింది. ఈ ఇన్నోవేషన్ గ్రూప్ భారతదేశంలో అభివృద్ధిలో ఉన్న మరియు 6Gలో భాగమయ్యే సాంకేతికతలను గుర్తించడానికి వాటాదారులు మరియు భాగస్వాముల కోసం DoT అడుగుతోంది.

అంగారకుడిపై పువ్వులా కనిపించే రాయి!


నాసా శాస్త్రవేత్తలు కూడా దీనిని చూసి ఆశ్చర్యపోతున్నారు. అంగారకుడిపై పువ్వులా కనిపించే చిత్రాలలో అలాంటి రాయి కనిపించింది. మొదటి శాస్త్రవేత్తలు దీనిని పువ్వుగా భావించారు. కాని పరిశోధనలో అది పువ్వు ఆకారంలో ఉన్న రాయి అని తేలింది. ఈ చిత్రాన్ని నాసా క్యూరియాసిటీ రోవర్  కెమెరాలో బంధించింది. ఇది చాలా ఆసక్తికరమైన రీతిలో నిర్మించబడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనిపై శాస్త్రవేత్తలు చర్చించుకుంటున్నారు. యూనివర్స్ టుడే నివేదిక ప్రకారం.. అనేక రకాల ఖనిజాలను కలిపి ఈ ప్రత్యేక రకం పుష్పం ఏర్పడింది. ఈ పువ్వులో రాతికి చెందిన వివిధ రేకులు బయటకు రావడం చూడవచ్చు. వివిధ ఖనిజాలను కలపడం ద్వారా ఆకారాన్ని పొందే దానిని డయాజెనెటిక్ క్రిస్టల్ క్లస్టర్స్ అంటారు. క్యూరియాసిటీ మిషన్ డిప్యూటీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ అబిగైల్ ప్రేమన్ చేసిన ట్వీట్ ప్రకారం ఖనిజంలోని వివిధ కణాలు పెద్ద రాయిపై కలిసినప్పుడు ఇది జరుగుతుంది. అక్కడ మారుతున్న గాలి దిశ, వేగం కారణంగా వాటి ఆకారం కూడా మారుతుంది. శాస్త్రవేత్తలు దీనికి బ్లాక్‌థార్న్ సాల్ట్ అని పేరు పెట్టారు. క్యూరియాసిటీ రోవర్‌లో అమర్చిన మార్స్‌ హ్యాండ్‌ లెన్స్‌ ఇమేజర్‌ సాయంతో నాసా శాస్త్రవేత్తలు ఈ పువ్వులాంటి రాయిని గత వారం చూశారు. 

గెలాక్సీ ఎస్22 సిరీస్‌ల లక్ష ప్రీ-బుకింగ్‌లు


ఇండియాలో Galaxy S22 సిరీస్ ప్రీ-బుకింగ్‌లు ఫిబ్రవరి 23న ప్రారంభమైయి, ఇప్పటివరకు లక్ష ప్రీ-బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ తెలిపింది. “Galaxy S22 సిరీస్‌కి కస్టమర్‌ల నుండి ఇంత అద్భుతమైన స్పందన లభించినందుకు మేము నిజంగా సంతోషిస్తున్నాము” అని శామ్‌సంగ్ ఇండియా సీనియర్ డైరెక్టర్, ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆదిత్య బబ్బర్ ఒక ప్రకటనలో తెలిపారు. కస్టమర్‌లకు స్మార్ట్ ఫోన్‌ను వీలైనంత త్వరగా అందించేందుకు దృఢంగా కట్టుబడి ఉన్నామని బబ్బర్ తెలిపారు. Galaxy S22 Ultraని ప్రీ-బుకింగ్ చేసే కస్టమర్‌లు రూ.26,999 విలువైన Galaxy Watch4ని కేవలం రూ.2,999కే పొందవచ్చు. Galaxy S22+, Galaxy S22 ప్రీ-బుకింగ్ కస్టమర్‌లు రూ. 11,999 విలువైన Galaxy Buds 2 రూ. 999 కి పొందుతారు. Galaxy S22 Ultra, Galaxy S22+, Galaxy S22ని రిటైల్ అవుట్‌లెట్‌లు, Samsung ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లు, Samsung ఆన్‌లైన్ స్టోర్, Amazon.inలో ఫిబ్రవరి 23 నుండి మార్చి 10 వరకు ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. Galaxy S22 సిరీస్ మార్చి 11 నుంచి అమ్మకానికి ఉంటుంది. Samsung Galaxy S22.. 8GB RAM+256GB స్టోరేజ్ ధర రూ.72,999. 8GB+256GB మోడల్ ధర రూ.76,999. Galaxy S22+.. 8GB+128GB మోడల్‌కు రూ. 84,999. 8GB+256GB రూ. 88,999. Samsung Galaxy S22 Ultra 12GB+256GB రూ. 1,09,999. టాప్-ఆఫ్-ది-లైన్ 12GB+512GB మోడల్ ధర రూ.1,18,999.

శాంసంగ్ గెలాక్సీ A03 భారత్ లో విడుదల


శాంసంగ్ బడ్జెట్ శ్రేణి స్మార్ట్ ఫోన్ లలో భాగంగా కొత్త “గెలాక్సీ A03” స్మార్ట్ ఫోన్ ను భారత్ మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటివరకు బడ్జెట్ కంటే ఎక్కువ ధర ఉన్న ఫోన్ లనే మార్కెట్ చేసుకోవాలని భావించిన శాంసంగ్ ఆ విభాగంలో చైనా సంస్థల పోటీ తట్టుకోలేకపోయింది. ఇక శాంసంగ్ లో హైఎండ్ ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకున్నా ధరను చూసి వెనకడుగు వేస్తున్నారు. 6.5-అంగుళాల TFT డిస్‌ప్లే HD+ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ అద్భుతంగా ఉంటుంది. 3GB RAM + 32GB మరియు 4GB RAM + 64GB మెమరీ స్టోరేజి ఆప్షన్స్ తో వస్తుంది. Unisoc T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 11 ఆధారిత One UI 3.1ఓఎస్ తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ Galaxy A03లో వెనుక భాగంలో 48MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 5,000mAh బ్యాటరీ సుమారు రెండు రోజుల పాటు ఛార్జింగ్ ఇస్తుందని సంస్థ పేర్కొంది. ఈ “గెలాక్సీ A03” స్మార్ట్ ఫోన్లో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v4.2, USB టైప్-C పోర్ట్, A-GPS వంటి అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. బ్లాక్, బ్లూ, రెడ్ కలర్స్ లో లభించే ఈ ఫోన్ వినియోగదారులను తప్పకుండ ఆకట్టుకుంటుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ధర విషయానికొస్తే..3GB RAM + 32GB వేరియంట్ ధర రూ.10,499గానూ, 4GB RAM + 64GB వేరియంట్ ధర రూ.11,999గానూ నిర్ణయించారు. ఇండియాలో శాంసంగ్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లతో పాటు ప్రముఖ మొబైల్ షాపులు, ఈ-కామర్స్ సైట్లలలోనూ ఈ కొత్త “గెలాక్సీ A03” స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది.

Saturday, February 26, 2022

ఎన్ఎఫ్‌టీ వెండింగ్ మెషిన్ ఏర్పాటు ?



అమెరికాలోని న్యూయార్క్ సిటీలో నియాన్ అనే క్రిప్టో స్టార్టప్ కంపెనీ ఎన్ఎఫ్‌టీ వెండింగ్ మెషన్‌ను ప్రారంభించింది. సాధారణంగా వెండింగ్ మెషిన్‌లు ఏవైనా స్నాక్స్ కోసం, కాఫీ, టీలు, కూల్‌డ్రింక్స్ కోసం ఏర్పాటు చేస్తారు. ఎన్ఎఫ్‌టీలు అంటే తెలుసు కదా. కానీ ఓపెన్‌సీ, బియాండ్‌లైఫ్‌.క్లబ్ అనే ప్లాట్‌ఫామ్స్ ద్వారా డిజిటల్ అసెట్‌ను కొనుగోలు, అమ్మకాలు చేయొచ్చు. క్రిప్టోకరెన్సీలాగానే, ఎన్ఎఫ్‌టీ కూడా ఒక డిజిటల్ ఆస్తి. అయితే ఎన్ఎఫ్‌టీలను వెబ్‌సైట్లలో ఇప్పటి దాకా కొనుగోలు చేశాం కానీఇలా వెండింగ్ మెషిన్ ద్వారా కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి. సాధారణంగా ఎన్ఎఫ్‌టీలను క్రిప్టోకరెన్సీల ద్వారానే కొనుగోలు చేయాలి. కానీ.. ఈ వెండింగ్ మెషిన్‌లో ఫియట్ కరెన్సీ, క్రెడిట్ కార్డ్స్‌, డెబిట్ కార్డ్స్ ఉపయోగించి కొనుగోలు చేయొచ్చు. ఈ ఎన్ఎఫ్‌టీ వెండింగ్ మెషిన్‌ను సొలానా బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా డెవలప్ చేశారు. ఈ వెండింగ్ మెషిన్‌లో డిజిటల్ ఆర్ట్స్ ఎక్కువగా ఉంటాయి. వాటిని ఈ మెషిన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. తిరిగి అమ్ముకోవచ్చు కూడా.

అమెజాన్ మెగా మ్యూజిక్ ఫెస్ట్


మెగా మ్యూజిక్ ఫెస్ట్, ఎలక్ట్రానిక్స్ డేస్ అనే రెండు న్యూ సేల్స్ తీసుకొచ్చిన అమెజాన్ హెడ్‌ఫోన్‌లు, స్పీకర్లు తదితర గ్యాడ్జెట్‌లపై డీల్స్, ఆఫర్లను ప్రకటించింది. ఈ ఎలక్ట్రానిక్స్ డేస్, మెగా మ్యూజిక్ ఫెస్ట్ సేల్స్ వరుసగా ఫిబ్రవరి 27, ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతాయి. హెచ్‌ఎస్‌బీసీ, స్టాండర్డ్ చార్టర్డ్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి అమెజాన్ లో కనీసం రూ.8,000 కొనుగోలు చేసినట్లయితే కస్టమర్లు రూ.2,000 వరకు 7.5% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ సేల్స్ లో భాగంగా అమెజాన్ కొన్ని గ్యాడ్జెట్‌లపై 65% డిస్కౌంట్ ప్రకటించింది. మంచి క్వాలిటీతో వచ్చే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ అయిన బోట్ ఎయిర్‌డోప్స్ 441 కేవలం రూ.1,999కే అమెజాన్ లో లభిస్తున్నాయి. ఈ ఇయర్‌బడ్స్ IWP టెక్నాలజీతో వస్తాయి. దీనర్థం ఛార్జింగ్ కేస్‌ను ఓపెన్ చేయగానే ఇయర్‌బడ్స్ పవర్ ఆన్ అయి కనెక్షన్ మోడ్‌లోకి ఆటోమేటిక్ గా వెళ్తాయి. ఈ ఇయర్‌బడ్స్ బ్లూటూత్ v5.0 టెక్నాలజీతో సూపర్ ఫాస్ట్ అండ్ స్మూత్ కనెక్టివిటీని అందిస్తాయి. ప్రతి ఇయర్‌బడ్‌ 35ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. మీరు ఒకేసారి 5 గంటల పాటు వీటిని ఉపయోగించవచ్చు. క్యారీ కమ్ ఛార్జ్ కేస్‌తో అదనంగా 25H ప్లేబ్యాక్‌ను పొందవచ్చు. బ్లూటూత్ V5.0తో వచ్చే బోట్ రాకర్జ్ 550 ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్‌ కేవలం రూ.1,899కే లభిస్తోంది. ఇది 500ఎంఏహెచ్ బ్యాటరీతో 20 గంటల వరకు అత్యుత్తమ ప్లేబ్యాక్ టైం అందిస్తుంది. బోట్ రాకర్జ్ 550 హెడ్‌ఫోన్‌ను బ్లూటూత్, AUX కేబుల్ అనే రెండు మోడ్‌ల ద్వారా కనెక్ట్ చేయవచ్చు. 800ఎంఏహెచ్ బ్యాటరీతో 4 గంటల వరకు ప్లేబ్యాక్ టైం సామర్థ్యంతో వచ్చే బోట్ స్టోన్ మార్వెల్ ఎడిషన్ 5W స్పీకర్‌ను మీరు రూ.1,299కే సొంతం చేసుకోవచ్చు. ట్రూ వైర్‌లెస్ ఫీచర్‌ని కలిగి ఉండే ఈ స్పీకర్‌లోని రెండు స్టోన్ స్పీకర్‌లను ఒకేసారి కనెక్ట్ చేయవచ్చు. నాయిస్ బడ్స్ వీఎస్303 ఒక ఛార్జ్‌పై గరిష్టంగా 6 గంటల ప్లేటైమ్‌ను, ఛార్జింగ్ కేస్‌తో అదనంగా 18 గంటల పాటు ప్లేటైమ్‌ను.. మొత్తంగా 24 గంటల ప్లేటైమ్‌ను అందిస్తుంది. దీని హైపర్ సింక్ టెక్నాలజీతో ఈజీగా, ఫాస్ట్ గా కనెక్షన్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ కేస్‌ను ఓపెన్ చేయగానే ఈ బర్డ్స్ డివైజ్ కు కనెక్ట్ అయిపోతాయి. ఈ బడ్స్‌ను రూ.1,499కి పొందవచ్చు. దీని 13mm స్పీకర్ డ్రైవర్ ద్వారా మీరు అదిరిపోయే సౌండ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. సోనీ జెడ్‌వీ-1 డిజిటల్ వ్లాగ్ కెమెరాతో మీ వ్లాగ్ వీడియోలను అద్భుతంగా రూపొందించొచ్చు. సోనీ మెరుగైన కలర్ సైన్స్ వల్ల నేచురల్ ఇమేజెస్ మోర్ లైవ్లీగా వివిడ్ గా వస్తాయి. స్టెడీ-షాట్ జాయింట్ ఆప్టికల్, ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ సిస్టమ్‌ వల్ల నడుస్తున్నప్పుడు కూడా పిక్చర్ ఏమాత్రం అదరకుండా స్థిరంగా రికార్డు అవుతుంది. హ్యాండ్‌హెల్డ్ షాట్‌లు, షూటింగ్ గ్రిప్‌తో వ్లాగింగ్ కోసం తీసుకొచ్చిన ఈ కెమెరా బ్లర్, షేక్-ఫ్రీ షాట్‌ల అందిస్తుంది. ప్రస్తుతం దీని ధర రూ.69,490. జర్మన్ బ్రాండ్ Blaupunkt నుంచి Blaupunkt SBA40 సౌండ్‌బార్ ఇండియాలో విడుదలైంది. ఈ అద్భుతమైన సౌండ్‌బార్ ని కేవలం రూ.3,999కే అమెజాన్ తీసుకొచ్చింది. ఈ డ్యూయల్ పాసివ్ రేడియేటర్‌లు క్రిస్టల్ క్లియర్ సరౌండ్ సౌండ్‌ను ప్రొడ్యూస్ చేస్తాయి. Blaupunkt SBA40 బ్లూటూత్ టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్‌బ్యాండ్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ అయిన బోట్ రాకర్జ్ 330 తన 10mm డైనమిక్ డ్రైవర్ల ద్వారా చక్కటి సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ నెక్‌బ్యాండ్ ఒకేసారి 30 గంటల వరకు భారీ ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జ్ 10 గంటల వరకు ప్లే టైమ్‌ని అందిస్తుంది. ఇది ASAP ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీతో కేవలం 40 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇది రూ.1,399కి దొరుకుతుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో ఇన్-బిల్ట్ ఈక్వలైజర్‌తో బేస్, ట్రెబుల్ టోన్‌లను అద్భుతంగా డెలివరీ చేసే ఎల్‌జీ ఎఫ్‌పీ ఇయర్‌బడ్స్ రూ.9,990కి అందుబాటులోకి వచ్చాయి. జీరో లేటెన్సీ మానిటరింగ్‌తో వచ్చే పోర్టబుల్ పాడ్‌క్యాస్ట్ అయిన Maono AU-AM200 రూ.5,999కే సొంతం చేసుకోవచ్చు. మిల్లీ సెకన్లలో కూడా ఆలస్యం లేదా రిటర్నింగ్ సిగ్నల్‌లో లాగ్ లేకుండా మెరుగైన పనితీరు, రికార్డింగ్ సేవలను ఇది అందిస్తుంది. మీ వాయిస్ ని క్రిస్టల్ క్లియర్ గా రికార్డు చేసేందుకు 48Hkz/16Bit శాంప్లింగ్ రేటును ఇది ఆఫర్ చేస్తుంది. ఇది గిటార్ ప్లే చేయడానికి ప్రత్యేకంగా సరిపోతుంది. స్టూడెంట్స్, అనుభవజ్ఞులైన ప్లేయర్‌లకు బాగా ఉపయోగపడే యమహా FS100C అకౌస్టిక్ గిటార్ రూ.9,290కే మీరు కొనుగోలు చేయొచ్చు.

గూగుల్ క్రోమ్ లో ని ఈ ఫీచర్ ని తొలగిస్తోందా?


గూగుల్ క్రోమ్‌లోని లైట్ మోడ్ ఫీచర్‌ను గూగుల్ త్వరలో నిలిపివేస్తుంది, ఇది వినియోగదారుల డేటాను ఆదా చేయడానికి ఉద్దేశించిన ఫీచర్. ఈ ఫీచర్ Android స్మార్ట్ ఫోన్ ల కోసం Google Chromeలో 2014 నుండి ఉంది మరియు ప్రపంచవ్యాప్తంగా మొబైల్ డేటా చౌకగా మారినందున ఈ ఫీచర్ ఇప్పడు అంతగా ఉపయోగం లేదని భావిస్తున్నారు. అందువల్ల, త్వరలో ఈ ఫీచర్ నిలిపివేయబడుతుంది మరియు Google యొక్క AMP చొరవతో పాటు, లైట్ మోడ్ మునుపటిలాగా ఉపయోగపడదు. మార్చి 29, 2022న, కంపెనీ కొత్త Chrome M100 వెర్షన్ విడుదలతో Androidలో Google Chrome కోసం లైట్ మోడ్‌ను "ఆఫ్" చేస్తుందని Google చెబుతోంది. స్థిరమైన ఛానెల్‌లలో రాబోయే Chrome 100 విడుదలతో లైట్ మోడ్ తీసివేయబడుతుందని Google చెబుతోంది. ఈ మార్పు తాజా అప్డేట్ ని అమలు చేస్తున్న Androidలోని Google Chrome వినియోగదారులందరితో పాటు పాత అప్డేట్ లలోని వినియోగదారులను ప్రభావితం చేస్తుంది. "మార్చి 29, 2022న, స్థిరమైన ఛానెల్‌కు Chrome M100 విడుదల చేయడంతో, మేము లైట్ మోడ్‌ను ఆఫ్ చేస్తాము, ఇది Android కోసం Chrome ఫీచర్ అయిన 2014లో మేము ఫోన్‌లు మరియు వెబ్ పేజీలను వేగంగా లోడ్ చేయడానికి Chrome డేటా సేవర్‌గా పరిచయం చేసాము " అని గూగుల్ క్రోమ్ సపోర్ట్ మేనేజర్ బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. ప్రస్తుతం, వినియోగదారులు "అధునాతన" విభాగంలో Chrome సెట్టింగ్‌ల పేజీ నుండి డేటాను సేవ్ చేయడానికి ఫీచర్‌గా లైట్ మోడ్‌ను యాక్సెస్ చేయవచ్చు. లైట్ మోడ్‌లో ఉన్నప్పుడు, పేజీ లోడింగ్ వేగాన్ని వేగవంతం చేయడానికి మరియు అదే సమయంలో డేటాను సేవ్ చేయడానికి Chrome Google సర్వర్‌లను ఉపయోగిస్తుంది. ఆ పేజీలు చాలా నెమ్మదిగా లోడ్ అయ్యేవి Chrome ద్వారా గుర్తించబడతాయి మరియు వాటిని కుదించడానికి Google సర్వర్‌ల ద్వారా పంపబడతాయి. లైట్ మోడ్ Google Chrome యొక్క Android వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. Google, దాని మద్దతు పేజీలో వినియోగదారులు Lite మోడ్‌ని ఉపయోగించినప్పుడు, వారి వెబ్ ట్రాఫిక్‌లో కొంత భాగం చెబుతుంది వినియోగదారు పరికరానికి డౌన్‌లోడ్ చేయడానికి ముందు Google సర్వర్‌ల ద్వారా వెళ్లవచ్చు. XDA డెవలపర్‌లలోని నివేదిక ప్రకారం, Google Chrome కానరీలో లైట్ మోడ్ ఇప్పటికే నిలిపివేయబడింది, Chrome బీటా మరియు Chrome స్థిరమైన వెర్షన్‌లు రాబోయే వారాల్లో అనుసరించబడతాయి.

5జీ నెట్‌వర్క్‌ కు ఆగస్టు 15 టార్గెట్‌ ?


దేశంలో ఆగస్టు 15 నాటికి 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయంటెలికాం శాఖను ఆదేశించింది. ఇందులో భాగంగానే 5జీ స్పెక్ట్రంకు సంబంధించిన సిఫార్సులను మార్చి చివరి నాటికి అందించాలని టెలికాం శాఖ ట్రాయ్‌ను కోరింది. వివిధ బ్యాండ్‌లలో లభ్యమయ్యే స్పెక్ట్రంను వేలం వేసేందుకు ధరలు, పరిమాణంతో పాటు ఇతర షరతులకు సంబంధించిన సిఫార్సులను ట్రాయ్‌ చేయనుంది. ఇదిలా ఉంటే దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీ స్పీడుతో పోలిస్తే ఇంటర్‌నెట్ స్పీడ్‌ 10 రెట్లు పెరగనుంది. ప్రస్తుతం 5జీ స్పెక్ట్రమ్‌ వేలానికి సంబంధించి ట్రాయ్‌ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. 700 ఎమ్‌హెచ్‌జెడ్‌ నుంచి 526-698 ఎమ్‌హెచ్‌జెడ్‌ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల వేలానికి పాటించాల్సిన పద్ధతులను ట్రాయ్‌ రూపొందిస్తోంది. ఇక అటు టెలికాం కంపెనీలు సైతం 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. అయితే స్పెక్ట్రమ్‌ ధరలను తక్కువగా నిర్ణయించాలని పరిశ్రమ వర్గాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఇక భారత్‌లో 5జీ సేవలు ఇంకా అందుబాటులోకి రాకముందే 5జీ సపోర్ట్ ఫోన్‌లు మార్కెట్లలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే పలు బ్రాండ్‌లు 5జీ ఫోన్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే.

50 ఇంచ్ రెడ్ మీ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఆఫర్లు!


50 ఇంచ్ రెడ్ మీ స్మార్ట్ టీవీ పై అమెజాన్ భారీ డీల్స్ ప్రకటించింది. ఇటీవల Dolby Vision మరియు Dolby Atmos సపోర్ట్ తీసుకువచ్చిన రెడ్ మీ X సిరీస్ స్మార్ట్ టీవీ పైన ఈ అవేఫర్ ప్రకటించింది.Redmi (50 inches) 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీ X50 పైన ఈ భారీ ఆఫర్లను అందించింది. పెద్ద స్మార్ట్ టీవీని మంచి ఆఫర్లతో తక్కువ ధరకే కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. లేటెస్ట్ రెడ్ మీ స్మార్ట్ టీవీ 50-ఇంచ్ సైజులో 4K FHD రిజల్యూషన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని ఈ సేల్ నుండి రూ.34,999 రూపాయల అఫర్ ధరతో సేల్ చేస్తోంది. అయితే, ఈ టీవీ పైన రూ.1,000 కూపన్ అఫర్ కూడా అందించింది. ఈ కూపన్ అమౌంట్ మినహా ఇస్తే, ఇది మీకు కేవలం రూ.33,999 రూపాయికే లభిస్తుంది. అంతేకాదు, Kotak బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ద్వారా కొనే వారికి 2500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుందిల. అలాగే, Kotak క్రెడిట్ కార్డ్ తో నేరుగా కొనేవారికి 2,000 డిస్కౌంట్ మరియు HDFC కార్డ్స్ ద్వారా కొనేవారికి 1,500 రూపాయల వరకూ అదనపు డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది. ఈ టీవీ మంచి వ్యూవింగ్ ఎక్స్ పీరియన్స్ మరియు క్రిస్పీ కలర్స్ అందించడానికి Vivid Picture Engine కలిగివుంది. మంచి వ్యూవింగ్ తో పాటుగా గొప్ప సౌండ్ అందించడానికి Dolby Audio, DTS-HD మరియు DTS Virtual:X సౌండ్ టెక్నాలజీ కి సపోర్ట్ చేసే 30W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, eArc సపోర్ట్ తో మొత్తం 3HMDI పోర్ట్స్ ఉన్నాయి మరియు 2USB పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇది బ్లూటూత్ 5.0 కి మద్దతునిస్తుంది మరియు ఇథెర్నెట్ పోర్ట్, Wi-Fi సపోర్ట్ వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్స్ ని కలిగివున్నాయి. ఈ టీవీ షియోమి యొక్క Patchwall UI మరియు Android Tv 10 OS తో పనిచేస్తుంది.

Friday, February 25, 2022

మార్చి 9న రెడ్‌మీ నోట్ 11 సిరీస్ విడుదల


చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ జియోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ నుంచి నోట్ 11 సిరీస్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారైంది. భారత విపణిలోకి మార్చి 9, 2022న రెడ్‌మీ నోట్ 11 సిరీస్ లాంచ్ కానుంది. రెడ్‌మీ నోట్ 11 ప్రో, రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనున్నారు. రెడ్‌మీ నోట్ 11 ప్రో సిరీస్ గత సంవత్సరమే చైనాలో రిలీజ్ అయింది. గ్లోబల్ మార్కెట్‌లోకి కూడా ఈ సిరీస్ లాంచ్ అయింది. మార్చి 9న భారత మార్కెట్‌లోకి రానుంది. అయితే.. రెడ్‌మీ నోట్ 11 ప్రో, 11 ప్రో ప్లస్ పేరుతో చైనాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్లు భారత్‌లో మాత్రం జియోమీ 11ఐ హైపర్‌చార్జ్ పేరుతో లాంచ్ కానున్నాయి. రెడ్‌మీ నోట్ 11 ప్రో ఫోన్ ధర సుమారు రూ.22,500గా ఉండనుంది. అదే రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్‌ 5జీ ఫోన్ ధర రూ.24800 గా ఉండనుంది. డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 11 ప్రాసెసర్‌, ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ96 ఎస్‌వోసీ ప్రాసెసర్‌, 6.67 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఏఎంవోఎల్ఈడీ డిస్‌ప్లే, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్‌, 1200 ఎన్ఐటీఎస్ బ్రైట్‌నెస్‌, క్వాడ్ కెమెరా సెటప్‌, 108 ఎంపీ ప్రైమరీ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్లతో రెడ్‌మీ నోట్ 11 ప్రో ఫోన్ రానుంది. రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్ ఫోన్‌లోనూ దాదాపుగా ప్రోలో ఉన్నటువంటి ఫీచర్లే ఉన్నా.. ప్రాసెసర్ మాత్రం స్నాప్‌డ్రాగన్ 695తో రానుంది

గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి డబ్బు సంపాదించవచ్చు!?


ప్రపంచవ్యాప్తంగా మీద అత్యంత ప్రజాదరణ పొందిన నావిగేషన్ యాప్‌లలో గూగుల్ మ్యాప్స్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులు తాము ఎన్నడూ వెళ్లని గమ్యస్థానాలను త్వరగా చేరుకోవడానికి, వారి పరిసరాల్లోని కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి, ప్రయాణ సమయాన్ని అంచనా వేయడానికి మరియు భవనం లోపల కార్ పార్కింగ్ కోసం వెతకడానికి కూడా గూగుల్ మ్యాప్స్ ఉపయోగపడుతుంది. నావిగేషనల్ ప్లాట్‌ఫారమ్‌ను మరింత ఉపయోగకరంగా మరియు ఖచ్చితమైనదిగా చేయడానికి సహకరించినందుకు గూగుల్ మ్యాప్స్ వినియోగదారులకు పాయింట్‌లను అందిస్తుంది. గూగుల్ మ్యాప్స్ రివ్యూలతో వారి అనుభవాన్ని వివరించే ఫోటోగ్రాఫ్‌లు మరియు వీడియోలను పంచుకోవడం, ఏదైనా స్థలం గురించిన ప్రశ్నలకు ప్రతిస్పందించడం, స్థల సవరణలతో సమాచారాన్ని అప్ డేట్ చేయడం, తప్పిపోయిన స్థలాలను జోడించే లేదా వాస్తవాలను తనిఖీ చేయడం ద్వారా సమాచారాన్ని ధృవీకరించే వ్యక్తులకు పాయింట్‌లను అందిస్తుంది. ఈ పాయింట్లు సహకారంతో మ్యాప్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు రివ్యూ రాయడం వల్ల మీకు 10 పాయింట్లు లభిస్తాయి. అయితే స్థలం గురించిన వివరాలను సవరించడం ద్వారా మీకు 5 పాయింట్లు లభిస్తాయి. గూగుల్ మ్యాప్స్ లో పాయింట్లు పెరిగే కొద్దీ మీ స్థాయి కూడా పెరుగుతుంది. ఒక వ్యక్తి 250 పాయింట్లను సేకరించినప్పుడు అతనికి ఒక స్టార్ వస్తుంది. ఈ పాయింట్లు పెరుగుతూనే ఉంటాయి. అయితే 1500 పాయింట్లు, 5000 పాయింట్లు, 15000 పాయింట్లు మరియు మరిన్ని వివిధ ల్యాండ్‌మార్క్‌లను దాటినప్పుడు స్థానిక గైడ్ స్థాయి పెరుగుతూనే ఉంటుంది మరియు ప్రారంభ సంక్లిష్టత కూడా పెరుగుతుంది. కానీ ఈ పాయింట్లు వాస్తవ ప్రపంచంలో అస్సలు ఉపయోగపడవు. దీని అర్థం మీరు వాస్తవ ప్రపంచంలో డబ్బు కోసం ఈ పాయింట్‌లను రీడీమ్ చేయలేరు. మీరు దీన్ని గూగుల్ ప్లే స్టోర్‌లోని పాయింట్‌ల కోసం కూడా రీడీమ్ చేయలేరు. సరళంగా చెప్పాలంటే గొప్పగా చెప్పుకునే హక్కులు ఈ రివ్యూలు దేనికీ ఉపయోగపడవు. గూగుల్ మ్యాప్స్ నుండి డబ్బు సంపాదించడానికి ప్రత్యక్ష మార్గం లేనప్పటికీ పరోక్షముగా డబ్బు సంపాదించడంలో మీకు సహాయపడే రెండు సైడ్ జాబ్‌లు ఉన్నాయి. ఇందులో మొదటిది మ్యాప్ అనలిస్ట్. మ్యాప్ విశ్లేషకుడు ఆన్‌లైన్ సెర్చ్ చేయడం ద్వారా మరియు మీకు అందించిన మార్గదర్శకాలను సూచించడం ద్వారా మ్యాప్‌లోని సమాచారం యొక్క ఖచ్చితత్వాన్ని నిర్ణయిస్తారు. లయన్ బ్రిడ్జె అనేది మ్యాప్‌లు మరియు సెర్చ్ ఫలితాలు మరియు ఇతర ఇంటర్నెట్ సంబంధిత సమాచారం ఖచ్చితమైనదిగా మరియు వేగంగా పని చేస్తుందని నిర్ధారించడానికి గూగుల్ వంటి కంపెనీలతో కలిసి పనిచేసే సంస్థ. ఉద్యోగం అనువైనది మరియు ఇది గంటకు $10 (సుమారు రూ.756) నుండి $16 (రూ. 1,211) వరకు చెల్లిస్తుంది. రెండవ మార్గం ఆన్‌లైన్ మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా మారడం. చిన్న వ్యాపారాలకు ఎక్కువ మంది కస్టమర్‌లను తీసుకురావడానికి ఆన్‌లైన్ మార్కెటింగ్ కన్సల్టెంట్ ఎస్ఇఓ ప్రకటనలు మరియు వినియోగదారు రూపొందించిన కంటెంట్‌ను ఉపయోగిస్తుంది. చిన్న వ్యాపారాలు ఆన్‌లైన్‌లో గుర్తించబడటానికి మరియు మరింత మంది కస్టమర్‌లను పొందడానికి మీరు సహాయం చేయవచ్చు. లేదా మీరు వారి ఆన్‌లైన్ ఉనికిని ఆప్టిమైజ్ చేయవచ్చు. తద్వారా వారు ఎక్కువ మంది కస్టమర్‌లను పొందుతారు. అయితే దీని కోసం మీకు కొంత మార్కెటింగ్ పరిజ్ఞానం మరియు వెబ్ అభివృద్ధి నైపుణ్యాలు అవసరం ఉండవలసి ఉంటుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్ విడుదల


సామ్‌సంగ్ నుంచి బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లతో గెలాక్సీ ఏ03 ఫోన్ విడుదలయింది. గత సంవత్సరం నవంబర్‌లోనే ఈ ఫోన్‌ను వియత్నాంలో లాంచ్ చేశారు. డ్యుయల్ రేర్ కెమెరా, వాటర్‌డ్రాప్ స్టైల్ డిస్‌ప్లే నోట్స్  లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ భారత్‌లో లాంచ్ అయింది. మోటరోలా మోటో ఈ40, రియల్‌మీ సీ25 వై, టెక్నో స్పార్క్ 8సీ లాంటి ఫోన్లకు పోటీగా ఏ03 ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ ఫోన్‌లో 3జీబీ ర్యామ్ ప్లస్ 32 జీబీ వేరియంట్, 4జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ వేరియంట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. 3జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్ ధర రూ.10,499 కాగా.. 4జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.11,999. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, రెడ్ కలర్స్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. సామ్‌సంగ్ వెబ్‌సైట్‌, రిటైల్ స్టోర్స్‌, ఇతర ఈకామర్స్ వెబ్‌సైట్లలో ఈఫోన్‌ను వచ్చే వారం నుంచి కొనుగోలు చేయొచ్చు. డ్యుయల్ సిమ్‌ (నానో), ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌, యూఐ కోర్ 3.1, 6.5 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఇన్‌ఫినిటీ వీ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 20.9 ఆస్పెక్ట్ రేషియో, ఆక్టో కోర్ యూనిసాక్ టీ606 ఎస్‌వోసీ ప్రాసెసర్‌, 1.6 జీహెచ్‌జెడ్‌, 4జీబీ ర్యామ్‌, డ్యుయల్ కెమెరా సెటప్‌, 48 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, వైఫై, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ విడుదలయింది.


మోటో 60MP సెల్ఫీ కెమెరా ఫోన్ విడుదల


మోటోరోలా టీజింగ్ చేస్తున్న Moto Edge 30 Pro స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో భారీ 60MP సెల్ఫీ కెమెరా కలిగిన మొదటి ఫోన్ అవుతుంది. 144Hz రిఫ్రెష్ రేట్ 10బిట్ AMOLED ప్యానల్, వేగవంతమైన క్వాల్కమ్ ప్రోసెసర్ మరియు 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి గొప్ప ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది. మోటో ఎడ్జ్ 30 ప్రో ఒక హై ఎండ్ స్మార్ట్ ఫోన్ మరియు ఇది రూ.49,999 రూపాయాల ప్రీమియం ధరతో వచ్చింది. అయితే, ఈ ఫోన్ పైన కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్ ను కూడా మోటోరోలా అందించింది. SBI క్రెడిట్ కార్డ్ తో ఈ స్మార్ట్ ఫోన్ కొనేవారికి 5,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్ ఫోన్ మార్చ్ 4 వ తేదీ నుండి Flipkart మరియు అన్ని ప్రధాన రిటైల్ స్టోర్స్ లో లభిస్తుంది. 6.7 ఇంచ్ FHD+ రిజల్యూషన్ అందించగల AMOLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్ తో ఉండడమే కాకుండా 10-Bit కలర్ HDR10+ సపోర్ట్ మరియు 144 Hz రిఫ్రెష్ వంటి హై ఎండ్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో స్పీడ్ మరియు మల్టి టాస్కింగ్ ను చక్కగా నిర్వహించగల Qualcomm Snapdragon 8 Gen 1 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా ఇంటిగ్రేటెడ్ అడ్రినో 730 GPU గ్రాఫిక్స్ తో వస్తుంది. ఈ శక్తికి జతగా LPDDR5 RAM 8GB ర్యామ్ మరియు UFS 3.1 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 50MP OIS ప్రధాన సెన్సార్ కి జతగా 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 2MP సెన్సార్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ లో భారీ 60MP సెల్ఫీ కెమెరా ముందు భాగంలో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ తో అద్భుతమైన ఫోటో గ్రఫీని ఎంజాయ్ చేయవచ్చని మోటో తెలిపింది. ఈ Moto ఫోన్ 5000mAh బ్యాటరీని 68W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో అందించింది. 

అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం


అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ మరోసారి ప్రారంభమైంది. ఈ సేల్ ఫిబ్రవరి 28న ముగుస్తుంది. షావోమీ, వన్‌ప్లస్, సాంసంగ్ లాంటి బ్రాండ్స్ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. గరిష్టంగా రూ.1,000 డిస్కౌంట్ పొందొచ్చు. షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.6,000 డిస్కౌంట్ పొందొచ్చు. ఎక్స్‌ఛేంజ్ ద్వారా కొంటే రూ.5,000 అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో రూ.4,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, కొటక్ బ్యాంక్ కార్డులతో రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,999. హైఎండ్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.43,999. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.33,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసేవారికి రూ.20,450 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. షావోమీ హైపర్‌ఫోన్ పేరుతో ప్రచారంలోకి వచ్చిన షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 120Hz డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, హర్మాన్ కార్డన్ రూపొందించిన స్పీకర్ సిస్టమ్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇటీవల ఐకూ 9 ఎస్‌ఈ మోడల్‌లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. ఇతర ప్రీమియం స్మార్ట్‌ఫోన్లలో కూడా ఇదే ప్రాసెసర్ ఉండటం విశేషం. షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ Samsung HM2 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో 50 డైరెక్టర్ మోడ్స్, ప్రో టైమ్ ల్యాప్స్, సినిమాటిక్ ఫిల్టర్స్, ఆడియో జూమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 8కే వీడియో రికార్డింగ్ చేయొచ్చు. షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్లలో కొనొచ్చు. వర్చువల్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ టెక్నాలజీతో 3జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 120వాట్ హైపర్‌ఛార్జ్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్‌తో షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను 17 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయొచ్చు.

Thursday, February 24, 2022

లింక్డ్‌ఇన్ లో సరికొత్త ఫీచర్‌!


గ్లోబల్ క్రియేటర్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు లింక్డ్ ఇన్ తాజాగా తెలిపింది. ఇండియాలోనూ వివిధ రంగాల్లోని క్రియేటర్స్ మరింతగా రాణించడానికి ఇది ప్రొత్సాహకంగా పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. క్రియేటర్లు తమ కంటెంట్, కమ్యూనిటీలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి, ప్రొడక్టివ్ కన్వర్జేషన్స్ కోసం, సరైన అవకాశాల కోసం క్రియేటర్లను కనెక్ట్ చేయడం వంటి లక్ష్యాలను సాధించడానికి ఈ ప్రొగ్రామ్‌ను ప్రారంభించినట్లు లింక్డ్ ఇన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా, ఎంపిక చేసిన 200 మంది క్రియేటర్లు లింక్డ్‌ఇన్ కమ్యూనిటీ మేనేజ్‌మెంట్ టీమ్ సపోర్ట్ ద్వారా యాక్సెస్ పొందుతారు. ఎడ్యుకేషనల్ వర్క్‌షాప్‌లు, క్రియేటర్-టు-క్రియేటర్ నెట్‌వర్కింగ్ అవకాశాలు, రిచ్ టూల్స్, రిసోర్స్ యాక్సెస్‌పై టీమ్ లీడర్లు అయిన అంకూర్ వారికో, రాధిక గుప్తా, పూజా దింగరా, నాసిర్ యాసిన్ ఆధ్వర్యంలో క్రియేటర్లకు అవగాహన కల్పిస్తారు. సెలెక్ట్ అయిన క్రియేటర్ల ఆలోచనలకు పదును పెట్టడానికి, వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి వారికి ఆర్థికంగా గ్రాంట్ కూడా ఇవ్వనున్నారు. ఇది వారికి ప్రోత్సాహకంగా పనిచేస్తుంది. గ్లోబల్ క్రియేటర్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ను కోసం విభిన్న నేపథ్యం, అనుభవం, నైపుణ్యం ఉన్న క్రియేటర్ల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీడియో, న్యూస్, షార్ట్ ఫార్మ్ ఫోస్టులు వంటి అంశాలపై లింక్డ్ ఇన్ టూల్స్ వినియోగించి కంటెంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. హిందీ భాష క్రియేటర్ల కూడా అప్లై చేసుకోవచ్చు. మార్చి 16 వరకు అప్లికేషన్లను పంపవచ్చు. సెలక్ట్ అయిన క్రియేటర్ల జాబితాను మరికొన్ని నెలల్లో ప్రకటించనున్నారు. ప్రత్యేక ప్రసారం జరగనున్న కార్యక్రమాన్ని లింక్డ్‌ఇన్ కమ్యూనిటీ మేనేజ్‌మెంట్ బృందం లీడ్ చేయనుంది. ఈ ఈవెంట్ భారత కాలమాన ప్రకారం మార్చి 2న ఉదయం 11.30 గంటలకు లింక్డ్‌ఇన్ పేజీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ ప్రొగామ్‌ను మొదటిసారి గత ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలో విజయవంతంగా ప్రారంభించారు. అనంతరం మళ్లీ ఇప్పుడు ఇండియాలో నిర్వహిస్తుడడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా LinkedIn's USD 25 మిలియన్ల క్రియేటర్లను తయారు చేయాలనే ఉద్దేశంతోనే క్రియేటర్ యాక్సిలేటర్ ప్రొగ్రామ్‌ను రూపొందించారు. దీనిపై లింక్డ్‌ఇన్‌ ఇండియా మేనేజర్ అశుతోష్ గుప్తా మాట్లాడుతూ.. సరైన వనరుల నుంచి విభిన్న శ్రేణుల్లో క్రియేటర్లను సన్నద్ధం చేయడం, వారి కంటెంట్, సంభాషణలతో గొప్ప వ్యాపార అవకాశాలను పొందడమే గ్లోబల్ క్రియేటర్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ లక్ష్యమని వివరించారు.

ఫేస్‌బుక్‌లో అనానిమస్ పోస్ట్ ఫీచర్ ఎనేబుల్ !


ఫేస్‌బుక్ అకౌంట్ ఉన్నవారు ఏదో ఓ గ్రూప్‌లో మెంబర్‌గా ఉండటం మామూలే. ఈ గ్రూప్‌లో ఎవరు మెసేజ్ చేసినా, పోస్ట్ చేసినా అది ఎవరు చేశారో తెలుస్తుంది. అయితే ఎవరైనా తమ పేరు కనిపించకుండా గ్రూప్‌లో పోస్ట్ చేయాలంటే సాధ్యం కాదు. అయితే గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ ఓ ఫీచర్ ఎనేబుల్ చేస్తే మాత్రం ఇది సాధ్యమే. గ్రూప్ మెంబర్స్‌కు తమ పేరు హైడ్ చేస్తూ పోస్ట్ చేసే స్వేచ్ఛ ఉంది. అయితే గ్రూప్ అడ్మిన్ అనానిమస్ పోస్ట్ ఫీచర్ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫేస్‌బుక్ గ్రూప్ అడ్మిన్ అనానిమస్ పోస్ట్ ఫీచర్ ఎనేబుల్ చేస్తే ఎవరైనా తమ పేరు కనిపించకుండా పోస్ట్ చేయొచ్చు. అలాగని వారి పేరు ఎవరికీ కనిపించదనుకుంటే కూడా పొరపాటే. ఆ పోస్ట్ ఎవరు చేశారో గ్రూప్ అడ్మిన్లు, మాడరేటర్లు, ఫేస్‌బుక్ టీమ్స్‌కు తెలిసిపోతుంది. తమ పేరు కనిపించదని అభ్యంతరకరమైన పోస్టులు చేస్తే దొరికిపోవడం ఖాయం. మీ పేరు కనిపించకుండా ఫేస్‌బుక్ గ్రూప్స్‌లో పోస్ట్ చేయడానికి ముందుగా ఫేస్‌బుక్‌లో లాగిన్ కావాలి. ఆ తర్వాత గ్రూప్స్ సెక్షన్‌లోకి వెళ్లాలి. అందులో మీరు పేరు లేకుండా పోస్ట్ చేయాలనుకుంటున్న గ్రూప్ సెలెక్ట్ చేయాలి. గ్రూప్ అడ్మిన్ అనానిమస్ పోస్ట్ ఫీచర్ ఎనేబుల్ చేసినట్టైతే మీకు అనానిమస్ పోస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. అనానిమస్ పోస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత క్రియేట్  పోస్ట్ అనానిమస్ పోస్ట్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత క్రియేట్ విండో ఓపెన్ అవుతుంది. మీ పోస్ట్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. మీ పోస్ట్ గ్రూప్ అడ్మిన్లతో పాటు మాడరేటర్లకు వెళ్తుంది. గ్రూప్ అడ్మిన్, మాడరేటర్ అప్రూవ్ చేసిన తర్వాతే మీ పోస్ట్ పబ్లిష్ అవుతుంది. ఫేస్‌బుక్ గ్రూప్ అనానిమస్ పోస్ట్ ఫీచర్ ఎనేబుల్ చేయడానికి మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో లాగిన్ కావాలి. మీరు క్రియేట్ చేసిన గ్రూప్స్ ఓపెన్ చేయాలి. Admin Tools సెక్షన్‌లో Settings ఓపెన్ చేయాలి. Anonymous Posting సెక్షన్‌లో ఈ ఫీచర్ ఎనేబుల్ చేయండి. ఆ తర్వాత Save క్లిక్ చేస్తే ఫేస్‌బుక్ గ్రూప్‌లో అనానిమస్ పోస్ట్ ఫీచర్ ఎనేబుల్ అవుతుంది. 

అనువైన బిఎస్ఎన్ఎల్ 4G ప్రీపెయిడ్ ప్లాన్‌లు


భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఇప్పుడు ప్రైవేట్ టెల్కోలకు పోటీగా తక్కువ ధరలోనే ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తున్న విషయం తెలిసిందే.  4G నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన కొన్ని ప్రాంతాలలోని వినియోగదారులకు మంచి ప్రయోజనాలతో 4G ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఇప్పటికీ ఇంటి నుండి పని చేస్తున్న వినియోగదారులకు అధిక వ్యాలిడిటీతో పాటుగా ఎక్కువ డేటా ప్రయోజనాల కోసం చూస్తున్నారు. ప్రైవేట్ టెల్కోలు అన్ని కూడా ధరలను పెంచడంతో ఇప్పుడు ఎక్కువ మంది బిఎస్ఎన్ఎల్  వైపు మక్కువ చూపుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల జాబితాలో బిఎస్ఎన్ఎల్ ప్లాన్‌లు ఇతర టెల్కోల కంటే మెరుగైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ అనేది రూ.599 ధరతో లభిస్తుంది. ఇది 84 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు మొత్తం చెల్లుబాటులో 5GB రోజువారీ డేటాను మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. దేశంలోని టెలికాం ఆపరేటర్లలో ఏదీ కూడా అటువంటి ప్రీపెయిడ్ ప్లాన్ ను అందించడం లేదు. 5GB డేటా వినియోగం తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 80 Kbpsకి పడిపోతుంది.అదనంగా వినియోగదారులు జింగ్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది. ఇంకా వినియోగదారులకు 12 AM మరియు 5 AM మధ్య టెల్కో అందించే అపరిమిత ఉచిత హై-స్పీడ్ డేటా ప్రయోజనం కూడా ఉంది. తక్కువ ధరలో వెళ్లాలనుకుంటే కనుక STV_299 ప్లాన్ చాలా బాగుంటుంది. ఇది 30 రోజుల చెల్లుబాటుతో వినియోగదారులకు 3GB రోజువారీ డేటాను మరియు అపరిమిత వాయిస్ కాలింగ్‌ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. FUP డేటా వినియోగం తర్వాత డేటా స్పీడ్ 80 Kbps కి తగ్గించబడుతుంది. మరింత సరసమైన ధరలో కూడా బిఎస్ఎన్ఎల్ రూ.247 వోచర్‌ను అందిస్తుంది. ఇది 30 రోజుల వ్యాలిడిటీతో 50GB హై-స్పీడ్ లంప్-సమ్ డేటాతో వస్తుంది. ఇది మొత్తం ఒకేసారి ఉపయోగించవచ్చు. ఇంకా వినియోగదారులు ఈరోస్ నౌ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్ యొక్క ఓవర్-ది-టాప్ ప్రయోజనంతో పాటుగా బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను పొందుతారు.

రిలయన్స్ జియో నుంచి ఆఫర్ !


రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం భారీ అఫర్ ప్రకటించింది. జియో తన కస్టమర్లకు అధిక లాభాలను అందించే రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకువచ్చింది. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తాయి. అంటే, ఈ రెండు జియో ప్లాన్స్ రీఛార్జ్ చేసే కస్టమర్లు 4K కంటెంట్ కి యాక్సెస్ అందించే డిస్ని+ హాట్ స్టార్ట్ సేవలను 1 సంవత్సరం మొత్తం ఉచితంగా పొందవచ్చు.  జియో ఇటీవల తీసుకొచ్చిన రూ.1,499 మరియు రూ.4,199 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించే మనం మాట్లాడుకుంటోంది. ఈ రెండు ప్లాన్స్ కూడా రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తాయి. అంతేకాదు, అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ అధిక డేటా మరియు మరిన్ని లాభాలను కూడా తీసుకువస్తాయి.

ఉద్యోగులకు వ్యాక్సిన్ నిబంధనను ఎత్తేసిన గూగుల్


కార్యాలయానికి వచ్చి పనిచేసే తమ ఉద్యోగులకు “వ్యాక్సిన్ తప్పనిసరి” నిబంధనను ఎత్తివేస్తూ గూగుల్ నిర్ణయం తీసుకుంది. డెల్టా వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో గత జూలైలో ఉద్యోగులు, ఇంటి నుంచి పనిచేస్తున్నా, లేక కార్యాలయానికి వచ్చి పనిచేసినా వ్యాక్సిన్ తప్పనిసరి అంటూ గూగుల్ ఆదేశాలు జారీ చేయగా వ్యాక్సిన్ తీసుకోనివారు ఉద్యోగాలు కోల్పోతారంటూ హెచ్చరించింది. ఈ క్రమంలో నేడు వ్యాక్సిన్ నిబంధనలు ఎత్తివేసినట్లు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2021 జులై చేసిన “వ్యాక్సిన్ మ్యాండేట్” ప్రకటనను జనవరి 2022లో ఉపసహంరించుకుంది. అదే సమయంలో వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులకు కరోనా నిబంధనలు (మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం)ను కూడా ఎత్తివేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. నిబంధనలు ఎత్తివేయడంతో.. గతంలో మాదిరిగా ఉద్యోగులకు కార్యాలయాల్లో అందించే మస్సాజ్, ఇతర ఆటవిడుపు ప్రోత్సాహకాలను కూడా తిరిగి అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించడం కొసమెరుపు. గూగుల్ విధించిన వ్యాక్సిన్ మ్యాండేట్ ను వ్యతిరేకిస్తూ సంస్థకు చెందిన 600 మంది ఉద్యోగులు నవంబర్ 2021లో ఒక లేఖ రాశారు. అదే సమయంలో యూఎస్ లో కరోనా ఆంక్షలు కాస్త సడలించడంతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుందని గూగుల్ ప్రధాన కార్యదర్శి లోరా లీ ఎరిక్సన్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి అమెరికా ఉద్యోగులకు మాత్రమే సడలించిన నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్న ఆమె..ఇతర దేశాల్లో నిబంధనల మేరకు అక్కడి ఉద్యోగులకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తామని అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ సౌకర్యాలు కలిగిన గూగుల్ కార్యాలయాల్లో పనిచేసేందుకు అనేకమంది ఉద్యోగార్థులు ఉత్సాహం కనబరుస్తుంటారు. ఉచిత భోజనం, జిమ్, వ్యక్తిగత సౌకర్యాలు వంటి ఎన్నో వసతులను గూగుల్ అందించడమే అందుకు కారణం. కరోనా కారణంగా ఆఫీసులో పనిచేసే ఎంజాయిమెంట్ ను కోల్పోయామంటూ గూగుల్ ఉద్యోగులు ఒక సర్వేలో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఆంక్షలు సడలించిన నేపథ్యంలో తిరిగి కార్యాలయాలకు వచ్చి.. పనిచేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారని సంస్థ ప్రతినిదులు తెలిపారు. ఇక గూగుల్ కార్యాలయాల్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఉద్యోగులు ఆశిస్తున్నారు. అయితే ఇంకా వ్యాక్సిన్ తీసుకునేవారికి మాత్రం ప్రభుత్వ పరమైన ఆంక్షలు కొనసాగుతాయని కూడా గూగుల్ తెలిపింది.

Wednesday, February 23, 2022

ఎస్‌రైడ్‌ యాప్‌ను వెంటనే తొలగించండి : రిజర్వ్‌ బ్యాంక్‌


ఎస్‌రైడ్‌ టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ గురుగ్రామ్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఆర్ బీఐ వెల్లడించింది. ఈ కంపెనీ ప్రిపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్  సేవలు కూడా ఆఫర్ చేస్తోంది. అయితే ఈ యాప్‌కు రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి ఎలాంటి అనుమతి లేదు. అందుకే వినియోగదారులు ఎవరైనా ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నట్లయితే వెంటనే తొలగించాలని సూచించింది. ఈ యాప్‌కు సంబంధించి ఎలాంటి సేవలు పొందవద్దని ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ యాప్‌ వల్ల మోసపోతే ఎవ్వరు కూడా బాధ్యత వహించరని, వాలెట్‌లో డబ్బులు వేసుకోవద్దు. పేమెంట్‌ సెటిల్‌మెంట్‌ యాక్ట్‌ 2007 కింద తమ వద్ద నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఎస్‌రైడ్‌ కంపెనీ సేవలు అందిస్తోంది. ఆ యాప్‌వల్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ హెచ్చరించింది. ఎస్‌రైడ్‌ అనేది కార్‌ పూలింగ్‌ యాప్‌. ఈ యాప్‌ ద్వారా కారు బుకింగ్‌ సేవలు పొందవచ్చు. అయితే యాప్‌లను వాడే ముందు ఆర్బీఐ నుంచి పేమెంట్‌ సిస్టమ్‌ ప్రొవైడర్లుగా పని చేసే కంపెనీల వివరాలు తెలుసుకోవాలని, మీ మొబైల్‌లో యాప్స్ డౌన్‌లోడ్‌ చేసేటప్పుడు యాప్‌కు సంబంధించి వివరాలన్నీ తెలుసుకోవడం మంచిదని సూచించింది ఆర్బీఐ. ఏవైనా యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే కేవలం గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, లేదంటే యాపిల్‌ స్టోర్‌ నుంచైనా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో కొన్ని మోసపూరిత యాప్స్‌ వస్తుండటంతో అడ్డంగా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కొన్ని యాప్స్‌ వల్ల మోసగాళ్లు మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ వివరాలు తస్కరించే అవకాశం ఉంటుంది జాగ్రత్త.

ఐఐటీ హైదరాబాద్ చే స్వదేశీ 'బేస్‌స్టేషన్‌ సెల్‌ టెక్నాలజీ'


వైసిగ్‌ నెట్‌వర్క్స్‌ స్టార్టప్ కంపెనీ సహాయంతో తొలి 5జీ డేటా కాల్‌ చేసినట్లు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్‌ శాస్ర్తవేత్తలు వెల్లడించారు. ఓరాన్ టెక్నాలజీ (ఓపెన్ రెడియో యాక్సెస్ నెట్‌వర్క్) సహాయంతో 5జీ వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ను అభివృద్ధి చేసినట్లు ఐఐటీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికీ మనదేశం 2G, 3G, 4G టెక్నాలజీలను దిగుమతి చేసుకుంటుంది. ఇందులో కొన్ని వైర్‌లెస్ పరికరాలు మన దగ్గరే తయారవుతునప్పటికీ, మొత్తం సాంకేతికత, మేధో సంపత్తి డిజైన్ స్థానికంగా అందుబాటులో లేవు. దీంతో ఈ లోటును భర్తీ చేసేవిధంగా ఐఐటీ-హైదరాబాద్ పరిశోధకులు 5జీ టెక్నాలజీని దేశీయంగా అభివృద్ధి చేశారు. దీంతో టెక్నాలజీ పరంగా మనదేశం కీలక ముందడుగు వేసింది. 3.3-3.5 గిగాహెర్ట్‌జ్‌ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో 100 మెగా హెర్ట్‌జ్‌ బ్యాండ్‌విడ్త్‌కు సపోర్ట్‌ చేసే మల్టిపుల్‌ ఇన్‌పుట్‌-మల్టిపుల్‌ అవుట్‌పుట్‌ (మిమో) సామర్థ్యంగల బేస్‌స్టేషన్‌ను ఉపయోగించి డేటా కాల్‌ను అభివృద్ధి చేసినట్లు ఐఐటీ వర్గాలు వెల్లడించాయి. లైసెన్సింగ్‌ ప్రాతిపదికన ఈ సాంకేతికతను భారతీయ వైర్‌లెస్‌ పరికరాల తయారీదారులకు అందుబాటులో ఉంచుతున్నట్లు వైసిగ్‌ నెట్‌వర్క్స్‌ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సాయిధీరాజ్‌ చెప్పారు. స్వదేశీ 'బేస్‌స్టేషన్‌ సెల్‌ టెక్నాలజీ' సహాయంతో 5జీ డేటా కాల్ విజయంతంగా చేసినట్లు ఐఐటీ హైదరాబాద్ వర్గాలు తెలిపాయి. దీని ద్వారా వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ని అధిక వేగంతో అందించడమే కాకుండా ఐవోటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌థింగ్స్‌) సేవలను అందించవచ్చని తెలిపాయి. 5జీ స్వదేశీ పరిజ్ఞానం అభివృద్ధిలో ఇది కీలక పరిణామం అని ఐఐటీహెచ్‌ పరిశోధన-అభివృద్ధి విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ కిరణ్‌ కుచి తెలిపారు. తమ పరిశోధన ద్వారా 5జీ టెక్నాలజీ అభివృద్ధిలో భారత్‌ను మరింత ముందుకు తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. 5జీ రంగంలో తమ టెక్నాలజీ దేశాన్ని ఆత్మ నిర్భర్‌గా మార్చగలదని ఆశిస్తున్నట్లు ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి అభిప్రాయపడ్డారు. వైసిగ్‌ నెట్‌వర్క్స్‌ స్టార్టప్ కంపెనీని 2016లో ఐఐటీ హైదరాబాద్‌ ప్రాంగణంలోని రీసెర్చ్‌ పార్కులో ప్రారంభించారు. 5జీ సాంకేతికతపై అప్పటి నుంచి విస్తృతంగా పరిశోధనలు జరగుతూ ఉన్నాయి. ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి ఈ సంస్థ 5జీ టెక్నాలజీపై ఇప్పటివరకు 100కు పైగా పేటెంట్లను డెవలప్ చేసింది. ఇందులో 15 పేటెంట్లు 5జీ టెక్నాలజీ వినియోగించడానికి అత్యవసరమైనవి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 4జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక యూజర్ల వీడియో, మ్యూజిక్ స్ట్రీమింగ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇంటర్నెట్ వినియోగం అమాంతం పెరిగింది. ఇక 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఇంటర్నెట్ వేగం మరింత పెరగనుంది. దీంతో కొత్త కొత్త డివైజ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే దేశంలో చాలా మంది దగ్గర 5జీ ఫోన్లు ఉన్నాయి. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణె నగరాల్లో 5జీ నెట్‌వర్క్ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

ఇండియా ఐస్టోర్‌లో ఐఫోన్ 13 భారీ తగ్గింపు?


ఇండియా ఐసోర్ట్‌ లో భారీ తగ్గింపుతో ఈ ఐఫోన్ 13 మోడల్ సొంతం చేసుకోవచ్చు. ఒరిజినల్ ధర కన్నా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. వాస్తవానికి ఈ ఐఫోన్ 13 ధర విలువ మార్కెట్లో రూ.79,900గా ఉంది. ఇంత ధర పెట్టి కొనలేము అనుకునే వారికి ఇదే సరైన సమయం. ఇండియా ఐస్టోర్‌ అందించే డీల్‌ ఓసారి చెక్ చేసుకోండి. 128GB ఐఫోన్ 13 వేరియంట్ ధర రూ. 79,900గా ఉంది. ఐస్టోర్ ద్వారా కేవలం రూ. 50,900 ధరకే పొందవచ్చు. iPhone 13 సెప్టెంబర్ 2021లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. iPhone 13 సిరీస్‌లో iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Pro Max వేరియంట్లు అందుబాటులో ఉన్నారయి. 2022 ఏడాదిలో Apple కంపెనీ సెప్టెంబర్‌లో iPhone 14 మోడల్ లాంచ్ చేయనుంది. కానీ, ఈలోగా iPhone 13 కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు ధరతో పొందవచ్చు. ఇండియా iStore నుంచి 128GB వేరియంట్ iPhone 13 రూ. 50,900 కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. iPhone 13 (128GB వేరియంట్) ధర రూ. 79,900 ఉండగా.. ఇండియా iStore రూ. 5000 ఫ్లాట్ స్టోర్ డిస్కౌంట్‌తో పాటు అదనంగా రూ. 6వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ICICI బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డ్‌లు, కోటక్ బ్యాంక్ డెబిట్ క్రెడిట్కా ర్డ్‌లు, SBI క్రెడిట్ కార్డ్‌లతో సహా బ్యాక్ కార్డ్‌లపై క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంతేకాదు.. India iStore మీ పాత డివైజ్‌పై భారీ ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా పొందవచ్చు. మీరు మీ పాత ఫోన్‌కి బదులుగా రూ.18వేల వరకు సొంతం చేసుకోవచ్చు. మీరు వాడే ఫోన్లలో iPhone XR, iPhone 11 లేదా iPhone 12 ఉంటే.. Exchange Value మీ పాత ఫోన్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. మీ ఫోన్ ఫిజికల్‌గా దెబ్బతింటే  పూర్తి మొత్తాన్ని తిరిగి పొందలేరు.

మాల్‌వేర్ ను గుర్తించి తొలగించండిలా!


ఆండ్రాయిడ్ యాప్స్‌లో మాల్‌వేర్ నిత్యం కలకలం రేపుతూ ఉంటోంది. ప్రతీసారి పదుల సంఖ్యలో ఆండ్రాయిడ్ యాప్స్‌లో మాల్‌వేర్ బయటపడుతుండటం స్మార్ట్‌ఫోన్  యూజర్లను భయపెడుతోంది. మాల్‌వేర్ ఉన్న యాప్స్‌ని గూగుల్ గుర్తించి తొలగిస్తూనే ఉన్నా... అప్పటికే యూజర్ల స్మార్ట్‌ఫోన్‌లో ఆ యాప్ డౌన్‌లోడ్ అయి ఉండటం వారికి ముప్పే. గతంలో ఫీచర్ ఫోన్ కేవలం కాల్స్, మెసేజెస్ కోసం వాడేవారు. కానీ స్మార్ట్‌ఫోన్‌లో లక్షల రూపాయల లావాదేవీలు చేస్తుంటారు. కాబట్టి స్మార్ట్‌ఫోన్‌లో మాల్‌వేర్ ఉంటే యూజర్లకు చిక్కులు తప్పవు. కాబట్టి స్మార్ట్‌ఫోన్ యూజర్లు అప్రమత్తం కావడం అవసరం. చాలావరకు గూగుల్ సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు వస్తుంటాయి. అయితే మీ స్మార్ట్‌ఫోన్ తరచూ అప్‌డేట్ చేయకపోతే ఇలాంటి వైరస్‌లను గుర్తించడం కష్టం. అందుకే మీ స్మార్ట్‌ఫోన్‌లో మాల్‌వేర్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఇందుకోసం కొన్ని యాంటీవైరస్ యాప్స్ ఉన్నాయి. వాటిని డౌన్‌లోడ్ చేసి స్కాన్ చేస్తే మీ స్మార్ట్‌ఫోన్‌లో యాంటీవైరస్ సులువుగా గుర్తించొచ్చు. ఉదాహరణకు క్యాస్పర్‌స్కీ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ స్టెప్స్ ఫాలో అవండి. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో Kaspersky Internet Security సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేయాలి. Kaspersky Lab రూపొందించిన యాప్ మాత్రమే డౌన్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత క్యాస్పర్‌స్కీ యాప్ ఓపెన్ చేయాలి. టర్మ్స్ అండ్ కండీషన్స్ అంగీకరించాలి. యాప్ పర్మిషన్స్ కూడా ఇవ్వాలి. ఆ తర్వాత ready to scan మెసేజ్ కనిపిస్తుంది. Scan బటన్ ప్రెస్ చేయాలి. స్కానింగ్ పూర్తైన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌లో ఏమైనా ఇష్యూస్ ఉంటే తెలుస్తాయి. మీ స్మార్ట్‌ఫోన్‌లో వైరస్ ఉంటే క్యాస్పర్‌స్కీ యాప్ గుర్తిస్తుంది. ఆ వైరస్‌ను మీ స్మార్ట్‌ఫోన్ నుంచి తొలగించాలి. ఏదైనా యాప్‌లో వైరస్ ఉంటే uninstall మెసేజ్ కనిపిస్తుంది. యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. క్యాస్పర్‌స్కీ ఇంటర్నెట్ సెక్యూరిటీ మొబైల్ యాప్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న క్రిటికల్ ఇష్యూస్ అన్నింటినీ గుర్తిస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌కు చేటు చేసే ఫైల్స్‌ని స్కాన్ చేస్తుంది. అందులో సూచించినట్టుగా వాటిని తొలగిస్తే చాలు. ఆ తర్వాత మీ స్మార్ట్‌ఫోన్ ఓసారి రీస్టార్ట్ చేయాలి. క్యాస్పర్‌స్కీ ప్రీమియం ఫీచర్స్ కావాలనుకుంటే సబ్‌స్క్రైబ్ చేయొచ్చు. లేదా ఫ్రీ యాప్ వాడుకోవచ్చు. పైన చెప్పిన స్మార్ట్‌ఫోన్ స్కానింగ్ ఫ్రీ యాప్‌తో కూడా చేయొచ్చు. ఇక మీ స్మార్ట్‌ఫోన్‌ను తరచూ సెక్యూరిటీ అప్‌డేట్ చేస్తూ ఉండాలి.

వాట్సాప్ లో ఆరు కొత్త ఫీచర్లు !


వాట్సాప్ ఆరు కొత్త ఫీచర్లను జతచేయనున్నట్లు చెబుతున్నారు. ఈ ఆరు ఫీచర్లుగా కూడా వినియోగదారులకు మరింత ఉపయోగకరంగా ఉంటాయి. యూజర్లు వారు తమ వాట్సాప్ చివరిగా ఎప్పుడు చూశారో తెలియకుండా దాచి యాప్ కి పెట్టేలా చేసే లాస్ట్ సీన్ హైడ్ ఫీచర్ ఉండబోతుంది.

వాట్సాప్ మెసేజ్ రియాక్షన్ : వాట్సాప్ మరొక కొత్త ఫీచర్ కోసం కూడా పనిచేస్తోంది. అదే, మెసేజ్ రియాక్షన్ ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా వచ్చిన మెసేజ్ లకు ఎమోజీల పంపడం ద్వారా రియాక్ట్ కావచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీకు కావాల్సిన మెసేజ్ ని నొక్కిపట్టుకావాలి, తరువాత అక్కడ కనిపించే ఎమోజీల్లో తగిన ఎమోజీ ఎంచుకోవచ్చు.

లాస్ట్ సీన్ హైడ్ :. ఈ  ఫీచర్ ద్వారా యూజర్లు వారు వాట్సాప్ చివరిగా ఎప్పుడు చూశారో తెలియకుండా దాచిపెట్టవచ్చు. ఇది కేవలం సెలెక్టెడ్ కంటాక్ట్స్ కోసం చేయడం సాధ్యం కాదు కానీ అన్ని కాంటాక్ట్ లకు మీరు చివరిగా ఎప్పుడు వాట్సాప్ చూశారో తెలియకుండా హైడ్ చేసే విధంగా మిమ్మల్ని అనుమతించే ఫీచర్పై యాప్ పని చేస్తోంది.

ప్రొఫైల్ ఫోటో డిస్ప్లే ఆన్ నోటిఫికేషన్ : అద్భుతమైన ఫీచర్ ను జోడించబోతోంది. ప్రొఫైల్ ఫోటో డిస్ప్లే ఆన్ నోటిఫికేషన్ ఇప్పటికే కొంతమంది iOS యూజర్లకు అందుబాటులో వుంది. ఈ ఫీచర్ తో యూజర్లు కొత్త మెసేజ్ ను అందుకున్నప్పుడు నోటిఫికేషన్లో ప్రొఫైల్ ఫోటోను చూపుతుంది. iOS 15లో కొంతమంది బీటా టెస్టర్లకు ఈ ఫీచర్ విడుదల చేయబడింది.

వాట్సాప్ కమ్యూనిటీ : వాట్సాప్ గ్రూప్లను పెద్దదిగా చేయడానికి వాట్సాప్ ముందు ముందు ఒక కమ్యూనిటీలో 10 చాట్ గ్రూప్స్ ని జత చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. అయితే, ఈ ఫీచర్ కేవలం అడ్మిన్ కు మాత్రమే లభిస్తుంది మరియు దీని ద్వారా కమ్యూనిటీలోని అన్ని గ్రూప్స్ లకు మెసేజీలు పంపించవచ్చు.

వాట్సాప్ లాగ్అవుట్ : మల్టీ డివైజ్ ఫీచర తో పాటుగా లాగ్అవుట్ ఫీచర్ ను కూడా ఈ సంవత్సరం వాట్సాప్ తీసుకురావచ్చు. యూజర్లు ఈ ఫీచర్ ద్వారా తమ Facebook, Instagram ల మాదిరిగానే WhatsApp ఖాతాల నుండి కూడా లాగ్ అవుట్ చేయవచ్చు.

వాట్సాప్ రిసిపెంట్స్ యాడింగ్ : షేర్ చేసిన వాట్సాప్ రిసిపెంట్స్ ను ఇక మీరు సవరించగలరు. రిపోర్ట్ ప్రకారం, మీరు ఏ యూజర్ తో మీడియాను షేర్ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఇంటర్ఫేస్ని రీడిజైన్ చేస్తుంది.ఈ కొత్త ఫీచర్, మీ చాటింగ్ లో ఇమేజిలు, వీడియోలు మరియు GIF లను షేర్ చేస్తున్నప్పుడు స్టేటస్ అప్డేట్లపై మీడియాను అప్లోడ్ చేయడానికి అనుమతిస్తుంది. 

Tuesday, February 22, 2022

irctc BoB RuPay కార్డును ఉపయోగిస్తే తక్కువ ధరకే టికెట్..!

 

రైల్వే ప్రయాణీకులు ఇప్పుడు irctc BoB RuPay కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డ్ సహాయంతో తక్కువ ధర టిక్కెట్‌లను పొందవచ్చు. ఇది తరచుగా రైల్వే ప్రయాణికులకు గరిష్ట పొదుపులను అందించడానికి ప్రత్యేకంగా రూపొందించ బడింది. ఈ కార్డ్‌ని బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ మరియు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా ప్రారంభించాయి. irctc వినియోగదారులు BoB క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఏదైనా AC క్లాస్ రైల్వే టిక్కెట్‌ను బుక్ చేసుకుంటే చౌక టిక్కెట్‌లను పొందుతారు. ఈ కార్డ్ కిరాణా నుండి ఇంధనం వరకు ఇతర వర్గాలలో షాపింగ్ చేయడానికి బహుళ ప్రయోజనాలను కూడా పొందుతుంది. JCB నెట్‌వర్క్ ద్వారా అంతర్జాతీయ వ్యాపారులు, ATMల వద్ద లావాదేవీలు చేయడానికి కార్డ్ హోల్డర్‌లు ఈ కార్డ్‌ని కూడా ఉపయోగించవచ్చు. IRCTC ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ANI రజనీ హసిజాతో మాట్లాడుతూ, "IRCTC BoB రూపే కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డ్ కార్డ్ హోల్డర్‌లు 1AC, 2AC, 3AC, CC లేదా ఎగ్జిక్యూటివ్‌పై గరిష్టంగా 40 రివార్డ్ పాయింట్‌లను పొందగలరు. irctc వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా చేసిన క్లాస్ బుకింగ్‌లు. ఈ కార్డ్ కస్టమర్‌లకు వారి అన్ని రైలు టిక్కెట్ బుకింగ్‌లపై ఒక శాతం లావాదేవీ రుసుమును కూడా అందిస్తుంది. కార్డ్ జారీ చేసిన 45 రోజులలోపు INR 1,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఒక కొనుగోలు చేసిన కస్టమర్‌లు 1,000 పొందుతారు. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ కిరాణా మరియు డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లపై నాలుగు రివార్డ్ పాయింట్‌లను (ఖర్చు చేసిన రూ. 100కి) మరియు ఇతర కేటగిరీలపై రెండు రివార్డ్ పాయింట్‌లను అందిస్తుంది. భాగస్వామి రైల్వే లాంజ్‌లలో కార్డు హోల్డర్‌లు సంవత్సరానికి 4 కాంప్లిమెంటరీ విజిట్‌లకు అర్హులు. ఈ కార్డ్ భారతదేశంలోని అన్ని పెట్రోల్ పంపులలో ఒక శాతం ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపును కూడా అందిస్తుంది. కార్డ్ హోల్డర్‌లు వారి లాయల్టీ నంబర్‌ను వారి irctc లాగిన్ IDతో లింక్ చేసిన తర్వాత, irctc వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్‌లో పొందిన రివార్డ్ పాయింట్‌లను రీడీమ్ చేసుకోగలరు. లాంచ్‌లో మాట్లాడుతూ, NPCI, COO, శ్రీమతి ప్రవీణా రాయ్ మాట్లాడుతూ, "IRCTC భాగస్వామ్యంతో BOB ఫైనాన్షియల్ ద్వారా రూపే యొక్క కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ కార్డ్ కస్టమర్‌లు వారి రైల్వే ప్రయాణంలో ఆదా చేసుకోవడానికి మరియు రివార్డ్ పాయింట్‌లను సంపాదించడానికి వీలు కల్పిస్తుంది. ఇతర కేటగిరీలలో ఖర్చు చేయడం.రూపేతో, మిలియన్ల మంది కస్టమర్‌లకు రివార్డింగ్ అనుభవాన్ని అందించడానికి అత్యాధునిక సాంకేతికతతో కూడిన అనుకూలీకరించిన విలువ ప్రతిపాదనలను అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. భారతదేశానికి RuPayని ప్రాధాన్య క్రెడిట్ కార్డ్‌గా మార్చడానికి ఈ లాంచ్ ముందంజలో ఉందని మేము విశ్వసిస్తున్నాము.

3GB+3GB VRAMతో 7 వేలకే టెక్నోస్మార్ట్ ఫోన్ విడుదల


ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ టెక్నోఇండియాలోని బడ్జెట్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకోని Spark 8C ని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.7,499 రూపాయల ధరలో 3GB + 3GB వర్చువల్ ర్యామ్ శక్తితో అందించింది. తక్కువ ధరతో ఈ ఫీచర్ తో వచ్చిన ఏకైక స్మార్ట్ ఫోన్ గా కూడా ఇదే అవుతుంది. 90Hz రిఫ్రెష్ రేట్ బిగ్ డిస్ ప్లే మరియు 5,000mAh బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫ్యూన్ టెక్నో తీసుకువచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 3GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కేవలం రూ.7,499 రూపాయల ధరతో విడుదల చేసింది. ఫిబ్రవరి 24 నుండి ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ నుండి అమ్మకానికి వస్తుంది. అయితే, ఇక్కడ సూచించిన ధర కేవలం ఇంట్రడక్టరీ ప్రైస్ మాత్రమే.  టెక్నో స్పార్క్ 8సి స్మార్ట్ ఫోన్ పెద్ద 6.6 ఇంచ్ HD+ రిజల్యూషన్ డాట్ డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ ను 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగివుంటుంది. ఈ ఫోన్ Unisoc T606 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 3GB ర్యామ్ తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ లేటెస్ట్ HiOS 7.6 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది. ఇందులో 3GB ఎక్స్ ప్యాండబుల్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ ని అందించింది. దీని ద్వారా ఇది 6GB వరకూ ర్యామ్ శక్తిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు, యాప్స్ వేగంగా ఓపెన్ చేయడానికి మెమొరీ ఫ్యూజన్ ఫీచర్ కూడా అందించినట్లు తెలిపింది. కానీ ఈ రెండు ఫీచర్లు కూడా OTA అప్డేట్స్ ద్వారా అందుతాయని చెప్పింది. కెమెరా పరంగా, వెనుక డ్యూయల్ కెమెరా కలిగివుంది. ఇందులో 13MP మైన్ సెన్సార్ మరియు జతగా AI సెన్సార్ ని కలిగివుంటుంది. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 8MP సెన్సార్ సెల్ఫీ కెమెరాను కలిగివుంది. టెక్నో ఈ ఫోన్ ను పెద్ద 5000mAh బ్యాటరీ మరియు సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది.

యూట్యూబ్‌ నుంచి టిక్‌టాక్‌ తరహాలో కొత్త ఫీచర్!


గూగుల్‌కు చెందిన యూట్యూబ్‌ మరో కొత్త ఫీచర్‌ను యూజర్స్‌కు అందిస్తోంది. ఇతర వీడియోస్ట్రీమింగ్‌, షేరింగ్ ప్లాట్‌ఫాంలకు పోటీగా సరికొత్త అప్‌డేట్స్ అందిస్తోంది. తాజాగా టిక్‌టాక్‌ తరహాలో ఉండే లైవ్ రింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇండియాలో టిక్‌టాక్‌ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూట్యూట్‌లోని షార్ట్‌ వీడియోస్‌ ఫీచర్‌ యూజర్లను విశేషంగా ఆకట్టుకొంది. చాలా మంది టిక్‌టాక్‌ వినియోగదారులు య్యూటూబ్‌లో ఛానెల్‌ ఓపెన్‌ చేశారనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం యూట్యూబ్‌ ఛానల్ నిర్వాహకుల లైవ్‌ స్ట్రీమింగ్‌ను సూచించేలా ప్రత్యేక ఇండికేటర్‌ను తీసుకొస్తున్నట్లు యూట్యూబ్‌ నిర్వాహకులు ప్రకటించారు. కొత్తగా అలరించనున్న యూట్యూబ్‌ ఫీచర్‌ ద్వారా లైవ్‌ కంటెంట్‌ను వినియోగదారులు సులువుగా గుర్తించవచ్చు. ఛానెల్‌ నిర్వాహకులు లైవ్‌లో ఉన్నారని తెలిపేలా వారి ప్రొఫైల్‌ పిక్చర్‌ వద్ద 'Live' అనే రింగ్‌ కనిపిస్తుంది. దీని ద్వారా లైవ్‌స్ట్రీమ్‌లోకి వెళ్లి ఛానెల్‌ నిర్వాహకులతో కనెక్ట్‌ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి యూట్యూబ్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ నియల్‌ మోహన్‌ మాట్లాడుతూ..' య్యూటూబ్‌లో లైవ్‌ స్ట్రీమ్స్‌ను యూజర్స్‌ సులువుగా గుర్తించేలా చేయడంపై దృష్టి పెట్టాం. వీలైనంత త్వరగా యూజర్లకు ప్రత్యేక ఫీచర్‌ను అందించాలనే ఉద్దేశంతో పనిచేశాం. ప్రస్తుతం మొబైల్‌లో యూట్యూబ్‌ వినియోగిస్తున్న సమయంలో లైవ్‌ స్ట్రీమింగ్‌ను సూచించేలా Live రింగ్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. యూట్యూబ్‌ క్రియేటర్స్‌ ఛానల్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌ పక్కన లైవ్‌ రింగ్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే నేరుగా లైవ్‌ స్ట్రీమ్‌ ఓపన్‌ అవుతుంది.' అని వివరించారు. ఇప్పటి వరకు ఈ తరహా సదుపాయం టిక్‌టాక్‌ యాప్‌లో అందుబాటులో ఉంది. ఛానల్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌ వద్ద పల్సింగ్‌ రింగ్‌ ఎఫెక్ట్‌ కనిపిస్తుంది. ఆ రింగ్‌ కనిపిస్తే ఆ ఛానల్‌ వ్యక్తి లైవ్‌ స్ట్రీమింగ్‌లో ఉన్నట్లు అని భావించాలన్నారు. అదే విధంగా ఐఫోన్‌, ఐప్యాడ్‌లలో పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌(PiP) సదుపాయాన్ని యూట్యూబ్‌ టీవీ అందిస్తోంది. దీని గురించి నియల్‌ మోహన్‌ మాట్లాడుతూ.. 'ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంపై పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ సదుపాయం ఏరోజున అందుబాటులోకి వస్తుందనే అంశంపై కచ్చితమైన స్పష్టత ఇవ్వలేం. యూట్యూబ్‌ టీవీ యూజర్లకు కచ్చితంగా కొన్ని నెలల్లోపే ఈ సదుపాయాన్ని అందిస్తాం.' అని చెప్పారు. పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ సదుపాయం ఇప్పటికే ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఐఓఎస్‌ యూజర్స్‌ మాత్రం యూట్యూబ్‌ టీవీ పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ సదుపాయం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. సరౌండ్‌ సౌండ్‌ వంటి మరికొన్ని సదుపాయాలను తీసుకొచ్చేందుకు కూడా యూట్యూబ్‌ పని చేస్తోంది. ఈ సదుపాయం గతేడాది కొన్ని సబ్‌సెట్‌ ఆఫ్‌ డివైజస్‌కు మాత్రం అందించింది. త్వరలో అన్ని రకాల డివైజెస్‌పై, అన్ని ప్లాట్‌ఫాంలపై రన్‌ అయ్యేలా అభివృద్ధి చేయనుంది.

వొడాఫోన్ ఐడియా 'డబుల్ డేటా ఆఫర్'


వొడాఫోన్ ఐడియా (Vi) 4GB రోజువారీ డేటా ప్లాన్‌లకు సంబంధించి ఒక సంస్థ ట్విట్టర్ పోల్‌ను నిర్వహించింది. కేవలం 222 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇది పెద్ద సంఖ్య కాదు అయితే ఇది ఇప్పటికీ టెల్కో నుండి ప్రజలు ఏమి కోరుకుంటున్నారో అంతర్ దృష్టిని ఇస్తుంది. కంపెనీ నుండి డబుల్ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లను కోల్పోయామని వినియోగదారులు ఓటు వేశారు. అయినప్పటికీ Vi తన ఆదాయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నందున దాని ప్లాన్‌ల నుండి ఆఫర్‌ను తీసివేయవలసి వచ్చింది. కంపెనీ నుండి 4GB రోజువారీ డేటా ప్లాన్‌లను కలిగి ఉన్న వ్యక్తులు 4G డేటా వోచర్‌ల కోసం వెళ్లడం లేదు. ఎందుకంటే వారి వద్ద మొదటి స్థానంలో తగినంత డేటా ఉంది. ఇంకా ఈ ప్లాన్‌లు చాలా ఖరీదైనవి కూడా కావు. దీని అర్థం టెల్కో వినియోగదారులకు చాలా తక్కువ ఛార్జీ విధించడం ద్వారా వారికి చాలా ఎక్కువ ఆఫర్ చేస్తోంది. ఇది ఒక్కో వినియోగదారు సంఖ్యపై సగటు ఆదాయాన్ని ప్రభావితం చేసింది. కొన్ని నెలల క్రితం ప్రకటించిన మరియు అమలు చేయబడిన ప్రీపెయిడ్ టారిఫ్ పెంపుల యొక్క ఏకైక అంశం అన్ని టెల్కోలకు మొత్తం ARPUని పెంచడం. అందువల్ల Vi కి డబుల్ డేటా ఆఫర్‌తో కొనసాగడం సమంజసం కాదు. సంబంధం లేకుండా Vi హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాల విభాగం కింద వినియోగదారులు కంపెనీ అందించే ప్రత్యేకమైన ఆఫర్‌లను పొందుతారు. డేటా డిలైట్స్, వీకెండ్ డేటా రోల్‌ఓవర్ మరియు బింగే ఆల్ నైట్ ఆఫర్ వంటి అంశాలు వోడాఫోన్ ఐడియా నుండి ప్రీపెయిడ్ ప్లాన్‌లను చాలా మంచి ఎంపికగా మార్చాయి. రూ.299 మరియు అంతకంటే ఎక్కువ ధర వద్ద లభించే అన్ని ప్లాన్‌లు Vi హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలతో అందుబాటులో ఉంటాయి. వోడాఫోన్ ఐడియా సంస్థ తన వినియోగదారులకు గతంలో డబుల్ డేటా ఆఫర్ కింద రూ.249 ప్లాన్, రూ.399 ప్లాన్, రూ.599 మూడు ప్లాన్‌లతో అందించింది. ఇవి అందించే 1.5GB డేటాకు అదనంగా మరొక 1.5GB అదనపు హైస్పీడ్ డేటాను అందించింది. అంటే ఈ ప్లాన్‌లపై వినియోగదారులు ఒక రోజుకు 3GB డేటాను అధిక వేగంతో పొందారు. ఈ మూడు ప్లాన్‌లు వినియోగదారులకు అపరిమిత కాల్స్ మరియు 100 ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలను వరుసగా 28 రోజులు, 56 రోజులు మరియు 84 రోజుల చెల్లుబాటు కాలానికి అందించాయి. తరువాత ఈ జాబితాలో 2GB డేటాను అందించే ప్లాన్ లు కూడా చేరాయి. అదనపు డేటాలో భాగంగా ఇవి రోజుకు 4GB డేటాను అందించాయి. ఈ ప్లాన్‌లు అన్ని కూడా కొన్ని OTT సేవలకు ఉచిత యాక్సిస్ ను కూడా అందించాయి.

24 న వస్తున్న విడుదల కానున్న రియల్ మీ నార్జో 50!


రియల్ మీ నార్జో 50 స్మార్ట్ ఫోన్ ను ఫిబ్రవరి 24న ఇండియాలో విడుదల చెయ్యడానికి సిద్దమవుతోంది. ఇటీవలే, 9 Pro సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన రియల్ మీ ఇప్పుడు Narzo సిరీస్ నుండి మరొక స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తోంది. ఈ రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ నార్జో 50 స్మార్ట్ ఫోన్ యొక్క టీజింగ్ కూడా మొదలుపెట్టింది. ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ తో కూడా టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో G96 చిప్సెట్ శక్తితో పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే, ఈ ఫోన్ లో అందించిన డిస్ప్లే గురించి కూడా రివీల్ చేసింది. ఈ ఫోన్ లో 120Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే ఉన్నట్లు రియల్ మీ పేర్కొంది. ఇక అంచనా స్పెక్స్ పరంగా, ఈ ఫోన్ 4+64GB మరియు 6+128GB వేరియంట్లతో అందించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ స్పీడ్ బ్లాక్ మరియు స్పీడ్ బ్లూ రంగులలో అందించబడుతుంది. ఈ రియల్ మీ అప్ కమింగ్ USB-C పోర్ట్ ద్వారా ఛార్జ్ చేయబడే 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీతో ఉండవచ్చు. కెమెరా విభాగంలో, ఈ ఫోన్లో 50MP + 2MP + 2MP వెనుక కెమెరా సెటప్ మరియు ఈ ఫోన్ ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది. ఈ స్మార్ట్ ఫోన్ Android 12 ఆధారంగా realme UI 3.0లో పని చేస్తుంది.

ప్రైవసీ పాలసీకి యాపిల్ బాటలో గూగుల్‌

 


ఐఫోన్లకు అందించే యూజర్ ప్రైవసీను ఆండ్రాయిడ్‌ స్మార్ట్ ఫోన్లకు తెచ్చేందుకు గూగుల్ ప్రణాళికలను సిద్దం చేస్తోంది. 2021 ఏప్రిల్‌లో ఐఫోన్ల కోసం కొత్త యూజర్ ప్రైవసీ పాలసీని యాపిల్ తీసుకొచ్చింది. దీని సహాయంతో థర్డ్ పార్టీ యాప్స్ సదరు యూజర్‌ను ట్రాక్ చేయకుండా చేసే ఫీచర్ను యాపిల్ అందిస్తోంది. ఇదే ఫీచర్ ను గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్లకు తెచ్చే పనిలో పడింది. థర్డ్ పార్టీ యాప్ యూజర్ల డేటాను షేర్ చేసే విషయంలో గూగుల్ కొత్తగా ప్రైవసీ సాండ్ బాక్స్ ఫీచర్ ను తీసుకురానుంది. ప్రైవసీ మార్పుల గురించి ఆండ్రాయిడ్‌ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆంథోనీ చవెజ్ ఓ బ్లాగ్‌లో అభిప్రాయాలను వెల్లడించారు. ప్రైవేట్ అడ్వర్టయిజింగ్ సొల్యూషన్లు, కొత్త ప్రైవసీని తీసుకొచ్చేందుకు కొన్ని సంవత్సరాల కార్యక్రమాన్ని మేం ప్రకటిస్తున్నమని చెప్పారు. థర్డ్ పార్టీలతో డేటాను షేర్ చేయడాన్ని తగ్గిస్తామని చెప్పారు. కాగా ఇది ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు.  ఈ పాలసీల్లో ఈ మార్పులను తీసుకొచ్చేందుకు కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని, దీన్ని అమలు చేసేందుకు భాగస్వాములతో కలిసి గూగుల్ పని చేస్తుందని ఆంథోని వెల్లడించారు. ఇప్పటికే కొత్త విధానలను గూగుల్ అందిస్తోంది. వాట్సప్ బ్యాక్ అప్ విషయంలో ఇక గూగుల్ ఫ్రీ సర్వీస్ అందించడం లేదని తెలపింది. ఎక్కువగా ఉపయోగించే గూగుల్ అప్లికేషన్‌లలోనూ గూగుల్ మార్పులు తీసుకొస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 సేల్ ప్రారంభం !


వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ ఇటీవల ఇండియాలో లాంఛ్ అయింది. ఇప్పటికే వన్‌ప్లస్ నార్డ్, వన్‌ప్లస్ నార్డ్ 2, వన్‌ప్లస్ నార్డ్ సీఈ మోడల్స్ ఇండియాలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. లేటెస్ట్‌గా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. రూ.25,000 లోపు బడ్జెట్‌లో ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. గతేడాది రిలీజ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ అప్‌గ్రేడ్ వర్షన్‌గా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ మొబైల్ రిలీజ్ అయింది. ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌తో పాటు వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో సేల్ మొదలవుతుంది.  వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.22,499 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.23,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ ద్వారా కొనేవారికి అదనంగా రూ.3,500 ఎక్స్‌ఛేంజ్ బోనస్ లభిస్తుంది.  వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఒప్పో రెనో6, ఒప్పో రెనో7, టెక్నో పోవా 5జీ, ఇన్ఫీనిక్స్ జీరో 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఇదే ప్రాసెసర్ ఉన్న సంగతి తెలిసిందే. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ యాంగిల్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. రియర్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఏఐ సీన్ ఎన్హాన్స్‌మెంట్, ఏఐ హైలైట్ వీడియో, డ్యూయెల్ వ్యూ వీడియో, హెచ్‌డీఆర్, నైట్‌స్కేప్, పోర్ట్‌రైట్ మోడ్, పనో, రీటచింగ్, ఫిల్టర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ Sony IMX471 ఫ్రంట్ కెమెరా ఉంది. ఏఐ హైలైట్ వీడియో, ఫేస్ అన్‌లాక్, స్క్రీన్ ఫ్లాష్, హెచ్‌డీఆర్, నైట్‌స్కేప్, పోర్ట్‌రైట్ మోడ్, రీటచింగ్, ఫిల్టర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 65వాట్ SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + ఆక్సిజన్ ఓఎస్ 11.3 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 5జీ, బ్లూటూత్, వైఫై, యూఎస్‌బీ టైప్ సీ, 3.5ఎంఎం ఆడియో జాక్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. బహామా బ్లూ, గ్రే మిర్రర్ కలర్స్‌లో కొనొచ్చు.  వన్‌ప్లస్ నార్డ్ సీఈ అప్‌గ్రేడ్ వర్షన్‌గా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ రిలీజైంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల మధ్య ప్రధాన మార్పులు చూస్తే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌తో రిలీజ్ కావడం విశేషం. మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ 65వాట్ SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తుంది. ధర కూడా ఒకే రేంజ్‌లో ఉంది. అయితే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్, ఇటీవల రిలీజ్ అయిన ఒప్పో రెనో 7 మొబైల్ ఫీచర్స్ దాదాపు ఒకేలా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. 

రెడ్ మీ నోట్ 11T 5G పై అమెజాన్ లో భారీ ఆఫర్లు !


షియోమి లేటెస్ట్ గా ఇండియాలో విడుదల చేసిన Redmi Note 11T 5G అమెజాన్ ఇండియా నుండి భారీ ఆఫర్లతో లభిస్తోంది. 50MP AI క్వాడ్ రియర్ కెమెరా, 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మరియు ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చిన ఈ షియోమి 5G స్మార్ట్ ఫోన్ ను భారీ ఆఫర్లతో పొందవచ్చు. రెడ్ మి నోట్ 11టి 5జి స్మార్ట్ ఫోన్ ను Kotak బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే కస్టమర్లకు 1,000 రూపాయల అదనపు తక్షణ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అంటే, మీరు ఫోన్ పైన 1000 రూపాయల డిస్కౌంట్ ను అందుకోవచ్చు. ఈ బ్యాంక్ అఫర్ ఈరోజు అర్ధరాత్రి వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, ఎక్స్ చేంజ్ అఫర్ ద్వారా ఈ ఫోన్ కొనేవారికి 14,950 రూపాయల వరకు భారీ తగ్గింపును కూడా అఫర్ చేస్తోంది. రెడ్ మి నోట్ 11టి 5జి మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. ఇందులో మొదటిది 6GB ర్యామ్ మరియు 64GB (1GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్) వేరియంట్ మరియు దీని ధర రూ.16,999. రెండవది 6GB ర్యామ్ మరియు 128GB (2GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్) వేరియంట్ మరియు దీని ధర రూ.17,999. ఇక చివరిడి 8GB ర్యామ్ మరియు 128GB (3GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్) వేరియంట్ మరియు దీని ధర రూ.19,999. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ డిసెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Amazon, Mi.com,Mi Home మరియు Mi Studios నుండి జరుగుతుంది.కెమెరా పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP AI క్వాడ్ రియర్ కెమెరాని కలిగివుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8ఎంపి అల్ట్రా-వైడ్ కెమెరా, డెప్త్ మరియు పోర్ట్రైట్ సెన్సార్ లను అందించింది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్ల విషయానికివస్తే, ఇది MIUI 12.5 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు,Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో కూడా వస్తుంది. సెక్యూరిటీ పరంగా, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్లను కలిగివుంది. 

Monday, February 21, 2022

DIZO పవర్ ఫుల్ బ్లూటూత్ నెక్ బ్యాండ్ లాంచ్!

 

Realme అనుబంధ సంస్థ DIZO లేటెస్ట్ గా DIZO Wireless Power with ENC బ్లూటూత్ నెక్ బ్యాండ్ ను విడుదల చేసింది. ఈ బ్లూటూత్ నెక్ బ్యాండ్ ను 88 మిల్లీ సెకెండ్స్ సూపర్ లో లెటెన్సీ మరియు పెద్ద 11.2 బాస్ బూస్ట్ డ్రైవర్స్ (స్పీకర్లు) తో తీసుకొచ్చింది.ఈ డిజో నెక్ బ్యాండ్ అందమైన డిజైన్ మరియు ఆకర్షణీయమైన కలర్ అప్షన్ లలో కూడా లభిస్తుంది. దీనిని కేవలం రూ.999 రూపాయల స్పెషల్ లాంచ్ ఆఫర్ ధరతో ప్రకటించింది. ఈ నెక్ బ్యాండ్ ఫస్ట్ సేల్ ఫిబ్రవరి 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Flipkart నుండి జరుగనుంది. ఈ DIZO నెక్ బ్యాండ్ క్లాసిక్ బ్లాక్, హంటర్ గ్రీన్, వయోలెట్ మరియు బ్లూ అనే మూడు అందమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది. బ్లూటూత్ నెక్ బ్యాండ్ 11.2mm డ్రైవర్స్ తో పవర్ ఫుల్ బాస్ అందిస్తుంది. క్లియర్ వాయిస్ కాల్స్ కోసం Noise Cancellation ని కూడా వుంది. ఈ నెక్ బ్యాండ్ ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ తో 18 గంటల ప్లే బ్యాక్ అందిస్తుంది మరియు 10 మినిట్స్ ఛార్జింగ్ తో 2 గంటల ప్లే బ్యాక్ ను ఇస్తుంది. ఇది Bluetooth 5.2 తో వస్తుంది మరియు గేమింగ్ కోసం 88ms సూపర్ లో లెటెన్సీ ని కూడా జతచేసింది. సేఫ్టీ పరంగా ఈ నెక్ బ్యాండ్ IPX4 వాటర్ రెసిస్టెన్స్ తో వచ్చింది. 

30 రోజుల్లో 2 లక్షల మందికిపైగా కొన్నారు !


భారతదేశంలో ఇంధన ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మైలేజీతో పాటు పర్ఫార్మెన్స్ బాగుండే బైకులపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మంచి మైలేజీతో పాటు బైక్ డిజైన్, స్టైల్, లుక్ అన్నింటిని చూస్తున్నారు. అలాంటి టూ వీలర్ బైకుల్లో ఒకటి.. గత జనవరి నెలలో అత్యధిక స్థాయిలో కొనుగోలు చేశారు. కేవలం 30 రోజుల్లో రెండు లక్షల మందికి పైగా ఈ బైక్ కొనుగోలు చేశారట.. ఇంతకీ ఆ బైక్ పేరు ఏంటంటే.. Hero Splendor Plus.. దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన బైకు కంపనీల్లో ఇదొకటి. ఈ బైక్ ధరతో పాటు మైలేజీ, స్టయిల్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉండటంతోనే లక్షల మంది వినియోగదారులు ఈ బైకును కొనేందుకు ముందుకు వచ్చారు. ఈ హీరో Hero Splendor Plus బైకు లీటర్ పెట్రోలు పోస్తే.. 80.6 kmpl మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. జనవరి నెలలో ఆటోమొబైల్ కంపెనీల విక్రయాల డేటా ప్రకారం.. జనవరి 2022లో Hero Splendor Plus బైకు ధర అత్యధికంగా అమ్ముడైంది. హీరో స్ప్లెండర్‌కి కంపెనీ సింగిల్ సిలిండర్ 97.2CC ఇంజిన్‌ను అందించింది. ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుంది. ఈ బైకు ప్రారంభ ధర రూ. 65,610 (ఎక్స్-షోరూమ్) ఉండగా.. టాప్ వేరియంట్‌ బైకు ధర రూ.70,790 వరకు ఉంటుంది. జనవరి 2021లో కంపెనీ 2,25,383 యూనిట్లను అమ్మేసింది. అంటే.. జనవరి 2021 కన్నా జనవరి 2022 సేల్స్ తక్కువే.. ఈ బైకు కొనుగోలు చేసేవారి సంఖ్య లక్షల్లో ఉండటంతో దేశంలో ఎక్కువ మంది బైకు వినియోగదారులు ఇష్టపడే బైకుగా Hero Splendor Plus రికార్డు సృష్టించింది. Hero Splendor బైకు సింగిగల్ సిలిండఱ్ 97.2cc ఇంజిన్, ఫ్యుయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో వచ్చింది. ఈ ఇంజిన్ 8.02PS పవర్, 8.05 పీక్ టార్క్యూ, 4స్పీడ్ గేర్ బాక్సుతో వచ్చింది. బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే.. డిస్క్ బ్రేక్ ఫ్రంట్ ఇచ్చారు. డ్రమ్ బ్రేక్ రియర్ వీల్ తో వచ్చింది. అలాగే ఈ బైకు Tubeless Tiresతో వచ్చింది. రోడ్లపై రైడింగ్ చేసేటప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉండేలా కంపెనీ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ అందించింది. ఫ్రంట్ సైడ్‌లో డబుల్ క్రెడెల్ ఫ్రేమ్ అమర్చింది. రియర్ వెనుకభాగంలో ప్రీ అడ్జెస్ట్ చేసుకునేలా ట్విన్ షాక్స్ సస్పెన్షన్ ఉన్నాయి. ఇక మైలేజీ విషయానికి వస్తే.. 80.6kmpl తో ARAI సర్టిఫైడ్ అయింది. ఇకపోతే ధర, వేరియంట్ల విషయానికి వస్తే.. దేశ మార్కెట్లో హీరో కంపెనీ ఈ బైకును నాలుగు వేరియంట్లలో లాంచ్ చేసింది. Hero Splendor ప్రారంభ ధర రూ. 65,610 (Ex-Showroom)తో అందుబాటులో ఉంది.

Popular Posts