Search This Blog
Saturday, December 31, 2022
5G క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్న స్కామర్
గూగుల్ వాయిస్ లేటెస్ట్ అప్డేట్
కర్ణాటక రోడ్లపైకి ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు
స్పాటిఫై న్యూ ఇయర్ ఆఫర్ !
రూ.797 ధరకే 365 రోజుల వ్యాలిడిటీ !
యాపిల్ వాచ్పై వర్ణవివక్ష కేసు !
Friday, December 30, 2022
ఆపిల్ ఎయిర్పాడ్స్ ప్రో ఇంటి వద్దకే డెలివరీ !
రెండు లేటెస్ట్ స్మార్ట్వాచ్లు లాంచ్ చేసిన రెడ్మీ !
నిమిషాల వ్యవధిలోనే పూర్తి చార్జ్!
శాంసంగ్ గెలాక్సీ ఏ34 త్వరలో విడుదల
బ్రాడ్ కాస్టింగ్ మెసేజ్ ద్వారా ఒకేసారి 250 మందికి మెసేజ్లు !
గూగుల్ ప్లే స్టోర్లో మళ్లీ బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ?
శామ్సంగ్ స్మార్ట్ ఫ్రిజ్
Thursday, December 29, 2022
రూ.1,337 కోట్ల పెనాల్టీ !
ఎయిర్టెల్ న్యూఇయర్ ఆఫర్ !
2025లో లేటెస్ట్ ఫీచర్లతో ఐఫోన్ ఎంట్రీ !
టయోటా ఇన్నోవా హైక్రాస్ జనవరి నుంచి డెలివరీలు
మొరాయించిన ట్విట్టర్ !
ట్విట్టర్ మరోసారి మొరాయించింది. గురువారం ఉదయం ట్విట్టర్ డౌన్ అయింది. ట్విటర్ లో ఎర్రర్ మెసేజ్ కనిపించి, ఆ తరువాత ఆటోమెటిక్ గా లాగ్ అవుట్ అయ్యారు. దీనిపై వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్ డౌన్ కావడం ఇది మూడోసారి. ఆటోమెటిక్ గా లాగ్ అవుట్ అయిన తర్వాత.. ''సంథింగ్ వెంట్ రాంగ్, బట్ డోంట్ వర్రీ- ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్, లెట్స్ ట్రై అగైన్'' అంటూ మెసేజ్ కనిపించింది. మళ్లీ ప్రయత్నించినా వినియోగదారులు ట్విట్టర్ లాగిన్ కాలేకపోయారు. డౌన్డెక్టర్ వెబ్సైట్ ప్రకారం ఢిల్లీ, నాగ్పూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మరియు కోల్కతాతో సహా పలు నగరాల్లో ఈ సమస్య ఏర్పడింది. పలుమార్లు యూజర్లు రిఫ్రెష్ చేసిన లాగిన్ కాలేకపోయారు. డెస్క్ టాప్ తో పాటు మొబైల్ వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొన్నారు.
Wednesday, December 28, 2022
ఐఫోన్ యూజర్లకు ఈ యాప్స్ తో భూకంపం ఎలర్ట్స్
భూకంపం అనేది ప్రకృతి సృష్టించే విధ్వంసకర విపత్తు. ఈ విపత్తు ఎంత ప్రమాదకరంగా ఉంటుందంటే ప్రజలు ఆస్తులతో పాటు ప్రాణాలు కూడా కోల్పోతారు. తుఫాన్ హెచ్చరికలు వస్తుంటాయి కానీ ఎప్పుడు భూకంప హెచ్చరికలు రావు అని మనలో చాలా మందికి అనిపిస్తుంటుంది. అయితే మీరు ఐ ఫోన్ యూజర్లు అయితే మీకు భూకంప హెచ్చరికలు కూడా వస్తాయి. ఐ ఫోన్ యూజర్లు కొన్ని యాప్స్ ఇన్ స్టాల్ చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా భూకంపం ఎక్కడ వస్తుందని మనం మానిటర్ చేయవచ్చు. తద్వారా విదేశాల్లో ఉన్న మన బంధువులను కూడా అలర్ట్ చేసే అవకాశం ఉంది. ఈ యాప్స్ ఐ ఫోన్స్ లో పని చేయాలంటే కొన్ని సెట్టింగ్స్ ను మార్చాల్సి ఉంటుంది. ఐఓఎస్ లోని కొన్ని ఎమర్జెన్సీ ఫీచర్స్ ను యాక్సెప్ట్ చేస్తే ఈ యాప్స్ ఐ ఫోన్స్ లో పనిచేస్తాయి. ఐ ఫోన్స్ లో ఉపయోగపడే కొన్ని యాప్స్ ను ష్టార్ట్ లిస్ట్ చేశాం. ఈ యాప్స్ కచ్చితత్వంతో ఆకట్టుకోవడమే కాకుండా యూఎస్ జీఎస్ వంటి సంస్థలకు చెందిన డేటాను ఓపెన్ యాక్సెస్ చేయడంతో కచ్చితమైన సమాచారం వస్తుంది.
క్వేక్ ఫీడ్ : భూకంప హెచ్చరికలు, ట్రాకింగ్ కోసం ఐ ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉన్న అద్భుతమైన యాప్ ఇది. ఈ యాప్ యూఎస్ జీఎస్ నుంచి డేటాను సోర్స్ చేయడంతో కచ్చితమైన సమాచారం వస్తుంది. ఈ యాప్ హోం స్క్రీన్ లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన భూకంపాల జాబితాను అందిస్తుంది. డీఫాల్ట్ గా తేదీ మారుతూ భూకంప తీవ్రత, ఎంత దూరంలో వచ్చిందో చూపుతుంది. అలాగే మనకు డైలీ అలర్ట్ కూడా వస్తాయి.
మై షేక్ : మైషేక్ యాప్ కెనడా విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన యాప్. ఇది యూఎస్ జీఎస్ ద్వారా షేక్ అలర్డ్ ను వినియోగించుకుంటుంది. భూకంపం సంభివించబోతున్నపుడు ఈ యాప్ ద్వారా వాయిస్ అలర్ట్ వస్తుంది. మొబైల్ సైలెంట్ మోడ్ లో ఉన్నా వాయిస్ కమాండ్ రావడం ఈ యాప్ ప్రత్యేకత.
మై ఎర్త్ క్వేక్ అలర్ట్స్ అండ్ ఫీడ్ : ఈ యాప్ లో కూడా ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలను మానిటర్ చేసే అవకాశం ఉంది. ఇందులో మనం సెలెక్ట్ చేసుకున్న ప్రాంతాల భూకంప హెచ్చరికలను కూడా మానిటర్ చేయవచ్చు. గతంలో ఆ ప్రాంతంలో ఎంత స్థాయిలో భూకంపం వచ్చిందో కూడా తెలుసుకోవచ్చు. ఈ యాప్ లో ఉండే ప్రో వెర్షన్ యాపిల్ స్మార్ట్ వాచ్ లకు కూడా ఎలర్ట్ పంపేలా డిజైన్ చేశారు.
ఎర్త్ క్వేక్ ప్లస్ : ఈ యాప్ చాలా సరళమైన యాప్. యూఎస్ జీఎస్, ఈఎంఎస్సీ, సీఎన్ డీసీ వంటి సంస్థల ద్వారా డేటాను సోర్స్ చేస్తుంది. ఈ యాప్ హోం స్క్రీన్ లో లేబుల్ చేసిన ఫిల్టర్ల ఆధారంగా భూకంప ప్రాంతం, పరిమాణం వంటి విషయాలను తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా వచ్చే ఎలర్ట్స్ ఐ ఫోన్ వాచ్ ద్వారా కూడా మానిటర్ చేయవచ్చు.
ఎర్త్ క్వేక్స్- లేటెస్ట్ అండ్ అలర్ట్ : ఈ భూకంప ట్రాకింగ్ కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన కార్యకలాపాల కోసం 22 విభిన్న మూలాధారాలను ఎంచుకోవాలని కోరుతుంది. ఈ యాప్ యూఎస్ జీఎస్, ఈఎంఎస్సీ, బీజీఎస్ వంటి ఫీచర్లు ఉండడంతో వీటిని ఆన్ చేయడంలో అయోమయానికి గురవుతాం. ఈ యాప్ లో కూడా ప్రాంతం, తేదీ ఆధారంగా డేటాను చూసుకోవచ్చు. లోకేషన్ కోసం యాపిల్ మ్యాప్స్ ను ఉపయోగించడంతో కచ్చితమైన సమాచారం వస్తుంది.
లాస్ట్ క్వేక్ : ఈ యాప్ చాలా పాతది. అయినా కచ్చితమైన సమాచారం ఇవ్వడంతో చాలా మంది వినియోగదారులు ఈ యాప్ ను ఇష్టపడుతున్నారు. భూకంప కార్యకలాపాల ప్రతి ప్రవేశం, తేదీ, ప్రాంతం వంటి విషయాలను కచ్చితంగా పేర్కొంటుంది. ఈ యాప్ లో భూకంపంతో పాటు సునామీ హెచ్చరికలను కూడా మానిటర్ చేయవచ్చు. ఆ సమయంలో మనం పొందిన అనుభూతిని ఈ యాప్ నుంచే డైరెక్ట్ గా ట్విట్టర్ లో పోస్టో చేయవచ్చు.
ఎర్ట్ క్వేక్ ప్లస్, అలెర్ట్స్, మ్యాప్స్ అండ్ ఇన్ ఫో : ఈ యాప్ కూడా ఇతర యాప్ ల మాదిరిగా అన్ని ఫీచర్లను కలిగి ఉంది. కానీ ఈ యాప్ లో ఉన్న ఇండివిడ్యువల్ ఎంట్రీస్ అనే ఆప్షన్ ద్వారా ఎంత మంది ఈ యాప్ ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నారో? చూడవచ్చు.
అల్జీమర్స్ను గుర్తించే మరో కొత్త రక్త పరీక్ష
2023 సంవత్సరంలో సూర్య, చంద్ర గ్రహణాలు
ప్రతి ఏడాది సూర్య గ్రహణాలు, చంద్రగ్రణాలు సంభవిస్తుంటారు. ఇలాంటి గ్రహణాలపై అందరు దృష్టి సారిస్తుంటారు. వాటి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా మహిళలు ఏడాదిలో ఎప్పుడు, ఏ సమయంలో సూర్య, చంద్ర గ్రహణాలు సంభవిస్తుంటాయో తెలుసుకుంటారు. ఈ ఏడాది కూడా గ్రహణాలు సంభవించనున్నాయి. భారతదేశంలో ఎన్ని గ్రహణాలు కనిపిస్తాయో అనే విషయాలపై దృష్టి సారిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో జ్యోతిషశాస్త్ర వివరాల ప్రకారం.. 2023 సంవత్సరంలో ఎన్ని గ్రహణాలు, ఎప్పుడు ఏర్పడతాయో తెలుసుకుందాం. వచ్చే ఏడాదిలో వచ్చే భారతదేశంలో 4 గ్రహణాలు సంభవించనున్నాయి. 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు.
మరో 2 నగరాల్లో ఎయిర్టెల్ 5G ప్లస్ సర్వీసులు
జనవరి 3న పోకో సి50 విడుదల ?
అమ్మకానికి డార్క్ వెబ్లో 3 కోట్ల మంది ప్రయాణీకుల పేరు, ఫోన్ నంబర్లు ?
భారతీయ రైల్వే వినియోగదారుల డేటా ఆన్లైన్లో లీక్ అయినట్లు సమాచారం. డార్క్ వెబ్ ద్వారా ఒక హ్యాకర్ డేటాను అమ్మకానికి పెట్టినట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. అత్యున్నత వైద్య సంస్థ - ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పై డేటా ఉల్లంఘన జరిగిన కొద్ది రోజులకే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు, ప్రభుత్వం లేదా భారతీయ రైల్వేలు డేటా ఉల్లంఘన గురించి ఏమీ ధృవీకరించలేదు. ఇందులో నిజమెంత అనేది క్లారిటీ లేదు. అందులోనూ హ్యాకర్ అందించిన డేటా కచ్చితమైనదో లేదో తెలియదు Times Now నుంచి వచ్చిన నివేదిక ప్రకారం.. హ్యాకర్లు ఈ-మెయిల్, మొబైల్ నంబర్, అడ్రస్, వయస్సు, లింగంతో సహా చాలా యూజర్ డేటాను పొందారని తెలిసింది. భారతీయ రైల్వే ప్రయాణికుల ట్రావెల్ హిస్టరీ, ఇన్వాయిస్లను కూడా గ్రూప్ లీక్ చేసిందని ఆ హ్యాకర్ పేర్కొన్నాడు. లీక్ అయిన డేటాలో యూజర్ డేటాతో పాటు యూజర్ల బుకింగ్ డేటా కూడా ఉందని తెలిసింది. ఫోరమ్ డేటా కాపీకి 400 డాలర్లు వసూలు చేస్తోంది. కొనుగోలుదారు కేవలం 5 కాపీలను మాత్రమే పొందగలరు. మరో నివేదిక ప్రకారం.. డేటాకు ప్రత్యేకమైన యాక్సెస్ కావాలనుకునే వారు డేటా, ఇతర వివరాల కోసం 1,500 డాలర్లు నుంచి 2000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. డేటా ఉల్లంఘన డిసెంబర్ 27న జరిగినట్లు తెలిసింది. డేటా లీక్ గురించిన వివరాలను హ్యాకర్ ఫోరమ్లో పోస్ట్ చేశారు. అసలు వారు ఎవరు అనేది మాత్రం అసలు గుర్తింపు ఇంకా తెలియదు. దీనిని ‘షాడో హ్యాకర్’ అనే వ్యక్తి పోస్ట్ చేశారు. అదో ఫేక్ నేమ్. ప్రభుత్వ శాఖల్లోని పలువురి అధికారిక ఈ-మెయిల్ అకౌంట్లను కూడా యాక్సస్ చేసినట్టు అదే హ్యాకర్ గ్రూప్ చెబుతోంది. ప్రస్తుతానికి, హ్యాకర్ గ్రూప్ IRCTC డేటాను ఎలా యాక్సెస్ చేయగలదో సమాచారం లేదు. లేటెస్ట్ డేటా ఉల్లంఘన అథెంటికేషన్ సైబర్ సెక్యూరిటీ సంస్థలు సైతం ఇంకా ధృవీకరించలేదు.
Tuesday, December 27, 2022
ఫిబ్రవరిలో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 ఎఫ్ఈ ?
ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఫోన్ ఐక్యూ 11
అర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ దుస్తుల్లో మెరిసిన మోడల్స్
ఫిబ్రవరి 10న వన్ప్లస్ 11 విడుదల
టాటా సరికొత్త ఎలక్ట్రిక్ కారు టిగోర్ !
స్మార్ట్ ఫోన్ కొంటే స్మార్ట్ వాచ్ ఉచితం !
Monday, December 26, 2022
ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ !
ఫ్లిప్కార్ట్ తన యాప్, వెబ్సైట్లో ఇయర్ ఎండ్ సేల్ను నిర్వహిస్తోంది. డిసెంబర్ 24న ప్రారంభమైన ఈ సేల్ డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్వాచ్లు, TWS ఇయర్బడ్లు, మరిన్ని ప్రొడక్టులపై డిస్కౌంట్లను అందిస్తుంది. అలాంటి ఒక ఆఫర్ స్మార్ట్టీవీలలో అందుబాటులో ఉంది. రూ. 25వేల లోపు స్మార్ట్ టీవీలపై కొన్ని బెస్ట్ డీల్లు ఉన్నాయి. Realme 100.3 cm (40 inch) Full HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ TV తగ్గింపు ధర రూ.19,999గా ఉంది. ఆసక్తి ఉన్న కస్టమర్లు రూ. 2,000 వరకు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలను ఉపయోగించడంపై 10 శాతం తగ్గింపును పొందవచ్చు. అదనంగా, డీల్ రూ.11వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్తో వస్తుంది. ఈ స్మార్ట్టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవుతుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్స్టార్ వంటి మరిన్ని యాప్లకు సపోర్టు ఇస్తుంది. OnePlus Y1 100 cm ( 40 inch) ఫుల్ HD LED స్మార్ట్ Android TV రూ. 21,999 ధరతో వస్తుంది. ఆసక్తి కలిగన కస్టమర్లు రూ. 2,000 వరకు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలను ఉపయోగించడంపై 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, డీల్ రూ. 11వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్తో వస్తుంది. ఈ స్మార్ట్టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవుతుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్స్టార్ వంటి మరిన్ని యాప్లకు సపోర్టు ఇస్తుంది. డాల్బీ ఆడియోతో కూడిన Mi 5A 100 సెం.మీ (40 అంగుళాల) Full HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ధర రూ. 21,999గా ఉంది. ఆసక్తి ఉన్న కస్టమర్లు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. రూ. 5,000 ఆర్డర్లపై రూ. 3,000 వరకు అదనంగా, ఈ డీల్ రూ.11వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవుతుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్స్టార్ వంటి మరిన్ని యాప్లకు సపోర్టు ఇస్తుంది. OnePlus Y1S 108 cm (43 అంగుళాలు) Full HD LED స్మార్ట్ Android TV Android 11, బెజెల్-లెస్ ఫ్రేమ్తో రూ. 24,999 ధరతో వస్తుంది. కస్టమర్లు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలను ఉపయోగించి రూ. 2,000 వరకు 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, డీల్ రూ.16,900 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్తో వస్తుంది. ఈ స్మార్ట్టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవుతుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్స్టార్ వంటి మరిన్ని యాప్లకు సపోర్టు ఇస్తుంది.
సీఈఓ పోస్ట్ కు నేను రెడీ !
డోంట్ డిస్టర్బ్ !
Sunday, December 25, 2022
నెట్ లేకపోయినా అమౌంట్ ట్రాన్స్ఫర్ ?
ఫోన్కు ఎక్కువ బ్రైట్నెస్ పెట్టకండి !
సూర్య విస్ఫోటనంపై నాసా పరిశోధన !
మావి మూలకణాలతో బాలుడికి పునర్జన్మ !
గిరాకీ పెరిగిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ !
ఫిబ్రవరి 7న వన్ప్లస్ సరికొత్త ఉత్పత్తుల విడుదల
Wednesday, December 21, 2022
రేపు పగలు నిడివి 10 గంటల 40 నిమిషాలు..!
ఖగోళంలో మార్పులు కొన్నిసార్లు డిసెంబర్ 21 న వస్తుండగా ఇంకొన్నిసార్లు 22 వ తేదీన జరుగుతాయి. ఇంతకుముందు 2020 లో డిసెంబర్ 21 న షార్టెస్ట్ డే వచ్చింది. కాగా, ఈసారి డిసెంబర్ 22 వస్తున్నది. షార్టెస్ట్ డే అంటే తక్కువ పగలు ఉండి, రాత్రి సమయం ఎక్కువగా ఉన్న రోజు. సాధారణంగా పగటి సమయం 12 గంటలుగా ఉంటుంది. అయితే, ఈ షార్టెస్ట్ డే నాడు మాత్రం పగలు 10 గంటల 40 నిమిషాల నిడివి ఉండనున్నది. ఉజ్జయిని జివాజీ అబ్జర్వేటరీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రకాష్ గుప్తా ప్రకారం, ప్రతి ఏటా డిసెంబర్ 21 లేదా 22న సూర్యుడు మకర రాశిలో ఉంటాడు. అంటే దీని తర్వాత ఉత్తరార్ధగోళం వైపు కదులుతాడు. దీని కారణంగా భూమి ఉత్తర భాగంలోని దేశాలలో పగలు పొడవు క్రమంగా పెరగడంతో రాత్రి సమయం తగ్గడం మొదలవుతుంది. ఇదే సమయంలో దక్షిణార్ధగోళంలోని దేశాలలో సూర్యకాంతి చాలా కాలం పాటు భూమిపై ఉంటుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో దీనిని అతిపెద్ద రోజుగా పిలుస్తారు.
వాట్సాప్లో కాల్ రికార్డింగ్ ఫీచర్ ?
ఈ సంవత్సరం ముగియబోతున్నా ఇప్పటికీ కొన్ని ముఖ్యమైన ఫీచర్లు వాట్సాప్ లో కనిపించలేదు. ప్రస్తుతం వాట్సాప్ తన వినియోగదారులకు ఆటోమేటిక్ మెసేజ్ డిలీషన్ ఆప్షన్ ను ఇస్తుంది. అయితే మెసేజ్ షెడ్యూలింగ్ కోసం ఇంకా ఆప్షన్ లేదు. కొందరికి మెసేజ్ షెడ్యూలింగ్ ఆప్షన్ చాలా ముఖ్యమైనది. వాట్సాప్ ను తమ పని కోసం కూడా ఉపయోగిస్తూ, అవసరమైతే రాత్రిపూట ఎవరి ప్రైవసీలో జోక్యం చేసుకోకుండా తమ ఉద్యోగులకు ఉదయాన్నే నోటిఫికేషన్లు పంపాలనుకుంటున్నారు. ప్రస్తుతం వాట్సాప్ లో మెసేజ్ డిలీట్ చేసే ఆప్షన్ తప్ప ఎడిట్ చేసే అవకాశం లేదు. త్వరలో ఈ ఫీచర్ ను కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకురానుందని వార్తలు వస్తున్నాయి. వాట్సాప్ లో పొరపాటున పంపిన మెసేజ్ ను డిలీట్ చేసే ఆప్షన్ మాత్రమే ఉంది. అయితే మెసేజ్ డిలీట్ చేసిన తర్వాత, తొలగించినట్లు తెలుస్తుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. కాబట్టి త్వరలో వాట్సాప్ లో రావచ్చు. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ మెసెంజర్ మాదిరిగానే వాట్సాప్ కూడా తన వినియోగదారులకు మరో ఫీచర్ ను అందుబాటులో ఉంచవచ్చు. ఈ ఫీచర్ వినియోగదారులకు తాత్కాలిక చాట్ థ్రెడ్ ను సృష్టించే అవకాశాన్ని ఇస్తుంది. ఇది చాట్ ముగిసిన వెంటనే ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుంది. చాలా సున్నితమైన సమాచారాన్ని షేర్ చేసుకునే వారికి ఈ ఆప్షన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాట్సాప్ లో ఈ ఫీచర్ వస్తుందా అని చాలా మంది వాట్సాప్ వినియోగదారులు ఎదురుచూస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ ఫీచర్ ను దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది. కానీ వాట్సాప్ తన ప్రత్యర్థులకు సవాలును ఇస్తూ, లాస్ట్ సీన్, ఆన్లైన్ ఫీచర్ల మాదిరిగానే కాల్ రికార్డింగ్ ను ఆన్ లేదా ఆఫ్ చేసే ఆప్షన్ను కూడా అందించే అవకాశం ఉంది.
ఇదే ఇన్సైడ్ ల్యాండర్ చివరి ఫొటో కావచ్చు !
అంగారక గ్రహంపై పరిశోధనలకు ప్రయోగించిన నాలుగేండ్ల తర్వాత నాసా ఇన్సైడ్ ల్యాండర్ చివరకు తన కార్యకలాపాలను ముగించేందుకు సిద్ధమైంది. 2018 నుంచి మార్స్ అంతర్గత నిర్మాణంపై కీలకమైన సమాచారాన్ని శాస్త్రవేత్తలకు అందించింది. తన శక్తి తక్కువైపోయిందని, ఇదే చివరి ఫొటో కావచ్చుననే కాప్షన్తో నాసా తన ట్విట్టర్ హ్యాండిల్లో ఇన్సైట్ ల్యాండర్ తీసిన ఒక ఫొటోను పోస్ట్ చేసింది. అంగారకుడిపై భూకంపాలను గుర్తించి వాటిపై అధ్యయనం చేసేందుకు అమెరికాకు చెందిన నాసా 2018 లో మార్స్ పైకి ఇన్సైట్ ల్యాండర్ను పంపింది. ఇటీవల తన చివరి ఫొటోను పంపింది. సోలార్ ప్లేట్లపై దుమ్ము, ధూళి చేరడంతో దాని శక్తి మెల్లమెల్లగా క్షీణిస్తున్నది. దీంతో ' నా శక్తి తగ్గిపోయింది. అందుకని ఇదే నా చివరి ఫొటో కావచ్చు. మిషన్ బృందంతో సాధ్యమైతే మాట్లాడుతూ ఉంటాను. త్వరలో సైన్ ఆఫ్ చేస్తాను. నాతో ఇన్నాళ్లు ఉన్నందుకు ధన్యవాదాలు' అని ఇన్సైట్ ల్యాండర్ పంపిన సందేశాన్ని నాసా ట్విట్టర్లో షేర్ చేసింది. నాసా పోస్ట్ చేసిన ఈ ట్వీట్ను ఇప్పటివరకు 6.5 లక్షకు పైగా లైక్ చేశారు. 'సోలార్ ప్యానెల్స్ దుమ్ము, ధూళితో కప్పుకపోవడంతో శక్తిని ఉత్పత్తి చేసుకోవడం కష్టతరంగా ఉన్నదని, తన కార్యకలాపాలు ముగించే సమయం దగ్గర పడింది' అని నవంబర్ 10 న నాసా తన ట్విట్టర్ హ్యాండిల్పై రాసింది. ఈ ట్వీట్ కూడా ఇన్సైట్ ల్యాండర్ కార్యకలాపాలు త్వరలో ముగుస్తాయనే వాస్తవాలను సూచిస్తుండటం ఆసక్తికరం.
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...